పంజా కంటే ముందే అడివిశేష్ నటించిన ఈ పాత తెలుగు సినిమా ఏదో తెలుసా..? అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు..!

పంజా కంటే ముందే అడివిశేష్ నటించిన ఈ పాత తెలుగు సినిమా ఏదో తెలుసా..? అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు..!

by Anudeep

Ads

అడివి శేష్ తెలియని సినిమా లవర్ ఉండరంటే అతిశయోక్తి కాదు. థ్రిల్లర్ శైలిలో ఆయన చిత్రాలు ఇతర తెలుగు చిత్రాలకు భిన్నంగా ఉంటాయి. ఎవరు ఊహించని ట్విస్టులతో సినిమా ఆద్యంతం రసవత్తరంగా సాగుతూ ఉంటుంది. అయితే.. అడివిశేష్ చాలా చిన్నతనం నుంచే సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు అన్న సంగతి చాలా మందికి తెలియదు.

Video Advertisement

వాస్తవానికి చాలా మందికి అడివి శేష్ పంజా సినిమాలో ఓ రోల్ లో నటించి ప్రేక్షకులకి పరిచయం అయ్యారని మాత్రమే తెలుసు. కానీ, ఆయన అంతకుముందు కూడా సినిమాల్లో నటించారన్న సంగతి తెలియదు.

adavisesh 2

అడివిశేష్ కేవలం రైటర్ గా తన సత్తా చాటుకోవడమే కాకుండా.. కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ లోనూ అలరించారు. ఆయన తీసిన క్షణం , ఎవరు, గూఢచారి వంటి సినిమాలు ఆయన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసాయి. కెరీర్ మొదట్లో కర్త, కిస్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అడివిశేష్ ఆ తర్వాత రచయితగా కొనసాగుతూ వచ్చారు.

adavisesh 3

బాహుబలి సినిమాలో కూడా గెస్ట్ రోల్ చేసిన అడివిశేష్ కు ఆ స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు. ప్రస్తుతం అడివిశేష్ మేజర్ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇది ఇలా ఉంచితే.. అడివిశేష్ తన కెరీర్ ప్రారంభంలో “సొంతం” సినిమాలో గెస్ట్ రోల్ లో నటించారు. ఈ సినిమాని అందరం చూసాం కానీ, ఆ గెస్ట్ రోల్ చేసింది అడివి శేష్ అని చాలా మందికి తెలియదు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సొంతం మూవీలో అడివిశేష్ ఉన్నారా..? అంటూ ఫాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.


End of Article

You may also like