గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రపంచ టెలివిజన్ హిస్టరీలోనే ఈ షోకి వచ్చినంత పాపులారిటీ ఇంకే షోకి దక్కలేదని చెప్పవచ్చు. మొదట హెచ్బీవో ఛానల్ లో 2011 నుంచి 2019 వరకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రసారం అయ్యింది. దీనికి వచ్చిన ఆదరణ చూసి, వెబ్ సిరీస్ గా తెరకెక్కించారు.
ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వెబ్ సిరీస్ కు విపరీతమైన క్రేజ్ లభించింది. కేవలం ఈ సిరీస్ చూడడం కోసమే చాలా మంది నెట్ ఫ్లిక్స్ కు సబ్ స్క్రైబర్స్ అయ్యారు. GOT వీక్స్ అని స్నేహితులతో కలిసి నైట్ అవుట్ చేసి ఈ వెబ్ సిరీస్ చూసేవాళ్లు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి తెలుగు ఆడియెన్స్ లో కూడా వీరాభిమానులు ఉన్నారు.
తెలుగులో అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సిరీస్ ను చూసినవారెంతో మంది ఉన్నారు. తెలుగులో గేమ్ ఆఫ్ థ్రోన్స్ లేదని చాలా మంది ఫ్యాన్స్ బాధ పడుతుండేవారు. అయితే త్వరలో తెలుగులో గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ తర్వాత ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ పార్టనర్ గా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ మారింది. కానీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో లేదు.
ఆ స్ట్రీమింగ్ హక్కులను జియో సినిమా తీసుకుంది. స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న తరువాత జియో సినిమా భారతీయ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అభిమనులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వెబ్ సిరీస్ జియో సినిమాలో తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ భాషలలో కూడా స్ట్రీమ్ అవనుంది. ఈ న్యూస్ విన్నప్పటి నుండి ఎప్పుడెప్పుడు ప్రాంతీయ భాషలలో స్ట్రీమ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే బాహుబలి 2 సినిమాలోని సన్నివేశాలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుండి కాపీ చేశారని బాహుబలి ట్రైలర్ రిలీజ్ అయినపుడు విమర్శలు వచ్చాయి. బాహుబలి పై నుండి వస్తున్న అగ్ని బాణాలకు ఆకాశం వైపు చూస్తూ చేతులు తెరుస్తాడు. ఇలాంటి సీన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఉంటుంది. అలాగే అమరేంద్ర బాహుబలి ఖడ్గం లాంటి ఆయుధం కూడా ఆ సిరీస్ లో కనిపిస్తుంది.
Also Read: “జైలర్” సినిమాలో “రజినీకాంత్ కోడలు” పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

సూపర్ స్టార్ రజినికాంత్ మూవీ విజయం సాధించి చాలా ఏళ్లు అవుతోంది. అందువల్ల మొదట్లో ఏమాత్రం అంచనాలు లేని జైలర్ మూవీ, ట్రైలర్ తో రిలీజ్ కు ముందు మంచి హైప్ తెచ్చుకుంది. రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ క్యామియో రోల్స్ లో కనిపించారు. తమన్నా, సునీల్, వినాయకన్ కీలకపాత్రలలో నటించారు.
అయితే ఈ మూవీలో రజినీకాంత్ కోడలి పాత్రలో కనిపించిన నటి కూడా హీరోయిన్ అనే విషయం చాలామందికి తెలియదు. ఆమె తెలుగు చిత్రాలలో కూడా హీరోయిన్ గా నటించింది. ఆమె అసలు పేరు అదితి. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత మిర్నా మేనన్గా మారింది. టాలీవుడ్ లో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘క్రేజీ ఫెలో’, అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన ‘ఉగ్రం’లో కూడా హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
మిర్నా మేనన్ కేరళలో ఇడుక్కిలో జన్మించింది. ఇండస్ట్రీకి రాకముందు ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్గా వర్క్ చేసింది. ఆ తరువాత ఆమె ఫొటోలని చూసి ఒక దర్శకుడు తన మూవీలో అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా 2016లో ‘పట్టదారి’ అనే సినిమాలో నటించింది. ఆ తరువాత ‘కలవని మప్పిలై’ అనే సినిమాలో నటించింది. కోలీవుడ్ లో రెండు చిత్రాలు చేసిన తరువాత మలయాళంలో మోహన్లాల్ నటించిన ‘బిగ్ బ్రదర్’ మూవీలో నటించింది. అలా ఆమెకు గుర్తింపు వచ్చింది.
కానీ ఇటీవల కాలంలో ప్రసారం అవుతున్న కొన్ని సీరియల్స్ లోని సన్నివేశాలు లాజిక్స్ కి దూరంగా తీస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలను చూసిన నెటిజన్లు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, వైరల్ చేస్తున్నారు. ఇలా పలు సీరియల్స్ లోని సీన్లు వాస్తవానికి దూరంగా ఉండడంతో నెట్టింట్లో విపరీతమైన ట్రోలింగ్ కి గురవుతున్నాయి.
తాజాగా ప్రసారం అయిన ఒక హిందీ సీరియల్ లో టెలిఫోన్ వైర్ దాని ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నించే సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో అయితే ఇలాంటివాటిని అంతగా ప్రేక్షకులు పట్టించుకొనే వారు కాదు. అయితే ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరగడంతో ఇలాంటి సన్నివేశాల పై విపరితమైన ట్రోల్స్ పెరుగుతున్నాయి. తాజాగా ఒక హిందీ సీరియల్ కు చెందిన సీన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సదరు సీరియల్ లో ఒక వ్యక్తి కాల్ మాట్లాడుతూ నడుస్తూ, జారీ కిందపడతాడు. అయితే ఈ క్రమంలో అతని చెయ్యి టెలిఫోన్ ను తాకుతుంది. దాంతో రిసీవర్ ఎగిరి పైన తిరుగుతున్న ఫ్యాన్ పై నుండి కిందికి వచ్చి అతని మెడకు చుట్టుకుంటుంది. ఆ వైర్ అలా వస్తూనే, అతని మెడకి మరింతగా చుట్టుకుంటూ ఉంటుంది. అంతలోనే ఆ గదిలోకి వచ్చిన వారు అతన్ని కాపాడడానికి ప్రయత్నిస్తారు. ఇక ఈ సీన్ చూసిన నెటిజెన్లు ‘ఎలా వస్తాయి రా ఇలాంటి ఐడియాలు’ అంటూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
దాదాపు పదేళ్ళ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన మూవీ భోళా శంకర్. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించగా, కీలక పాత్రలో యంగ్ హీరో సుశాంత్ నటించారు. ఈ మూవీ ఆగస్ట్ 11 న విడుదల అయ్యి, మొదటి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీలోనీ సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, మీమ్స్ క్రియేట్ చేస్తూ నెటిజెన్లు ఈ మూవీని, మెహర్ రమేష్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
సినిమా పోయి మేకర్స్ దగ్గర నుండి అభిమానుల వరకు బాధలో ఉంటే, మరో వైపు ఈ మూవీ ప్లాప్ అవడం కూడా మంచిదే అని కొందరు అంటున్నారు. ఇది అన్నది సినీ ప్రేక్షకులు కాదు, టీమిండియా అభిమానులు. అలా అనడానికి కారణం ఏమిటంటే, 2011లో మెహర్ రమేశ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తీసిన ‘శక్తి’ మూవీ రిలీజ్ అయ్యి, డిజాస్టర్ గా నిలిచింది. అయితే అదే ఏడాది ధోనీ సేన వన్డే ప్రపంచ కప్ ను సాధించింది. ఇది భారత్ గెలిచిన రెండవ ప్రపంచ కప్.
ఆ తరువాత 2013లో మెహర్ రమేష్ వెంకటేశ్ హీరోగా తీసిన ‘షాడో’ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే అదే ఏడాది భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. ఇక ఈ ఏడాది కూడా ప్రపంచ కప్ జరగనుంది. మెహర్ రమేశ్ తీసిన భోళా శంకర్ మూవీ ప్లాప్ అవడం అటు చిరంజీవికి, ఇటు మెగా ఫ్యాన్స్కు ఊహించని విధంగా షాకిచ్చింది. మెహర్ రమేష్ ప్లాప్ సెంటిమెంట్ కొనసాగితే, ఈ ఏడాది కూడా ప్రపంచ కప్ ఇండియాదే అని టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
టీటీడీఎఫ్ఓ శ్రీనివాసులు బీబీసి న్యూస్ తో మాట్లాడుతూ చిన్నారి పై దాడి చేసిన చిరుత, బోనులో చిక్కిన చిరుత ఒక్కటేనా కాదా అనే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. చిరుత పులి కడుపులో మానవ మాంసమకు చెందిన ఆనవాళ్లు ఉన్నాయో? లేదా అనే దానిని తెలుసుకుంటాం. నిపుణులు చిన్నారి పై దాడి చేసిన చిరుత ఇదేనా కాదా అని నిజ నిర్ధారణ చేస్తారని తెలిపారు. ఆ తరువాత ఫారెస్ట్ ఆఫీసర్ల నిర్ణయం మేరకు బోనులో చిక్కిన చిరుతను జూలోనే ఉంచాలా? లేదా అడవిలో వదలాల అనే విషయాన్ని నిర్ణయిస్తామని తెలిపారు.
ఇక బోనులో చిక్కిన చిరుతపులి ఆడ చిరుత అని, దానికి నాలుగు ఏళ్లు ఉంటాయని వెల్లడించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కూడా మాట్లాడుతూ చిన్నారి మరణించిన ప్రాంతంలోనే చిరుత పట్టుబడిందని అన్నారు. అయితే ఈ ప్రాంతంలో చిరుతల సంచారం ఇంకా ఉన్నట్టుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారని, చిరుతలను పట్టుకునే ప్రక్రియ కొనసాగుతుంది.
తిరుమల నడకదారిలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అటవీ శాఖ అధికారులు చెప్పేదాకా నిబంధనలు కొనసాగుతాయని అన్నారు. అంతేకాకుండా నడకదారిలో వచ్చే 15 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల అనంతరం అనుమతించమని చెప్పారు. ఇక నడకమార్గంలో వచ్చే భక్తులు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని ధర్మారెడ్డి సూచించారు.
జైలర్ మూవీలో రజినీకాంత్ లీడ్ రోల్ లో నటించగా ఆయన భార్యగా ఈ మూవీలో రమ్యకృష్ణ నటించింది. తమన్నా, వసంత్ రవి, వినాయకన్ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రం మూడు రోజుల్లో 200 కోట్ల వసూలు చేసినట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకున్నాడు. గత 10 ఏళ్ల కాలంలో రజనీకాంత్ సినిమాలు ఆశించిన సక్సెస్ అందుకోలేదు. జైలర్ మూవీతో అన్ని చోట్ల మంచి వసూళ్లను సాధిస్తోందని చెప్పవచ్చు.
జైలర్ మూవీ విజయంలో క్యామియో రోల్స్ కీలక పాత్ర పోషించాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిలో ముఖ్యంగా శివ రాజ్ కుమార్ పాత్ర హైలెట్ గా నిలిచింది. నరసింహా అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించి, థియేటర్లను షేక్ చేశారు. చాలామందికి, ఇతర రాష్ట్రాలవారికి ఆయన అంతగా తెలియకపోవచ్చు. శివ రాజ్ కుమార్ శాండల్ వుడ్ లో పెద్ద స్టార్. ఈ మూవీ తరువాత ఆయన గురించి ఆన్ లైన్ లో వెతుకుతున్నారు.
ఆయన మూవీలో కనిపించింది కొన్ని నిముషాలు అయినా, ఆయన పంచెకట్టుతో కనిపించి, ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఆయన రోల్ కు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ వచ్చిందంటే, మూవీలో ఆయన వాడిన ఒక టిష్యూ కూడా పాపులర్ అయ్యింది. ఈ మూవీలో శివ రాజ్ కుమార్ ఓరిగామి అనే టిష్యూను ఉపయోగించారు. ఆ సీన్ తర్వాత ఈ టిష్యూలు కూడా విపరీతంగా ఫేమస్ అయిపోయాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తమిళంలో హిట్ అయిన వేదళం మూవీ రీమేక్ గా భోళా శంకర్ మూవీని మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించారు. ఈ మూవీలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ నటించారు. ఆగస్ట్ 11 న రిలీజ్ అయిన ఈమూవీ ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీని విమర్శిస్తూ నెట్టింట్లో ట్రోల్స్ వస్తున్నాయి. కలెక్షన్స్ కు కూడా దారుణంగా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. 
ఈ హీరో ఎవరో కాదు, హీరో రాజశేఖర్. ఆ హీరోయిన్ ఆయన సతీమణి జీవిత. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, తన మూవీలో హీరోయిన్ గా జీవితను వద్దని, మార్చమని చెప్పినందుకు, ఆ మూవీ నుండి హీరోగా రాజశేఖర్ ని తొలగించి, వేరే హీరోతో మూవీని తీసారంట. ఇది వీరు పెళ్లి చేసుకోకముందు జరిగిన ఇన్సిడెంట్. రాజశేఖర్ సినిమాలలోకి వచ్చేసరికి జీవిత హీరోయిన్ గా నటిస్తోంది.
రాజశేఖర్ కెరీర్ మొదట్లో తాను హీరోగా నటించే ఒక సినిమాలో హీరోయిన్ గా జీవితను తీసుకున్నారట. ఆ షూటింగ్ లో ఆమెను మొదటిసారి చూసిన రాజశేఖర్ ఈమె హీరోయినా అనుకున్నారంట. మూవీ షూటింగ్ లో జీవిత జ్వరం వచ్చి పడిపోగా, అప్పటికే డాక్టర్ అయిన రాజశేఖర్ ఆమెకు ట్రీట్మెంట్ చేసి, కోలుకున్నాక ఇంటికి పంపించారంట. ఆమె వెళ్లిపోయాక దర్శకుడితో ఈమెను ఎలా హీరోయిన్ గా ఎంపిక చేశారు. నాకు అయితే నచ్చలేదు. మార్చితే మంచిది అని చెప్పారంట.
అప్పుడు ఆ డైరెక్టర్ కూడా మార్చితే మంచిది అన్నారట. కానీ జీవితను కాకుండా రాజశేఖర్ ను మార్చి , హీరో సురేష్ తో మూవీ పూర్తి చేశారంట. ఆ తరువాత కాలంలో జీవిత, రాజశేఖర్ కలిసి పలు సినిమాలలో నటించారు.ఇక వీరిద్దరూ నటిస్తున్న సమయంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకి ఇద్దరు కుమార్తెలు. వీరు కూడా హీరోయిన్లుగా పలు సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రశాంత్ తండ్రి ప్రముఖ కోలీవుడ్ నటుడు మరియు దర్శకుడు త్యాగరాజన్. తండ్రి దారిలోనే ప్రశాంత్ 17 ఏళ్ల వయసులోనే ‘వైగాసి పోరంతచ్చు’ అనే తమిళ మూవీ ద్వారా ఇండస్ట్రీలో కెరీర్ను మొదలుపెట్టాడు. కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, విజయ్ లాంటి వారు అప్పుడప్పుడే కెరీర్లో గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే కోలీవుడ్ లో స్టార్ హీరోగా ప్రశాంత్ రాణించాడు. ఆయన కెరిర్ భారీ హిట్లతో దూసుకుపోతున్న టైమ్ లో ప్రశాంత్ కి తన భార్యతో వచ్చిన వివాదాలు, ఆ తరువాత వచ్చిన వరుస పరాజయాలతో స్టార్ స్టేటస్ ను కోల్పోయాడు.
ప్రశాంత్ గురించి తాజాగా కోలీవుడ్ సినీ విశ్లేషకుడు కాంతరాజ్ పలు విషయాలను చెప్పుకొచ్చారు. సినీ రంగంలో దశాబ్దానికి ఒకసారి మార్పులు జరుగుతాయి. వాటి వల్ల కొందరు మాత్రమే రాణిస్తూ ముందుకెళతారు. ప్రశాంత్ ప్రస్తుతం ‘అంధాగన్’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఆ మూవీకి అతని తండ్రి త్యాగరాజ్ దర్శకుడు.
ఇక ఈ మూవీ తరువాత అతని నటనకు స్వస్తి చెప్పి, వేరే ఏదైనా చేయడం మంచిదని అన్నారు. ఎందుకంటే గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేదని, అలాగే సినిమాలు మారిపోయాయి. వైవాహిక జీవితంలో ఎదురైన సమస్యల వల్లే ప్రశాంత్ కెరీర్ పోయిందని, దాంతో సినిమాలకు దూరంగా ఉన్నాడని పేర్కొన్నాడు.
2005లో ప్రశాంత్కి బిజినెస్ మెన్ కూతురు గృహలక్ష్మితో వివాహం జరుగగా, వారికి ఒక కుమారుడు జన్మించాడు. కానీ కొన్ని రోజుల్లోనే ఇద్దరి మధ్య సమస్యలు రావడంతో3 ఏళ్ల తర్వాత విడిపోయారు. ఆ తరువాత గృహలక్ష్మి పుట్టింటికి వెళ్లి అక్కడే పాపకు జన్మనిచ్చింది. ప్రశాంత్ పాపను చూడడం కోసం వారి ఇంటికి వెళ్లినా రానివ్వలేదని తెలుస్తోంది. తన భార్య కోసం ప్రశాంత్ కోర్టుకు వెళ్ళాడు. అయితే అప్పుడే నారాయణన్ అనే వ్యక్తి గృహలక్ష్మిని ప్రశాంత్ కన్నా ముందే వివాహం చేసుకున్నానని వచ్చాడు.
అతను తమ పెళ్లి 1998లో జరిగిందని వాదించడంతో ప్రశాంత్ డైవర్స్ కు దరఖాస్తు చేయడం, కొన్నిరోజులకే విడాకులు రావడం జరిగిందని సమాచారం. ప్రశాంత్ తన కూతురుని తనతో ఉండానివ్వాలని కోరగా, దానికి కోర్టు అంగీకరించలేదు. ఇక ఈ విడాకుల టైమ్ లో ఆరోపణలు, ప్రత్యారోపణలు బయటికి రావడంతో ప్రశాంత్ కున్న ఇమేజ్ అంతా పోయింది. అలా ఆయన సినిమాలకు దూరమయ్యాడు. టాలీవుడ్ లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ మూవీలో రామ్ చరణ్కు అన్నగా ప్రశాంత్ నటించాడు.
అంతేకాకుండా లవర్ సూర్య ప్రకాశరావుతో కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. ప్రసుతం వీడియో మరియు పొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటితో ఆ బాలిక ఇద్దరు యువకులతో ఒకరికి తెలియకుండా మరొకరితో నడుపుతున్న ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. దాంతో సాయికుమార్ మరియు సూర్యప్రకాశరావు ఆ బాలిక ఇంటికి వెళ్ళి ఇద్దరిలో ఎవరు కావాలని ? ఆమె ఎవరితో కలిసి ఉంటుందో చెప్పమని నిలదీశారు. ఊహించని పరిణామంతో ఏం చేయాలో తెలియని ఆ బాలిక ఉరి వేసుకుని ఆగస్ట్ 10న ప్రాణాలు తీసుకుంది.
ఆమె తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఆ బాలిక మృతదేహం దగ్గర లెటర్ పోలీసులకు ఒక లెటర్ లభించింది. ఆ లెటర్ లో ‘సూర్య వాళ్లెవరినీ కూడా వదలకు కుక్క చావు చావాలి కొడుకులు’ అని ఉంది. అయితే సూర్యప్రకాశ్ అదే రోజు రాత్రి గోపాలపట్నం దగ్గరలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ముక్కోణపు ప్రేమ కథలో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడగా, సాయికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.