సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వారిలో చాలావరకు మనస్పర్ధలతో, బేధాభిప్రాయాలతో కొన్నేళ్ళకి విడిపోయినవారు ఉన్నారు. అలాంటి జంటలలో సీనియర్ హీరోయిన్ రాధిక, ప్రతాప్ బోతన్ జంట కూడా ఒకటి.
స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలోనే నటి రాధిక, నటుడు, డైరెక్టర్ అయిన ప్రతాప్ పోతన్ ను ప్రేమించి, వివాహం చేసుకుంది. అయితే ఈ జంట ఏడాదిలోపే విడపోయారని తెలుస్తోంది. రాధిక, ప్రతాప్ పోతన్ ప్రేమకథ గురించి ఇప్పుడు చూద్దాం..
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధిక తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అనేక తెలుగు చిత్రాలలో హీరోయిన్ గా నటించి, మెప్పించింది. ఎన్టీఆర్, ఆకకఎనేని నాగేశ్వర రావు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి అగ్ర హీరోలతో నటించింది. ఆమె తమిళ ఇండస్ట్రీలో అనేక చిత్రాలలో నటించారు. 1985లో రిలీజ్ అయిన తమిళ చిత్రం ‘మీందుం ఓర్ కాదల్ కతి’. ఈ చిత్రానికి మొదటిసారిగా ప్రతాప్ బోతన్ డైరెక్షన్ చేయగా, ఈ మూవీని రాధిక నిర్మించారు. ఈ మూవీ సమయంలోనే రాధికకు ప్రతాప్ పోతన్ తో పరిచయం ఏర్పడింది.
అంతేకాకుండా ఈ చిత్రంలో వీరిద్దరు జంటగా నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా అని అప్పట్లో వీరిద్దరి పై రూమర్స్ కూడా వచ్చాయి. వీరి ప్రవర్తన కూడా అలాగే ఉండేదని టాక్. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రేమించుకున్న ఈ జంట మధ్య సఖ్యత లేకపోవడంతో పెళ్లి చేసుకున్న ఏడాదిలోపే విడాకులు తీసుకుని విడిపోయారు.
ఆ తరువాత రాధిక ఒక బ్రిటీన్ ఇండియన్ను వివాహం చేసుకున్నప్పటికి, అతనికి విడాకులు ఇచ్చి, ఆ తర్వాత సీనియర్ హీరో శరత్ కుమార్ను మూడవ వివాహం చేసుకుంది. ఇక ప్రతాప్ పోతన్ కూడా వీరు విడిపోయిన 5 ఏళ్ళకు రెండవ పెళ్లి చేసుకున్నాడు. పన్నెండు ఏళ్ల తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు. ప్రతాప్ పోతన్ 2022లో కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూశారు.
Also Read: “భోళా శంకర్” ఇన్సైడ్ టాక్..! సినిమా ఎలా ఉందంటే..?

ఇక బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయడంతో విరాట కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కి దిగడానికి రెడీ అయ్యారు. కానీ మొదటి వన్డేలో కోహ్లి బ్యాటింగ్ కి రాకముందే టీం ఇండియా విజయం సాధించింది. దాంతో విరాట్ బ్యాటింగ్ చూసే ఛాన్స్ అభిమానులకు దొరకలేదు. ఇక ఆ తరువాత జరిగిన రెండో వన్డేలో వీరిద్దరిని విశ్రాంతి పేరుతో మ్యాచ్ కు దూరంగా ఉంచారు. కానీ ఆ మ్యాచ్ లో భారత జట్టు ఘోరమైన పరాజయాన్ని పొందింది.
చివరిది అయిన మూడవ మ్యాచ్ లో కూడా మళ్ళీ వీరిద్దరికి విశ్రాంతినిచ్చారు. దీంతో ఈ సిరీస్ మొత్తంలో కోహ్లీ ఆటను చూడాలనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురయ్యింది. కానీ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రెండో వన్డేలో పరాజయం పొందినా, మూడవ వన్డేలో మాత్రం 200 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్ ను కైవసం చేసుకోవడంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు.
ఇదిలా ఉండగా, మైదానంలో కోహ్లీ బ్యాటింగ్ చూడలేకపోయినా, మొదటి వన్డేలో వాటర్బాయ్ గా విరాట్ కోహ్లి కనిపించాడు. అలాగే ఆఖరి వన్డేలో సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా వచ్చాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోకి ‘‘కోహ్లీ గ్రౌండ్ లో ఉంటే చాలు, కానీ బ్యాటింగ్ మెరుపులను మిస్ అవుతున్నాం’’ అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
దర్శకుడు మెహర్ రమేష్ తన సినిమాలలోని హీరోలను చాలా స్టైలిష్ గా చూపిస్తాడని తెలిసిందే. ఈ చిత్రంలో చిరు ను ఎలా చూపిస్తాడా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన భోళా మానియా పాటలో మెగాస్టార్ చిరంజీవి లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా నటిస్తుండగా, యంగ్ హీరో సుశాంత్ ఆమెకి బాయ్ ఫ్రెండ్ గా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం గురించి వస్తున్న ఇన్ సైడ్ టాక్ ప్రకారంగా, మూవీ అవుట్పుట్ ఎబౌవ్ యావరేజ్ అని, ఒక్కసారి చూడవచ్చు అని వినిపిస్తోంది. కలెక్షన్స్ పరంగా భారీ నష్టం రావడం వల్ల ఈ మూవీ ఫ్లాప్ కావచ్చు అని ఇన్సైడ్ టాక్.
ఇండస్ట్రీ లెక్కల ప్రకారం ఇప్పటికే ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి రూ.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. దర్శకుడు మెహర్ రమేష్ గత చిత్రాలు ప్లాప్ అవగా, వాటివల్ల భారీ స్థాయిలో నష్టాలు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి షో మంచి టాక్ వస్తే, మూవీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
‘బ్రో’ మూవీ తరువాత సాయిధరమ్ తేజ్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక మూవీ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ‘గాంజా శంకర్’ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా కన్నా ముందుగా సాయిధరమ్ తేజ్ ఒక షార్ట్ ఫిల్మ్తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. సాయిధరమ్ తేజ్ చాలా కాలం క్రితమే ‘సత్య’ అనే షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేశాడు.
ఈ షార్ట్ ఫిల్మ్ కి యాక్టర్ సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ డైరెక్షన్ చేశాడు. నవీన్ నందిని నర్సింగ్ హోమ్, ఐనా ఇష్టం నువ్వు, ఊరంతా అనుకుంటున్నారు అనే చిత్రాలలో హీరోగా నటించాడు. వీటిలో ఐనా ఇష్టం నువ్వు మూవీ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం. అయితే నవీన్ నటించిన సినిమాలు విజయం సాధించలేదు. దాంతో నటనకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతను గుర్తు పట్టలేనంతగా, లావుగా మారిపోయారు.
ఇక వైరల్ అవుతున్న సాయిధరమ్ తేజ్ ఫోటోలో అతని పక్కన నలుపు రంగు టీషర్ట్లో ఉన్నది నవీన్. అతను లావుగా మారడంతో వెంటనే గుర్తుపట్టలేకపోయారు. ఇది ఇలా ఉంటే మంచు మనోజ్, నవీన్, సాయితేజ్ మంచి స్నేహితులు. వీలు దొరికినపుడల్లా ఈ ముగ్గురు కలుస్తుంటారని తెలుస్తోంది. నవీన్ హీరోగా సక్సెస్ కాలేకపోయినా, డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ షార్ట్ ఫిల్మ్ త్వరలో విడుదల కానుంది అని తెలుస్తోంది.
హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుని, నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆమె ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. అలా వచ్చిన వెబ్ సిరీస్ ‘సుడల్’. ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సిరీస్ 8 ఎపిసోడ్లుగా రూపొందింది. దీనిని తెలుగుతో పాటుగా ఇతర భాషల్లోకి కూడా డబ్ చేశారు.
ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయాని వస్తే, షణ్ముగం(పార్తిబన్) చాలా కాలం నుంచి పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తుంటాడు. ఆ ఫ్యాక్టరీలో ఊహించని విధంగా అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన రోజే షణ్ముగం యొక్క చిన్న కుమార్తె నీలా కనిపించకుండా పోతుంది. ఫైర్ యాక్సిడెంట్ మరియు కనిపించకుండా పోయిన నీలా కేసులను సాల్వ్ చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ రెజీనా(శ్రీయ రెడ్డి), చక్రి(కాథిర్) లను నియమిస్తుంది. ఈ కేసులను ఛేదించే క్రమంలో పోలీసులకు తెలిసిన షాకింగ్ విషయాలు ఏమిటి?
నీలా ఎందుకు మిస్ అయ్యింది? వారు ఈ కేసులను సాల్వ్ చేశారా లేదా అనేది మిగతా కథ. రొటీన్ స్టోరీ అయినప్పటికీ, గ్రిప్పింగ్ నరేషన్, ఇంటెన్స్ కథనంతో ఈ సిరీస్ ని తీర్చిదిద్దిన విధానం, ఆడియెన్స్ కి థ్రిల్ ని కలిగిస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో కీలకమైన ట్విస్టులు, ప్రతి క్యారెక్టర్ యొక్క క్యారక్టరైజేషన్ కూడా ఇంపాక్ట్ కలిగిస్తాయి. ఈ సిరీస్ నిడివి ఎక్కువగా ఉండడం వల్ల సాగదీసిన భావన కలుగుతుంది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రభాస్ శ్రీను ఈ విషయం గురించి చెప్పారు. తాను మగధీర చిత్రంలో చిరంజీవికి డూప్ గా నటించానని వెల్లడించారు. అప్పట్లో హీరో ప్రభాస్ గారి ఇంట్లో రాత్రి 3 వరకు వాలీబాల్ ఆడుతుండేవాళ్ళమని అన్నారు. ఆ టైమ్ లోనే డైరెక్టర్ రాజమౌళి కాల్ చేసి మగధీర మూవీలో అవకాశం ఇచ్చారని తెలిపాడు.
చిరంజీవి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో కొన్ని షాట్స్ ను తనపై తీశారని చెప్పాడు. ఆ చిత్రంలో మెగాస్టార్ వేసుకున్న డ్రెస్, నా డ్రెస్ ఒకటేనని, చిరంజీవి గారు సెట్ లోకి వస్తుంటే తాను పారిపోయేవాడినని వెల్లడించారు. ఆ డ్రెస్ ను దాచుకోవాలని అనుకున్నానని తెలిపారు. అయితే ఆ డ్రెస్ మళ్ళీ దొరకలేదని వెల్లడించారు.
ప్రభాస్ శ్రీను చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. అదే సమయంలో చర్చకు దారి తీసాయి. ప్రభాస్ శ్రీను చిరంజీవికి డూప్ గా నటించారని తెలిసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ప్రభాస్ శ్రీను టాలీవుడ్ లో కమెడియన్ గా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ప్రభాస్ శ్రీను పారితోషికం భారీగా తీసుకుంటాడని తెలుస్తోంది.
శోభు యార్లగడ్డ తన ట్వీట్లో ఇలా రాసుకొచ్చాడు. ‘ఈ మధ్య కాలంలో విజయాన్ని అందుకున్న ఒక యంగ్ హీరో తన ఆటిట్యూడ్ కారణంగా హిట్ చిత్రాన్ని వదులుకున్నాడు. సక్సెస్ వచ్చిన అనంతరం, దానిని ఎంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని, ఒక కొత్త దర్శకుడు స్క్రిప్ట్ చెప్పడం కోసం సదరు హీరో దగ్గరికి వెళ్ళిన సమయంలో అతను ఆటిట్యూడ్తో గౌరవం ఇవ్వలేదని, ఇలాంటి విధానం ఆ హీరో కెరీర్కు ఎంత మాత్రం కూడా మంచిది కాదు.
అయితే ఈ విషయాన్ని ఆ హీరో త్వరలోనే గ్రహిస్తాడని ఆశిస్తున్నాను అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసినవారు ఆ యంగ్ హీరో విశ్వక్ సేన్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే బేబీ మూవీ కథను చెప్పడానికి విశ్వక్ సేన్ వద్దకి వెళ్తే, కనీసం కథ కూడా వినకుండా రిజెక్ట్ చేశాడని దర్శకుడు సాయి రాజేష్ పరోక్షంగా తెలిపాడు.
దాని పై విశ్వక్ స్క్రిప్ట్ విని రిజెక్ట్ చేయడం కన్నా ముందే నో అని చెబితే బెటర్ అని ఇప్పటికే కౌంటర్ ఇచ్చాడు. దాంతో ఆ హీరో విశ్వక్ సేన్ అని భావించారు. అయితే శోభు యార్లగడ్డ విశ్వక్ సేన్ గురించి ఆ ట్వీట్ పెట్టలేదని క్లారిటీ ఇచ్చాడు. ఆ ట్వీట్ తో ఆ చర్చ ముగిసింది. మరి శోభు యార్లగడ్డ చెప్పిన ఆ హీరో ఎవరా అని నెటిజెన్లు మళ్ళీ వెతుకుతున్నారు.
అజిత్ మాత్రమే కాదు , ఆయన కుమారుడు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మొదటి స్టార్ కిడ్ గా రికార్డు సృష్టించారు. ఈ ఏడాది తెగింపు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అజిత్, చాలా సాధారణంగా ఉంటారు. స్టార్ హీరో అయినప్పటికీ ఎలాంటి బేజషాలకు పోకుండా నిరాడంబరంగా జీవిస్తారు.
అజిత్ తన సినిమాలను ప్రమోట్ చేయడు. అతనికి ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు లేవు. తన లేదా అతని కుటుంబం యొక్క ఫోటోలను షేర్ చేయడు. అజిత్ కుమార్ హీరోయిన్ శాలినిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకి ఇద్దరు పిల్లలు, కుమార్తె అనౌష్క, కుమారుడు ఆద్విక్. స్టార్ డమ్ ఉన్నప్పటికీ, ఈ కుటుంబం మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ, వారి తండ్రిలాగే, అజిత్ పిల్లలు ఇద్దరూ కూడా పాపులర్ అయ్యారు.
ఆద్విక్ని ‘కుట్టి థాలా’ అని అభిమానులు పిలుస్తారు. ఇది హ్యాష్ట్యాగ్ నేషనల్ వైడ్ గా ట్విట్టర్లో ట్రెండ్ అయ్యింది. ఇది సిని నేపథ్యం ఉన్న ఫ్యామిలిలో చిన్న వయస్సులో ట్విట్టర్లోకి ట్రెండ్ అయిన మొదటి అబ్బాయిగా ఆద్విక్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 2021లో జనవరి 27న 22.4K రీట్వీట్ను అందుకున్నాడు.
జీవితంలో ప్రధానమైన ప్రేమ, ఆత్మాభిమానం వంటి అంశాలను కమ్ముల వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. భారీ తారాగణం లేకుండా, ఎక్కువగా కొత్తవాళ్ళతో, సాదాసీదా కథనంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయం అందుకుంది. ఈ చిత్రంలో రాజా, కమలినీ ముఖర్జీ హీరో హీరోయిన్లుగా నటించారు. హీరోయిన్ కమలిని ఈ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరయ్యింది. చిన్నతనంలోనే అమ్మనాన్నలను కోల్పోయి, స్నేహితుల సహాయంతో జీవితాన్ని కొనసాగించే రూప పాత్రలో జీవించి, విమర్శకుల, ఆడియెన్స్ ప్రశంసలు అందుకుంది.
ఈ చిత్రంలో హీరోయిన్ ప్రేమించి, పెళ్లి చేసుకోవాలనుకుని, అటు అమ్మకు, ఇటు కాబోయే భార్యకు నచ్చచెప్పే పాత్రలో నటించిన నటుడి పేరు అనుజ్ గుర్వారా. ఇతను నటుడు మాత్రమే కాదు నేపథ్య గాయకుడు, వాయిస్ ఆర్టిస్ట్, రేడియో జాకీ మరియు టెలివిజన్ షో హోస్ట్. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ నటించిన మగధీర సినిమాలో పంచదార బొమ్మ బొమ్మ పాటను అనుజ్ పాడారు.
ఈ పాటకు గాను అతను ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు. ఈ చిత్రంలోనే కాకుండా ఎన్నో తెలుగు హిట్ సాంగ్స్ ను ఆలపించారు. వాటిలో బద్రీనాథ్, వేదం, భీమిలి కబడ్డీ జట్టు, ఝుమ్మంది నాదం, అనగనగా ఓ ధీరుడు, ప్రేమ కావాలి వంటి అనేక చిత్రాలు ఉన్నాయి. హిందీలో కూడా పలు సాంగ్స్ ను ఆలపించారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే అనుజ్ గుర్వారాకు ఇన్ స్టాగ్రామ్ లో 5 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
సూపర్స్టార్ రజినీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రలలో నటించిన ‘చంద్రముఖి’ సినిమా అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. అప్పట్లో ఈ మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ఆయన కెరీర్ లో మరపురాని చిత్రాలలో చంద్రముఖి మూవీ ఒకటి.
ఈ మూవీని మరోసారి చూసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉంటారు. ఈ సినిమాకి డైరెక్టర్ పి వాసు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి దాదాపు 18 సంవత్సరాల తర్వాత అదే దర్శకుడు సీక్వెల్ ను తీస్తున్నారు. ఇందులో లారెన్స్ హీరోగా, చంద్రముఖిగా కంగనా రనౌత్ నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న చంద్రముఖి 2 మూవీని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం నాడు ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కానీ ఈ పోస్టర్ పై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ పోస్టర్ లో వెంకటపతి రాజు గెటప్లో లారెన్స్ కనిపించారు. పోస్టర్ లో లారెన్స్ తల పెద్దగా, బాడీ చిన్నగా, ఉండటంతో ఈ పోస్టర్ పై ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ పోస్టర్ పై పలు మీమ్స్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.
2.
3.
4.
5.
7.
9.
11.
13.



18.