యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ‘కార్తికేయ 2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నాడు. ఈ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇదే జోష్ లో ఇటీవల ‘స్పై’ అనే మూవీతో ఆడియెన్స్ ను పలకరించాడు. ఈ సినిమాకి గ్యారీ బీ హెచ్ దర్శకత్వం వహించారు. ఐశ్వర్యా మేనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. జులై 29న రిలీజ్ అయిన నిఖిల్ ‘స్పై’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లోనే రూ.28.90 కోట్లు కలెక్ట్ చేసి, నిఖిల్ కెరీర్ లో అతివేగంగా బ్రేక్ ఈవెన్ చేసిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. నిఖిల్ తాజాగా ఒక లేఖను రిలీజ్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
నిఖిల్ లేఖలో ‘స్పై మూవీకి నా కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ను అందించారు. నాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నా మీద ఉన్న నమ్మకంతో ఎంతో మంది ఫ్యాన్స్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా టికెట్లు కొన్నారు. దాంతో నా కెరీర్ లో నే అత్యధిక ఓపెనింగ్స్ వచ్చాయి. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంచెం బాధగాను ఉంది. కాంట్రాక్ట్, కంటెంట్ విషయాలలో వచ్చిన ఇబ్బందుల కారణంగా స్పై సినిమాను పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయలేకపోయాం.
ఆఖరికి ఓవర్సీస్లో సైతం 350 దాకా తెలుగు ప్రీమియర్ షోలు క్యాన్సల్ అయ్యాయి. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఆడియెన్స్ కు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెపుతున్నాను. ఎందుకంటే కార్తికేయ-2 మూవీతో మీ అందరికీ చేరువయ్యాను. అయితే స్పై మూవీని అందించలేకపోయాను. తర్వాత రాబోయే నా మూడు చిత్రాలు అన్ని భాషల్లో థియేటర్లలో తప్పకుండా అనుకున్న టైమ్ కి విడుదల అవుతాయని మాటిస్తున్నాను.
నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్న తెలుగు ఆడియెన్స్ కి, ఫ్యాన్స్ కి మాటిస్తున్నాను. ఇప్పటి నుండి మూవీ కంటెంట్, క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాను. నాపై ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా మీకు మాత్రం మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను అందిస్తాను’ అని నిఖిల్ పేర్కొన్నాడు.

హాలీవుడ్లో మాత్రమే కాకుండా ప్రపంచమంతా మెచ్చే దర్శకులలో క్రిస్టఫర్ నోలాన్ ఒకరు. క్రిస్టఫర్ తీసిన ప్రతి చిత్రం కూడా అద్భుతమే. ఆయన గతంలో ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, ద ప్రిస్టిజ్, టెనెట్, డార్క్ నైట్ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. చివరగా 2020లో ‘టెనెట్’ అనే సినిమాతో ఆడియెన్స్ ని పలకరించిన క్రిస్టఫర్, మూడు సంవత్సరాల తరువాత ఈ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానున్నాడు.
‘ఓపెన్హైమర్’ మూవీ కేవలం అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా విపరీతమైన బజ్ ఏర్పడింది. ఈ మూవీ అంతా అణుబాంబు కాన్సెప్ట్ చుట్టునే తిరుగుతుందని తెలుస్తోంది. దానివల్లే ఈ చిత్రం పై అంచనాలు రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. బుక్ మై షోలో ఇప్పటి దాకా ఈ మూవీ పై లక్షన్నర మంది ఇంట్రెస్ట్ కనబర్చినట్టుగా తెలుస్తోంది. ఒక మూవీ పై రిలీజ్ కు ముందు ఇంత ఆసక్తి చూపించడం అందరికి ఆశ్చర్యంగా ఉంది.
ఈ మూవీ రిలీజ్ కు ఇంకా 3 వారాలు ఉంది. అయితే ఇప్పటికే బుక్ మై షో లో లక్షన్నర మంది ఈ సినిమా పై ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. ఇక మూవీ రిలీజ్ టై కు ఈ సంఖ్య 3 లక్షలకు పెరిగే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఈ రేంజ్ లో ఇండియాలో ఈ మూవీ పై ఆసక్తి ఉండటంతో ఈ మూవీకి భారీగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
హెగ్గనహళ్లికి చెందిన పవిత్ర అనే మహిళా తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. ఆమె ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేసేది. ఈక్రమంలో పవిత్ర ఆ కంపెనీ ఓనర్ చేతన్గౌడను ప్రేమించింది. ఆ తరువాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన కొన్నాళ్ళ వరకు సజావుగా సాగింది. ఇటీవల చేతన్గౌడకు మరో మహిళతో సంబంధం ఏర్పడింది. దాంతో పవిత్ర, చేతన్గౌడ ల మధ్య గొడవలు జరిగేవి. పవిత్ర పిల్లలు కావాలని అనుకోగా, ఆమె భర్త అందుకు నిరాకరించాడు.
అప్పటి నుండి భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవలు మరింతగా పెరిగాయి. తాను ఉండగా మరో యువతితో వివాహేతర సంబంధం ఎందుకు పెట్టుకున్నావని పవిత్ర చేతన్గౌడను నిలదీసింది. తాను మగాడినని, ఏదైనా చేస్తానని, పవిత్ర తల్లి ముందే పవిత్ర పై దాడి చేశాడు. తీవ్ర మనోవేదన పడ్డ పవిత్ర, తాను భర్తతో గొడవపడిన వీడియోను, తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు రాసిన డెత్నోట్ను వాట్సాప్ స్టేటస్లో పెట్టింది.
ఆ స్టేటస్ చూసిన పవిత్ర తల్లి చూసి, వెంటనే కూతురి ఇంటికి వచ్చింది. అయితే పవిత్ర అప్పటికే ఉరి వేసుకుని, మరణించింది. దాంతో పవిత్ర తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు చేతన్గౌడ, అతని ప్రేయసి పై కేసు రిజిస్టర్ చేసి, దర్యాప్తు చేపట్టారు.
సూపర్స్టార్ మహేష్బాబు మేమ్ ఫేమస్ మూవీ విడుదల కాకముందే ఈ చిత్రాన్ని చూసి, పాజిటివ్ రివ్యూ పెట్టారు. డైరెక్టర్ రాజమౌళి ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ రివ్యూని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహేష్, రాజమౌళి ఇద్దరూ కూడా ఈ సినిమాని ప్రశంసించారు. అది ఆ సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే ఈ మూవీ రీసెంట్ గా ఓటీటీలో విడుదల అయ్యింది. ఈ మూవీ చూసిన వారు మహేష్ బాబు, రాజమౌళిల పై కామెంట్స్, ట్రోల్ చేస్తున్నారు.
‘మేమ్ ఫేమస్’ మూవీని ఓటీటీలో చూసినవారు ఈ చిత్రానికి మహేష్ బాబు, రాజమౌళి ఎలా పాజిటివ్ రివ్యూని పోస్ట్ చేశారనే విషయం అర్థం కావట్లేదని, ఈ సినిమాను ప్రశంసించడం మహేష్ మరియు రాజమౌళిలకి అనవసరం అని కామెంట్స్ చేస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘బలగం’ మూవీ గురించి ఎలాంటి ట్వీట్ చేయలేదు. అలాంటివారు ఈ మూవీని ఎలా ప్రశంసించారని అంటున్నారు.
యూట్యూబ్లో పెట్టాల్సిన ‘మేమ్ ఫేమస్’ సినిమాని థియేటర్లో విడుదల చేసి, అనవసరమైన హైప్ ఇచ్చారని విమర్శిస్తున్నారు. కాగా, ఫ్యాన్స్ మాత్రం మహేష్ బాబు, రాజమౌళి యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడం కోసం అలా ట్వీట్ చేసి ఉండవచ్చని అంటున్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవల్సిన అవసరం ఏం లేదని, ఒక మూవీ నచ్చడం, నచ్చకపోవడం అనే విషయం వారివారి అభిరుచిని బట్టి ఉంటుందని అంటున్నారు.
నిహారిక, చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. జులై 4న అధికారికంగా తెలిసింది. వీరిద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది. కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో జూన్ 5న వీరికి డైవర్స్ ముంజూరు అయ్యాయి. విడాకులకు కారణం ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలే అని సమాచారం. అయితే విడాకుల కోసం ముందుగా పిటిషన్ వేసింది చైతన్య జొన్నలగడ్డనే అని కోర్టు రిలీజ్ చేసిన కాపీలో ఉంది.
పిటిషన్ ఏప్రిల్ 1న ఫైల్ అయ్యింది. ఆ తర్వాత విడాకులకు నిహారిక కూడా అంగీకరించగా, ఆమె తరఫున అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర పిటిషన్ దాఖలు చేశారట. కళ్యాణ్ నాగబాబుకు అత్యంత సన్నితంగా ఉంటారని సమాచారం ఇక విడాకుల మ్యాటర్ ను గోప్యంగా ఉంచాలని ముందే అనుకున్నారని తెలుస్తోంది. మే 19న మొదటి హియరింగ్, మే 29న రెండో హియరింగ్ జరిగినట్లు ఆ కాపీలో ఉంది.
మూడో హియరింగ్ జరిగిన జూన్5న తుది నిర్ణయం తీసుకున్నారు. అదే రోజే కోర్టు విడాకులు మంజూరు చేశారని కాపీలో ఉంది. నిహారిక విడాకుల విషయం బయటికి వచ్చిన తరువాత ఆమె చేసిన మొదటి పోస్ట్ తో అందరు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దానిపై చర్చలు చేస్తున్నారు. ఎందుకంటే ఆమె తన విడాకుల గురించి పోస్ట్ పెడుతుందని అందరు భావించారు.
కానీ ఆమె తన చిత్రాలకు, వెబ్ సిరీస్ల కోసం యూఎస్ నుండి ప్రమోషన్స్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు బర్త్ డే విషెస్ చెప్తూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన వారు ఆమె విడాకుల విషయాన్న లైట్ తీసుకుందని అంటున్నారు. తాజాగా నీహరిక తన విడాకుల పై కూడా ఒక పోస్ట్ చేసింది.
అందులో ‘డైవర్స్ విషయంలో మేము ఇద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని, ఇది చాలా సెన్స్టివ్ విషయం. ఇద్దరం కొత్తగాప్రారంభించబోయే పర్సనల్ లైఫ్ లో ప్రైవసీని కోరుకుంటున్నాం. ఈ ఇబ్బందికర సమయంలో నాకు మద్ధతుగా కుటుంబం, ఫ్రెండ్స్ నిలబడ్డారు. తమపై నెగటివ్గా మా పై ప్రచారం చేయవద్దని, ఇలాంటి టైంలో తమను ఇబ్బంది పెట్టవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను’ అని నిహారిక రాసుకొచ్చారు.
వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంకి చెందిన అనూష మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా పెళ్లి చేసుకోవాలనుకునే యువకులను పెళ్లి పేరుతో మోసం చేస్తుంది. ఒకరితో వివాహం అయిన తరువాత కొన్నాళ్ళు కాపురం చేసి, ఆపైన ఇంట్లో ఉన్న డబ్బు, బంగారాన్ని ఎత్తుకెళ్లడం. ఆ తరువాత మరొకరిని పెళ్లి చేసుకోవడం. ఇలా అనూష ఇప్పటిదాకా నలుగురిని పెళ్లి చేసుకుంది. అయితే ఆమెను పెళ్లి చేసుకుని మోసపోయిన సుద్దాల రేవంత్ అనే బాధితుడు అనూష పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాంతో అనూష బండారం బయటికి వచ్చింది. పెద్దపల్లికి చెందిన రేవంత్కు మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా అనూషతో పరిచయం కలిగింది. పరిచయం పెరగడంతో వారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే పెళ్లి జరగక ముందే అనూష అవసరం ఉందని అడగడంతో రేవంత్ రెండు లక్షల రూపాయలు ఆన్లైన్ లో పంపించాడు. 2022లో డిసెంబర్ 14న అనూష – రేవంత్ ల పెళ్లి జరిగింది. 70 వేల రూపాయల నగదు, నాలుగు తులాల బంగారం అనూషకు ఇచ్చాడు.
పెళ్లి అయిన తరువాత రేవంత్ తో 2 నెలలు కాపురం చేసిన తరువాత అనూష ఇంట్లోని డబ్బు, బంగారు నగలను తీసుకుని వెళ్లిపోయింది. దీంతో అనుషను వెతుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్లడంతో ఆమెకు ఇదివరకే 3 పెళ్లిళ్లు అయినట్లు తెలియడంతో రేవంత్ షాక్ అయ్యిమోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే కోర్టు గత నెల జూన్ 5న విడాకులు మంజూరు చేసిందని తెలుస్తోంది. ఈ వార్తతో గత కొంతకాలంగా వస్తున్న విడాకుల వార్తలకు తెర పడినట్టు అయ్యింది. 2020 డిసెంబర్లో మెగాడాటర్ నిహారిక వివాహం, మాజీ ఐజీ జే ప్రభాకర్ రావు కొడుకు చైతన్య జొన్నలగడ్డతో జరిగింది.
వీరి వివాహం రాజస్థాన్లోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మెగా, అల్లు కుటుంబాలతో పాటు సిని ఇండస్ట్రీ నుండి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. కానీ పెళ్ళి అయిన తరువాత రెండు సంవత్సరాలకే చైతన్య, నిహారిక మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్టు తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ‘ఆర్య 2’. ఈ మూవీని ఆదిత్య బాబు ఆదిత్య ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. శ్రద్ధా దాస్, బ్రహ్మానందం, ముఖేష్ రుషి కీలక పాత్రలలో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 2009లో నవంబరు 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ నిర్మాతలకు లాభాలను తెచ్చింది. ఈ మూవీ మలయాళంలో సేమ్ టైటిల్ తో అనువదించబడి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా ఈ మూవీలోని ఒక సన్నివేశాన్ని హాలీవుడ్ మూవీ అయిన ఇండియానా జోన్స్ 4 నుండి కాపీ కొట్టారని నెట్టింట్లో ఒక వార్త హల్చల్ చేస్తోంది. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు సుక్కు మావా నువ్వు కూడా కాపీ కోడతావా అని కామెంట్ చేస్తే, మరొకరు ఇండియానా జోన్స్ టాలీవుడ్ డైరెక్టర్లకి బాగా ఉపయోగపడిందని అని కామెంట్ చేశారు. ఇంకొకరు సుకుమార్ కూడా వాడేస్తాడా అంటూ కామెంట్ చేస్తున్నారు.
డెలివరీ తరువాత మహిళ శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ లో మార్పులు వస్తాయి. శారీరక పెయిన్స్ ఉంటాయి. డెలివరీ నుండి కోలుకోవాలంటే మానసిక స్థైర్యం చాలా ముఖ్యం. సింపుల్ గా అనిపించినా ఇది ఎంతో ముఖ్యమైన విషయం. ఎందుకంటే మహిళల ఆలోచనలే వారి శరీరంలో హార్మోన్స్ మార్పులకు కూడా కారణం అవుతాయి. కాబట్టి డెలివరీ అయ్యక ఒత్తిడికి గురి కాకూడదు. స్థిమితంగా ఉండాలి.
నాకు మాత్రమే ఎందుకు ఈ సమస్య అనుకోవద్దు. నేను ఇలాగే పుట్టానని, అందరికి పిల్లలు పుట్టారని, వారు కూడా ఇలాగే పెరుగుతారని అనుకోవాలి. బేబీ కేర్ పై దృష్టి పెట్టాలి. అన్నిటికీ ఇంటర్నెట్ సహాయం తీసుకోవద్దు. ప్రతి దానికి భయపడకూడదు. అలా అని చెప్పి పిల్లల్ని బయట తిప్పకూడదు. సమయానికి పడుకోవాలి. అది కూడా బేబీ పడుకున్న సమయంలోనే పడుకోవాలి. లోకంలో అందరు ఇలానే ఉంటారని అనుకోవాలి.ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే బిడ్డ విషయంలో కాస్త దైర్యంగా ఉంటుంది. కాబట్టి డెలివరీ ముందు నుండే మానవ సంబంధాలు పెంచుకోవాలి.
అలా ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడే కొన్ని విషయాలలో నెమ్మది, మరి కొన్ని విషయాలలో సలహాలు, సూచనలు లభిస్తాయి. బిడ్డను ఎలా చూసుకోవాలనే విషయాలు కూడా అనుభవజ్ఞులైన వారు చెబుతూ ఉంటారు. డెలివరీ అయిన మహిళలకు భర్తతో పాటుగా, కుటుంబ సభ్యుల మద్ధతు కూడా దొరికినపుడే వారు ఈ సమస్యల నుండి త్వరగా బయటికి రాగలుగుతారు.
బాలీవుడ్ యాక్టర్ విందు ధారా సింగ్ ఆదిపురుష్ మూవీ యూనిట్ పై మండిపడ్డారు. విందు ధారా సింగ్ ఎన్నోసార్లు హనుమంతుడి పాత్రలో నటించారు. అతను మాత్రమే కాకుండా విందు ధారా సింగ్ తండ్రి, దివంగత యాక్టర్ ధారా సింగ్, రామానంద్ సాగర్ రూపొందించిన బుల్లితెర రామాయణంలో హనుమంతుడిగా నటించారు. ముఖ్యంగా హనుమంతుని క్యారెక్టర్ ను వక్రీకరించడం పై తీవ్ర అసంతృప్తిని తెలిపారు.
విందు ధారా సింగ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆదిపురుష్ మూవీ నిర్మాతల తీరుపై విమర్శలు చేశారు. అలాగే హనుమంతుడి పాత్రను పోషించిన దేవదత్తా నాగేపై సటైర్లు వేశాడు. హనుమంతుడు పాత్ర చేసిన దేవదత్తా నాగే హిందీలో సరిగ్గా మాట్లాడలేడు. ఇక అతడికి ఇచ్చిన డైలాగ్లతో హనుమంతుడి పాత్రను వేరే విధంగా చూపారు. ఈ విషయంలో ప్రొడ్యూసర్లు దారుణంగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. హనుమంతుడి క్యారెక్టర్ లో తన తండ్రి చరిత్ర సృష్టించాడని, ఆయన యాక్టింగ్ కు దరిదాపుల్లోకి సైతం రాలేరని మండిపడ్డారు.
‘మేకర్స్ చేసిన పనిని చూస్తే సిగ్గుగా ఉంది. వీళ్ళు మందు తాగి వచ్చారో? ఏం ఆలోచిస్తున్నారో కూడా వారికే తెలియదు. ఇంత భారీ బడ్జెట్ పెట్టి అద్భుతమైన మూవీ తెరకెక్కించే బంగారం లాంటి అవకాశాన్ని నాశనం చేశారు. రామాయణం స్టోరీతో ఆడుకున్నారు. అందువల్లే ఈ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది’ అని అన్నారు.