ఇందిరా గాంధీ భారతదేశపు తొలి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరా గాంధీ 1966 -1977 వరకు వరుసగా మూడు సార్లు, 1980లో నాలుగవ సారి ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించారు. భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ.
ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ పూర్వీకులు పర్షియా నుండి ఇండియాకి వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వారు పార్సీలు. ఫిరోజ్ గాంధీ మరణించిన తరువాత, హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. పార్సీ ఆచారాల ప్రకారం చేయకుండా హిందూ ఆచారాల ప్రకారం ఎందుకు చేశారో ఇప్పుడు చూద్దాం..
బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, ఫిరోజ్ గాంధీ 48 వ పుట్టినరోజుకు 4 రోజుల ముందే గుండెపోటుతో సెప్టెంబరు 8న వెల్లింగ్టన్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఫిరోజ్ గాంధీ భౌతిక కాయాన్ని హాస్పిటల్ నుండి తీన్ మూర్తి భవన్కు తీసుకువచ్చారని కేథరీన్ ఫ్రాంక్ ‘ఇందిర’ పుస్తకంలో వివరించారు. ఫిరోజ్ గాంధీ భౌతికకాయానికి ఇందిరా గాంధీ స్వయంగా స్నానం చేయిస్తానని, అంత్యక్రియలకు సిద్ధం చేస్తానని, ఆ టైమ్ లో ఎవరూ అక్కడ ఉండకూడదని, కోరారు.
ఫిరోజ్ గాంధీ భౌతికకాయాన్ని సెప్టెంబర్ 9 ఉదయం అంత్యక్రియల నిర్వహించడానికి నిగంబోధ్ ఘాట్కు తరలించారు. అయితే ఫిరోజ్ గాంధీకి తొలిసారి గుండెపోటు వచ్చిన సమయంలో, “నా అంత్యక్రియలు హిందూ ఆచారం ప్రకారం జరగాలని కోరుకుంటున్నా” అని తన మిత్రులతో చెప్పారు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం జరిగినా, ఫిరోజ్ గాంధీ భౌతిక కాయాన్ని దహనం చేయడానికి ముందు కొన్ని పార్శీ సంప్రదాయాలను ఇందిర పాటించారు. రాజీవ్ గాంధీ తండ్రి చితికి నిప్పంటించారు.
ఫిరోజ్ గాంధీ అంత్యక్రియల్లో హిందూ ఆచారం ప్రకారం వితంతువులు ధరించినట్లే ఇందిర గాంధీ కూడా తెల్ల చీరను ధరించారు. కానీ, ఫిరోజ్ గాంధీ మరణించిన తరువాత చాలా సంవత్సరాల వరకూ ఇందిరాగాంధీ తెల్లని వస్త్రాలే ధరించేవారు. అయితే తాను వితంతువు అనే కారణంతో తెల్లని వస్త్రాలు ధరించడం లేదని, “ఫిరోజ్ గాంధీ వెళ్లిపోయినప్పుడే, నా లైఫ్ లోని రంగులన్నీ నన్ను విడిచి వెళ్లిపోయాయి” అని అన్నారు.
“తనను తీవ్రంగా కుదిపేసింది ఫిరోజ్ మరణం. మా తాత, తల్లి, తండ్రి నా కళ్ల ముందే కన్నుమూయడం చూశాను. కానీ, ఫిరోజ్ గాంధీ మరణించడం నన్ను ఘోరంగా కుదిపేసింది” అని ఇందిరా గాంధీ డామ్ మోరెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. “నేను ఫిరోజ్ను ఇష్టపడేదాన్ని కాదు. కానీ, ఫిరోజ్ ని ప్రేమించేదాన్ని” అని ఇందిర గాంధీ మరోక చోట రాశారు.












1.ఇలియానా:
2.అనుష్క శెట్టి:
3.రక్షిత:
4.నిత్య మీనన్:
5.నమిత:
6.నివేత థామస్:
7.పూనమ్ బజ్వా:
8.రకుల్ ప్రీత్:
Also Read:

నందమూరి నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా సార్లు గతంలో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మోక్షజ్ఞ మొదటి సినిమాకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, కొన్ని ఈవెంట్స్ లో మోక్షజ్ఞ బొద్దుగా ఉన్న ఫోటోలు వైరల్ అవడంతో మోక్షజ్ఞ హీరోగా సెట్ అవుతాడా నెటిజన్లు కామెంట్స్ చేశారు.
అయితే బాలయ్య లెగసీని ఇండస్ట్రీలో కొనసాగించాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. మోక్షజ్ఞ ఎంట్రీ నేపథ్యంలో యాక్టింగ్, డాన్స్ వంటి విషయాల్లో ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
బొద్దుగా కనిపించే మోక్షజ్ఞ ఊహించని విధంగా స్లిమ్ లుక్ లో కనిపించారు. మోక్షజ్ఞ తన స్నేహితులతో దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మోక్షజ్ఞ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోలను చూసిన అభిమానులకు నందమూరి లెగసీని మోక్షజ్ఞ కొనసాగిస్తాడని అంటున్నారు.

అయితే తాజాగా విడుదలైన సినిమాలకి కాకుండా ఎప్పుడో విడిపోయిన సినిమాల్లో కూడా ఈ తప్పులను చూపిస్తూ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. అయితే రీసెంట్ గా సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ మహేష్ బాబు దగ్గర 25000 డాలర్లు అప్పు తీసుకుంటుంది. కానీ మహేష్ బాబు మాత్రం పదివేల డాలర్లు అప్పు ఇచ్చాను అని తిరిగి ఇవ్వాలని అంటాడు. ఇక దర్శకుడు లాజిక్ మిస్ అవడంతో నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
