Home Health Adda కరోనా పరిశోధనలలో పసుపు గురించి కొత్త విషయాలు ఎలా ఉన్నాయంటే?

కరోనా పరిశోధనలలో పసుపు గురించి కొత్త విషయాలు ఎలా ఉన్నాయంటే?

by Anudeep

Ads

కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం పోరాడుతూనే ఉంది…ఇదిగో వాక్సిన్ అదిగో వ్యాక్సిన్ అంటున్నారే కానీ ఎక్కడ కనిపెట్టలేదు…ప్రస్తుతం అగ్ర దేశాలు కూడా కేవలం లాక్ డౌన్ తో మాత్రమే కరోనా ని బ్రేక్ చేయవచ్చని భావిస్తున్నారు..మన దేశం లో కూడా ఇంకా లాక్ డౌన్ ని అమలుపరుస్తున్న సంగతి తెలిసిందే…ప్రస్తుతం పరిశోధకలు దీని కోసం వ్యాక్సిన్ ని కనుగొనే పనిలో పడ్డారు.ఇకపోతే మన దేశంలో కేరళలోని కొట్టాయం లో ఉన్న మహాత్మ గాంధీ

Video Advertisement

విశ్వవిద్యాలయం నిపుణులు కూడా కరోనా వ్యాప్తిని, కరోనా వైరస్ వ్యాధికి తగిన వ్యాక్సిన్ మరియు మందుల్ని కనుగొనేందుకు నిపుణులు రేయింబవళ్ళు శ్రమిస్తున్నారు.పసుపులో ఉండే కర్కమిన్ అనే పదార్థం సాహాయంతో పీపీఈలను శుభ్రం చేసే విధానాలపై అధ్యయనం చేస్తున్నారు.వ్యాక్సిన్ ని కనిపెట్టే పనిలో కూడా తీవ్రంగా నిమగ్నం అయ్యారు.

Also read: శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సాబు థామస్ నేతృత్వంలో ఈ పరిశోధనలు కొనసాగుతున్నాయి.కరోనాను పసుపులోని కర్కమిన్ అనే పదార్థం నియంత్రించగలిగే శక్తి ఉందన్నారు.దీనికోసమని మూడు ప్రాజెక్టులు మీద పరిశోధనలు ప్రారంభం అయ్యాయి అని. థామస్ తెలిపారు.టైటానియం డైయాక్సైడ్‌తో మరి కొన్ని పదార్థాల మిశ్రమంతో పీపీ ఈ లు, మాస్కులకు అతి సూక్ష్మంగా పూత పూసి, కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు.

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

దీనికోసం కనీసం మూడు సంవస్సరాల సమయం పడుతుందని దీనికోసం సుమారు.3 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రస్తుతం మేము చేస్తున్న పరిశోధనలకు జాతీయంగా,అంతర్జాతీయంగా యూనివర్సిటీలు,పరిశోధన కేంద్రాలు…మాకు మరింత సహకారం అందిస్తున్నాయని డాక్టర్ సాబు థామస్ తెలిపారు.


End of Article

You may also like