బొట్టు, గాజులు తీసేయాలి… పిల్లలకి మంచిది కాదు అన్నారు..! ఎన్నో కష్టాలని జయించి నిలబడిన ఈ మహిళ కథ ఏంటో తెలుసా..?

బొట్టు, గాజులు తీసేయాలి… పిల్లలకి మంచిది కాదు అన్నారు..! ఎన్నో కష్టాలని జయించి నిలబడిన ఈ మహిళ కథ ఏంటో తెలుసా..?

by Mohana Priya

Ads

అందరి జీవితాలు ఒకేలాగా ఉండవు. కొంత మందికి పెళ్లి తర్వాత ఆనందంగా ఉండే జీవితం లభిస్తుంది. కానీ మరి కొంత మంది మాత్రం పెళ్లి తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. సాధారణంగా అడ్జస్ట్ అవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం సహజంగా జరిగే విషయం.

Video Advertisement

కానీ అలా కాకుండా ఒక సమయంలో భార్య భర్తల ఇద్దరి మధ్య గొడవలు అయ్యి, ఆ తర్వాత వాళ్లు విడిపోవడం వరకు వెళుతుంది. లేదా కలిసి ఉన్నప్పుడు కూడా గొడవలు అవుతాయి. అలా ఒక వ్యక్తి తన జీవితానికి సంబంధించిన ఒక సంఘటన గురించి కోరా ద్వారా షేర్ చేసుకున్నారు.

bojja ramana heart touching story 1

ఆమె పేరు బొజ్జ రమణ. సూర్యాపేటలో ఉంటున్నారు. బొజ్జ రమణ తనకి పెళ్లయ్యాక తన జీవితం ఎలా ఉందో వివరిస్తూ ఒక పోస్ట్ చేశారు. అందులో ఈ విధంగా రాశారు. ఆ పోస్ట్ లో, “మాకు పెళ్లి అయిన 1 సంవత్సరానికి విడిపోయాయి, మా బాబు కోసం నేను వేరే పెళ్లి చేసుకోలేదు. కానీ నా భర్త రెండో పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లల్ని కన్నారు. కానీ వాళ్ళకి ఏం గొడవలు జరిగాయో తెలియదు. కానీ ఆమె వేరే అతనితో వుంటుంది. ఈ మధ్య మా భర్త చనిపోయాడు. మేము వెళ్ళాము. ఆమె కూడా వచ్చింది. నేను మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. కాబట్టి బొట్టు, గాజులు తీయాలి అన్నారు.”

“తీయకపోతే కన్న పిల్లలకి మంచిది కాదు అన్నారు. నేను బొట్టు గాజులు తీశాను. కానీ అతని రెండో భార్య ముగ్గురు పిల్లల కోసం అయినా తీయలేదు. నా మనసుకు నేను అనుకున్నాను. ఒక తల్లిగా గెలిచాను. ఒక భార్యగా గెలిచాను. అది నా జీవితం” అని రాశారు. చాలా మంది బొజ్జ రమణ పోస్ట్ కి మద్దతు తెలుపుతూ కామెంట్స్ చేశారు. ఆమె ఈ పోస్ట్ తో పాటు తన ఫోటో కూడా షేర్ చేశారు. ఆమె కథ ఇదే అంటూ పోస్ట్ రాశారు. ఆమెకి మంచి జరగాలి అని, ఆమె సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ కామెంట్స్ పెట్టారు.

ALSO READ : కుమారి ఆంటీ తర్వాత ఫుడ్ బిజినెస్ లో ఫేమస్ అయిన మరొక ఆవిడ ఎవరో తెలుసా..? ఇక్కడ ఒక ప్లేట్ ధర ఎంతంటే..?


End of Article

You may also like