పీవీ నరసింహారావు మీద ఉన్న 4 కేసులు ఏంటో తెలుసా…? అసలు ఆయన జైలుకి ఎందుకు వెళ్లారంటే..?

పీవీ నరసింహారావు మీద ఉన్న 4 కేసులు ఏంటో తెలుసా…? అసలు ఆయన జైలుకి ఎందుకు వెళ్లారంటే..?

by Mounika Singaluri

Ads

పీవీ నరసింహారావు భారతదేశ 9వ ప్రధాని. ఈయన కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా పని చేశారు. 1921 జూన్ 28న జన్మించగా 2004 డిసెంబర్ 23న ఈయన మరణించారు. ఈయన లాచదువుని కూడా చదివారు. పీవీ నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. నేను 1991 నుండి 96 దాకా ప్రధానమంత్రి పదవిని నిర్వర్తించారు. ఈ పదవిని అదృష్టంచిన మొదటి దక్షిణ భారతదేశ వ్యక్తిగా తెలుగువాడిగా కీర్తి గడించారు.

Video Advertisement

1991 జనరల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకంటే ఎక్కువ సీట్లు సాధించిన కూడా ప్రభుత్వాన్ని స్థాపించే మెజారిటీ పొందలేదు. అయితే చిన్న పార్టీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించింది పీవీ నరసింహారావు గారు ప్రధాని అయ్యారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైన స్థితిలో అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ తో కలిసి కొత్త సంస్కరణలు చేపట్టారు.

ప్రతిపక్షాల నుండి ఇబ్బందులు ఎదురైతే వాటిని తాను భరిస్తానని మీరు చేయవలసిన పని మీరు చేయండి అంటూ మన్మోహన్ సింగ్ కి సూచించారు.భారతదేశంలో ఫారిన్ కంపెనీల ఏర్పాటుకు మార్గాన్ని సుఖమం చేశారు. అయితే ఇదే సమయంలో బార్బీ మసీదు కూల్చివేయడం, స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా వచ్చి పీవీ నరసింహారావు తన వద్ద కోటి రూపాయలు లంచం తీసుకున్నాడు అని చెప్పడం వివాదం రేపాయి. దీంతో సొంత పార్టీలో కూడా చీలిక వచ్చింది.దీన్నే అదునుగా భావించిన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఉద్దేశించి 1993లో అవిశ్వాస తీర్మాన్ని ప్రవేశపెట్టాయి

. అయితే అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గినప్పటికీ 1996లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది.అదే సంవత్సరంలో రవీంద్ర కుమార్ అని ఒక అడ్వకేట్ కి ఒక సమాచారం అందింది. 1993లో నో అవిశ్వాస తీర్మానం జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలకు చెందిన నలుగురు ఎంపీలను డబ్బు ఇచ్చి కొందని ఆ ఎంపీలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తో సహా ఆయనకు పంపించాడు. ఇవన్నీ పరిశీలించిన రవీంద్ర కుమార్ సిబిఐకి లేఖ రాశారు. అయితే సిబిఐ ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో కోర్టులో కేసు వేశారు

విచారణ చేయమని సిబిఐ ని ఆదేశించింది. సిబిఐ ఈ కేసును విచారించి పీవీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎంపీలు కొన్న విషయాన్ని నిరూపించారు.అయితే ఈ కేసులో కోర్టులో వాదన నడిచి చివరికి 2000 సంవత్సరంలో పీవీ నరసింహారావు కి కోర్టు మూడు సంవత్సరాలు జైలు శిక్ష లక్ష రూపాయలు జరిమానా విధించింది. అయితే ఈ జడ్జ్మెంట్ తర్వాత పివి నరసింహారావు ఢిల్లీ హైకోర్టులో ఆపిల్ చేయగా కోర్టు బెయిల్ ఇచ్చింది. 2002 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు పివి నరసింహారావుని నిర్దోషిగా ప్రకటించింది.

పీవీ నరసింహారావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు లక్కు బాయ్ అనే బిజినెస్ మాన్ కి చంద్ర స్వామి, కైలాష్ నాథ్ అగర్వాల్ అనే వ్యక్తులు ప్రభుత్వం నుండి కాంట్రాక్ట్ ఇప్పిస్తామని నమ్మబలికి లక్ష డాలర్లు లంచాన్ని తీసుకున్నారు. పీవీ నరసింహారావు ని అడ్డంపెట్టుకుని ఇదంతా వారు చేశారు. సో ప్రభుత్వం నుండి కాంట్రాక్ట్ రాకపోవడంతో ఆ బిజినెస్మేన్ వీళ్ళ ముగ్గురు మీద కేసు పెట్టాడు. కోర్టులో కేసు నడుస్తుండగానే కేసు పెట్టిన వ్యక్తి చనిపోవడంతో 2003లో కోర్టు ముగ్గురుని నిర్దోషులుగా ప్రకటించింది.

1992 క్యాన్సిల్ ఇరుక్కున్న హర్షద్ మెహత తనని కేసుల నుండి బయటకు పడేసేందుకు పీవీ నరసింహారావు కి కోటి రూపాయలు లంచం ఇచ్చినట్లుగా ప్రకటించాడు. దానికి సంబంధించిన ఆడియో క్యాసెట్లను కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వాటిని ప్రధాన ఎవిడెన్స్ గా స్వీకరించలేమని తెలిపింది.అయితే పీవీ నరసింహారావు కి డబ్బు ఇచ్చినట్లు నిరూపణ కాకపోవడంతో ఈ కేస్ కూడా కోర్టు కొట్టేసింది.

1988లో పీవీ నరసింహారావు కేంద్ర మంత్రిగా పనిచేసేటప్పుడు వీపీ సింగ్ అనే వ్యక్తి అపోజిషన్ లీడర్ గా ఉన్నారు. అయితే కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ జరుగుతాయి అనగా పీవీ నరసింహారావు చంద్రస్వామి వేరే వ్యక్తి కలిసి వీపీ సింగ్ కొడుకు సర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫారిన్ ఎకౌంట్ క్రియేట్ చేశారు. తర్వాత అవిపి సింగ్ కొడుకుకి ఫారిన్ బ్యాంక్ అకౌంట్ ఉందంటూ న్యూస్ లీక్ చేశారు. అయితే అసంతకం ఫాజరి చేసినట్లు ఫోరెన్సిక్ నిరూపించింది. కానీ పీవీ నరసింహారావే చేసినట్లు రుజువు కాకపోవడంతో ఈ కేసు కూడా కోర్టు వేసింది.

Also Read:ఈ హీరో ని గుర్తు పట్టారా.? మేకప్ లో మొఖం కొంచెం మిస్ అయ్యింది అనుకుంటా.?


End of Article

You may also like