యానిమల్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్టును నమోదు చేశారు తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. రణబీర్ కపూర్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా నిలచింది.
అయితే ఈ సినిమా పైన చాలామంది క్రిటిక్స్ నెగిటివ్ రివ్యూలు రాశారు. చాలామంది విశ్లేషకులకు యానిమల్ సినిమా నచ్చలేదు. వైలెన్స్ ఎక్కువగా ఉంది అంటూ చెబుతున్నారు.

అయితే తన సినిమాకి పేరు పెట్టిన ప్రతి ఒక్కరిని సందీప్ రెడ్డి వంగా ఒక ఆట ఆడుకున్నారు. వాళ్ళందర్నీ జోకర్స్ అంటూ సంబోధిస్తూ కామెంట్లు చేశారు. ఇప్పుడు ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే సందీప్ మాట్లాడుతూ .. యానిమల్ సినిమాకే ఇలా ఉంటే రేపు నేను తీయబోయే యానిమల్ పార్క్, స్పిరిట్ సినిమాలకి చచ్చిపోతారేమో అంటూ వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడారు. యానిమల్ సినిమాకి సీక్వల్గా యానిమల్ పార్క్ మూవీ అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. యానిమల్ సినిమా ఎండ్ క్రెడిట్స్ అప్పుడు వచ్చిన వైలెన్స్ అయితే బీభత్సంగా ఉంది.
దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది రాబోయే సినిమాలో సందీప్ ఏ రేంజ్ లో వైలెన్స్ చూపించబోతున్నారు అని


రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సలార్ రిలీజ్ తో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. ఈ మూవీలో జగపతిబాబు, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, బాబీ సింహా, దేవరాజ్ వంటివారు నటించారు.
బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ కి హిట్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ మూవీ చూసిన వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ విశ్వరూపాన్ని చూపించారంటూ కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించాడని టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో కూడా యాక్షన్ సీన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు. హీరో ప్రభాస్ ఒక సన్నివేశంలో ఇనుప కడ్డీ పట్టుకుంటే, ఆ రాడ్ పైన ఫింగర్స్ ప్రింట్ పడుతాయి. మరో సన్నివేశంలో ఒక గుద్దు గుద్దితే షాక్ కొట్టిన వాడు బ్రతుకుతడం ఏంటని, కరెంట్ వైర్ సీన్ అవసరమా అంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.







ప్రభాస్, పృధ్విరాజ్ సుకుమార్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, ఈశ్వరి రావు, బాబీ సింహా, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటించారు. యూఎస్ ప్రీమియర్ సేల్స్ తో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా సలార్ రికార్డు బ్రేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మొదటి రోజు, ఫస్ట్ వీకెండ్ రికార్డులన్ని బ్రేక్ అవడం ఖాయం అన్నట్టుగా కనిపిస్తోంది.
సౌత్ ఇండియా మొత్తం సలార్ మేనియా ఉంది. బాహుబలి తరువాత సారీ అయిన విజయం లేని ప్రభాస్ కి ఈ మూవీ భారీ విజయన్ని అందిస్తుందని టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల నడుమ సలార్ మూవీ థియేటర్లలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్, ముఖ్యంగా హైదరాబాద్ లో థియేటర్లన్నింటి వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.