ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే బాహుబలి తర్వాత అన్నీ ఫ్లాప్ లు ఎదురుకున్న ప్రభాస్ ఈ సినిమాతో హిట్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు. అలాగే వరుస పార్జెక్స్ తో నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు.
తన ధ్యేయం అంతా సినిమాలు చెయ్యడం కంటే కూడా తన మీద, తన సినిమాల మీద ఆశలు పెట్టుకున్న అభిమానులను నిరాశ పరచ కూడదని నిత్యం తపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ట్విట్టర్ వేదికగా సలార్ మూవీ స్టోరీ కాన్సెప్ట్ ఏంటో టీం రిలీజ్ చేసింది.

ఓపెన్ చేస్తే అమ్మకి, తన స్నేహితుడికి మాట ఇస్తాడు. వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంతో మంది శత్రువులను చేసుకుంటాడు. దానికోసం ప్రపంచంలో ఉన్న అన్ని పరిస్థితులను, ప్రపంచాన్నే ఎదురుకోవడానికి కూడా సిద్ధపడతాడు. ఎదురుకుంటాడు కూడా. ఇదే సలార్ సినిమా కథాంశం. అయితే ఇందులో ప్రభాస్ కు సమానంగా పృథ్వీరాజ్ సుకుమారం పాత్ర ఉంటుంది. అయితే ఇక్కడే ఒక భీభత్సమైన ట్విస్ట్ ఉంటుంది.

మొత్తానికి సినిమా స్టోరీ రివీల్ చేశారు కానీ దీనిపై అభిమానులకు మళ్లీ నిరాశే మిగిలింది అని చెపొచ్చు. పృథ్వీరాజ్ ప్రభాస్ ఈక్వల్ రోల్ అంటే మల్టీ స్టార్ సినిమా అన్నట్టేగా అని కొందరు, ఇది ఉగ్రం సినిమా కాన్సెప్ట్ కదా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందుర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి రవి బసరూర్ సంగీతం అందించగా… శృతిహాసన్, మీనాక్షి చౌదరీ, జగపతి బాబు, ఈశ్వరి రావు తదితర నటులు కీలక పాత్రలు పోషించారు.
Between mother & his friend promise made to both of them. To fulfill the promises made to them, He makes many enemies and should against all odds in the world [Main Story]#PrithvirajSukumaran role equal to #Prabhas, with a shocking twist 🔥👹#Salaar #PrashanthNeel
— RR💥 (@rrking99) July 30, 2023
ALSO READ : “భోళా శంకర్” ఇన్సైడ్ టాక్..! సినిమా ఎలా ఉందంటే..?

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కమర్షియల్ చిత్రాలలో నటిస్తూనే, మరో వైపు హీరోయిన్ ప్రాధాన్య సినిమాలలో కూడా నటిస్తున్నారు. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించిన ఐశ్వర్య సొప్పన సుందరి సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, మధ్యతరగతి కుటుంబానికి చెందిన అహల్య (ఐశ్వర్య రాజేష్) ఒక బంగారు షాపులో పని చేస్తుంటుంది. ఆమెకు అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి, నాన్ స్టాప్ గా మాట్లాడే తల్లి, మాటలు రాని అక్క ఉంటారు. అన్నయ్య దొర(కరుణాకరన్) ప్రేమించి, పెళ్లి చేసుకుని వారికి దూరంగా వెళతాడు.
ఆ ఫ్యామిలీకి రోజు గడవడమే చాలా కష్టంగా ఉంటుంది. చాలా అప్పులు ఉండడడంతో కష్టంగా వారి జీవితం సాగుతుంటుంది. అలాంటి వాళ్ళకు ఒకరోజు హఠాత్తుగా ప్రముఖ నగల స్టోర్ లో తీసిన బంపర్ డ్రాలో పది లక్షలు విలువ చేసే కారు వస్తుంది. ఆ తరువాత వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? వారి జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తులు ఎవరు? దొర అతని బావ కలిసి ఏం చేశారు? చివరకు ఏం అయ్యింది? అనేది మిగతా కథ.
అహల్యగా నటించిన ఐశ్వర్య రాజేష్ పాత్రలో ఒదిగిపోయింది. మూవీ మొదలైనప్పటి నుండి ముగిసేవరకు డిఫరెంట్ వేరియేషన్స్ తో ఆకట్టుకుంది. డార్క్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం, థ్రిల్ కు గురి చేస్తూ కామెడీ పండించే విషయంలో దర్శకుడు విజయం సాధించాడు. ఈ మూవీ చూసినంతసేపు ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు.








శివజ్యోతి ఏ విషయం అయినా సరే సూటిగా మాట్లాడుతుంటారు. జ్యోతక్క అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన శివజ్యోతి తాజాగా తన ఛానెల్ లో హోం టూర్ వీడియోను చేసింది. మణికొండలో ఆమె తీసుకున్న ఫస్ట్ హౌజ్ గురించి వివరించింది. ఆ ఇంటిని 2019లో కొనుగోలు చేసినట్లుగా, ఫిబ్రవరి 2020లో గృహప్రవేశం చేశామని తెలిపారు.
కొద్ది రోజుల క్రితమే ఆ ఇంటికి మారినట్లుగా చెప్తూ తన ఇంటిని, ఇంటి లోపల అంతా చూపించింది. ఇంటి లోపలి ఇంటీరియర్ ను దగ్గరుండి మరి డిజైన్ చేయించుకున్నానని వెల్లడించింది. ఇక వీడియో చివర్లో ఇంటిని అమ్మాలని అనుకున్నట్లుగా, తాము ఆ ఇంట్లో ఉండట్లేదని, ఆ ఇంటిని చాలా ఇష్టంగా కొన్నట్లు తెలిపింది.
తాను న్యూస్ ఛానల్ మొదలు పెట్టానని, అయితే ఆ ఛానెల్ కి వ్యూస్ రాలేదని, డిప్రెషన్కు గురి అయ్యానని తెలిపింది. ఈ ఇల్లు లక్ అనుకున్నానని, అందుకే ఛానల్ సక్సెస్ అవుతుందని భావించాను. కానీ అలా జరగలేదని, రెండు ఇళ్ళ ఈఎంఐలు కట్టాలని. అందుకే ఈ ఇంటిని అమ్మాలని అనుకున్నట్లుగా వెల్లడించింది. ఊరికనే నన్ను తిట్టకండి. అలా చేయడం వల్ల చాలా ప్రభావం చూపిస్తుంది’ అని శివజ్యోతి కన్నీరు పెట్టుకుంది.



ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధిక తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అనేక తెలుగు చిత్రాలలో హీరోయిన్ గా నటించి, మెప్పించింది. ఎన్టీఆర్, ఆకకఎనేని నాగేశ్వర రావు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి అగ్ర హీరోలతో నటించింది. ఆమె తమిళ ఇండస్ట్రీలో అనేక చిత్రాలలో నటించారు. 1985లో రిలీజ్ అయిన తమిళ చిత్రం ‘మీందుం ఓర్ కాదల్ కతి’. ఈ చిత్రానికి మొదటిసారిగా ప్రతాప్ బోతన్ డైరెక్షన్ చేయగా, ఈ మూవీని రాధిక నిర్మించారు. ఈ మూవీ సమయంలోనే రాధికకు ప్రతాప్ పోతన్ తో పరిచయం ఏర్పడింది.
అంతేకాకుండా ఈ చిత్రంలో వీరిద్దరు జంటగా నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా అని అప్పట్లో వీరిద్దరి పై రూమర్స్ కూడా వచ్చాయి. వీరి ప్రవర్తన కూడా అలాగే ఉండేదని టాక్. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రేమించుకున్న ఈ జంట మధ్య సఖ్యత లేకపోవడంతో పెళ్లి చేసుకున్న ఏడాదిలోపే విడాకులు తీసుకుని విడిపోయారు.
ఆ తరువాత రాధిక ఒక బ్రిటీన్ ఇండియన్ను వివాహం చేసుకున్నప్పటికి, అతనికి విడాకులు ఇచ్చి, ఆ తర్వాత సీనియర్ హీరో శరత్ కుమార్ను మూడవ వివాహం చేసుకుంది. ఇక ప్రతాప్ పోతన్ కూడా వీరు విడిపోయిన 5 ఏళ్ళకు రెండవ పెళ్లి చేసుకున్నాడు. పన్నెండు ఏళ్ల తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు. ప్రతాప్ పోతన్ 2022లో కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూశారు.
దర్శకుడు మెహర్ రమేష్ తన సినిమాలలోని హీరోలను చాలా స్టైలిష్ గా చూపిస్తాడని తెలిసిందే. ఈ చిత్రంలో చిరు ను ఎలా చూపిస్తాడా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన భోళా మానియా పాటలో మెగాస్టార్ చిరంజీవి లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా నటిస్తుండగా, యంగ్ హీరో సుశాంత్ ఆమెకి బాయ్ ఫ్రెండ్ గా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం గురించి వస్తున్న ఇన్ సైడ్ టాక్ ప్రకారంగా, మూవీ అవుట్పుట్ ఎబౌవ్ యావరేజ్ అని, ఒక్కసారి చూడవచ్చు అని వినిపిస్తోంది. కలెక్షన్స్ పరంగా భారీ నష్టం రావడం వల్ల ఈ మూవీ ఫ్లాప్ కావచ్చు అని ఇన్సైడ్ టాక్.
ఇండస్ట్రీ లెక్కల ప్రకారం ఇప్పటికే ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి రూ.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. దర్శకుడు మెహర్ రమేష్ గత చిత్రాలు ప్లాప్ అవగా, వాటివల్ల భారీ స్థాయిలో నష్టాలు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి షో మంచి టాక్ వస్తే, మూవీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.



