రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ సినిమా ‘ప్రాజెక్ట్ K’ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంది.
రీసెంట్ గా ప్రతిష్టాత్మక కామిక్ కాన్ ఈవెంట్లో ఈ మూవీ టైటిల్ మరియు గ్లింప్స్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. గ్లింప్స్ లో ప్రభాస్ విష్ణుమూర్తి దశావతారాలలో పదవ అవతారం అయిన ‘కల్కి’ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే టాలీవుడ్ లో ప్రభాస్ కన్నా ముందు మరో హీరో ‘కల్కి’ గా నటించాడు. మరి ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్, దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ టైటిల్ ప్రకటనకు ముందు చిత్ర యూనిట్ ‘ప్రాజెక్ట్ – K’ అంటే ఏంటి? అని ఆడియెన్స్ కి పజిల్ విసిరింది. దాంతో K అంటే కల్కి, కాలచక్ర, కలియుగ్ అంటూ పలు పేర్లు వినిపించాయి. కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ – K లో K అంటే కల్కి అని, మూవీ టైటిల్ ను ‘కల్కి 2898 ఏడీ’ అని ప్రకటించారు. ఈ గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
‘లోకం అంతా చీకటిలో కూరుకుపోయినప్పుడు, ఆ చీకటిని, అందుకు కారణం అయిన వారిని పారదోలడానికి ఒక శక్తి ఉదయిస్తుందని, ఆ శక్తి కథనే ‘కల్కి’ అని క్లుప్తంగా గ్లింప్స్ తెలియజేశారు. దీంతో ప్రభాస్ శ్రీమహావిష్ణువు అవతారాలలో పదవ అవతారమైన ‘కల్కి’ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే ప్రభాస్ కన్నా ముందుగా తెలుగులో మరో హీరో ‘కల్కి’ గా నటించాడు. ఆ హీరో మరెవరో కాదు. రైటర్ కమ్ డైరెక్టర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్.
అడివి శేష్ మొదటి మూవీ ‘సొంతం’. అందులో చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తరువాత తానే రచయితగా, దర్శకుడిగా మారి తానే హీరోగా ‘కర్మ’ అనే చిత్రాన్ని తీశాడు. ఈ చిత్రం 2010లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో ‘దేవ్’ అనే పాత్రలో నటించిన శేషు, మూవీ మొదట్లోనే ఎండింగ్ ను ఊహించి చెప్తాడు. సరైన ప్రమోషన్ లేకపోవడంతో ఆడియెన్స్ కి ఈ మూవీ గురించి పెద్దగా తెలియలేదు. 13 సంవత్సరాల క్రితమే అడివి శేష్ ‘కల్కి’గా నటించాడు.
Also Read: గుర్తింపు తెచ్చిన సినిమా టైటిల్ నే తమ పేరుకి యాడ్ చేసుకున్న 12 మంది సినీ సెలబ్రిటీస్.!













ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. యూట్యూబ్ స్టార్గా పాపులర్ అయిన వైష్ణవి ఈ మూవీలో తన నటనలోని మరో కోణాన్ని తెరపై ఆవిష్కరించింది. వైష్ణవి నటనకు యువత ఎంతగా కనెక్ట్ అయ్యారంటే, మూవీ చూసిన వారు ఆమె క్యారెక్టర్ ని దారుణంగా తిడుతున్నారు. అద్భుతమైన నటనతో ఆనంద్ దేవరకొండ ఆడియెన్స్ కి కన్నీళ్లు తెప్పించాడు.
వీరిద్దరికీ కొంచెం కూడా తగ్గకుండా విరాజ్ అశ్విన్ తన నటనతో మెప్పించాడు. దాంతో 2 రోజులకే బ్రేక్ ఈవెన్ అయ్యి, ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి రూ.23.07 కోట్లు షేర్ ను సాధించింది. బ్రేక్ ఈవెన్ అవడమే కాకుండా ఈ మూవీ రూ.16.87 కోట్ల లాభాలను రాబట్టి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా అయ్యింది. ఇంతగా ఆకట్టుకున్న వీరికి ఇచ్చిన పారితోషికం గురించి తెలిసి, ఇంత తక్కువా? అని నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు.
దాదాపు పది కోట్ల బడ్జెట్తో బేబీ మూవీని తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ మూవీలో హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండకు దాదాపు రూ.80 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. హీరోయిన వైష్ణవికి రూ.30 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్గా ఇచ్చారని, ఇక విరాజ్ అశ్విన్కు కేవలం రూ.20 లక్షలు ఇచ్చారని నెట్టింట్లో ప్రచారం జరుగుతుంది. అయితే డైరెక్టర్ సాయి రాజేష్ కోటికి పైగా తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
1. పోకిరి:
2. అ మూవీ:
3. రంగస్థలం:
4. బాహుబలి: ద బిగినింగ్:
5. అనుకోకుండా ఒక రోజు:
6. క్షణం:
7. గూఢచారి:
8. కేర్ అఫ్ కంచెరపాలెం:
9. కుమారి 21F:
10. ప్రస్థానం:
11. మిస్సమ్మ:
12. నేనొక్కడినే:
13. జెంటిల్ మెన్:
ఈ మూవీ కథ విషయనికి వస్తే, జీవితంలో ఎన్నో కష్టాలు పడి, ఉన్నత స్థానానికి ఎదిగిన కోటీశ్వరరావు(సాయికుమార్) సడెన్ గా చనిపోవాలని అనుకుంటాడు. ఆ టైంలో కోటీశ్వరరావు ఉండే గ్రామానికి వచ్చిన ఒక స్వామిజీ అతని కష్టాన్ని విని ఒక వరమిస్తాడు. అయితే ఆ విషయం ఎవరికి చెప్పవద్దని అంటాడు. స్వామిజీ కోటేశ్వరరావుకు ఇచ్చిన వరం ఏమిటి? వరం పొందిన తరువాత కోటేశ్వరరావు జీవితంలో కష్టాలు పోయాయా? కోటేశ్వరరావు జీవితంలో నాగలక్ష్మీ (దీపాళీ), దీప (ఐశ్వర్య) ఎవరు అనేవాటికి సమాధానమే మిగిలిన కథ.
మనిషి అనే దానికన్నా డబ్బు మీదే ఆధారపడి జీవితం నడుస్తోంది అనే కథతో తెరకెక్కిన సినిమా. 20, 40, 60 వయసు స్టేజ్ ల వారీగా సాగిన ఈ స్టోరీలో సాయికుమార్, సాయి శ్రీనివాస్, ఆదిత్యా ఓం, పాత్రలను మలచిన తీరు బావుంది. ఆ సీన్స్ ను దర్శకుడు నడిపించిన విధానం బాగుంది. మంచి చేసినపుడు అది ఎక్కడికి పోదు అనే విషయాన్ని చక్కగా చూపించారు. కోటీశ్వరుడిగా సాయికుమార్ అద్భుతంగా నటించారు. సాయికుమార్ డైలాగ్లు బాగున్నాయి.
ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయిన వ్యక్తిగా ఆదిత్య ఓం, బ్రేకప్ అయిన యువకుడిగా సాయి శ్రీనివాస్ చక్కగా నటించారు. రాజీవ్ కనకాల, సీవీఎల్ నరసింహరావు బాగా నటించారు. సాయి శ్రీనివాస్, ఐశ్వర్య క్యారెక్టర్లు యువతకి బాగా కనెక్ట్ అవుతాయి. తొలిసారి డైరెక్షన్ చేసిన శాంతి కుమార్ స్టోరీనే బాగా రాశారు. కానీ తెరపై చూపించడంలో కాస్త తడబడ్డారు. ఫీల్ గుడ్ మూవీ అందించేందుకు ప్రయత్నించారు. ఎంత డబ్బు సంపాదించిన మనిషికి మన అనుకునే తోడు లేకపోతే వారి జీవితంలో సంతోషంగా ఉండదు అనడానికి నిదర్శనమే ‘నాతో నేను’ మూవీ.
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘కల్కి 2989 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ గ్లింప్స్ పై ఆడియెన్స్ నుండి సినీ ప్రముఖుల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండియన్ హాలీవుడ్ మూవీలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి ఈ మూవీ గురించి ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ లో, ‘గ్రేట్ జాబ్ నాగి మరియు వైజయంతి మూవీస్. ఒక ఫ్యూచరిస్టిక్ సినిమాని తెరకెక్కించడం చాలా కష్టమైన పని, మీరు దీన్ని సాధ్యం చేసారు. ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ఇక మిగిలింది ఒక్క ప్రశ్న మాత్రమే, మూవీ రిలీజ్ ఎప్పుడు’ అని రాసుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ పై జక్కన్న సన్నిహితులు, ఫాలోవర్స్, నెటిజెన్లు కౌంటర్లు వేస్తున్నారు. బాహుబలి మూవీ నిర్మాత శోభు యార్లగడ్డ ‘రిలీజ్ డేట్ గురించి అడుగుతోంది ఎవరో చూశారా అని సరదాగా ట్వీట్ పెట్టారు. రాజమౌళి కుమారుడు కార్తికేయ స్మైల్ ఎమోజీలు పెట్టాడు.
రాజమౌళి శోభు యార్లగడ్డ ట్వీట్ కి ‘అంటే అది’ అని పాపులర్ అయిన లక్ష్మి సినిమాలోని బ్రహ్మానందం మీమ్ తో రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్ చూసిన డైరెక్టర్ హరీష్ శంకర్ రాజమౌళిని ఉద్దేశించి ‘మీరు చాలా స్వీట్. చాలా హంబుల్. మీ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని ట్వీట్ చేశారు.
ప్రభాస్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ పై ఆడియెన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగ్ అశ్విన్ ఈ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
భవిష్యత్తులో రాబోయే యుగాంతానికి సంబంధించిన స్టోరీ అని తెలుస్తుంది. సూపర్ పవర్స్ ఉన్న ఒక హీరో ప్రజలను ఎలా కాపాడాడు అనే థీమ్ తో తెరక్కెకుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ గ్లింప్స్ లో ఒక రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న సైన్యం కనిపిస్తుంది. వాళ్ళందరికి లీడర్ గా నటించిన నటుడి పేరు శాశ్వత ఛటర్జీ.
ప్రముఖ బెంగాలీ నటుడు. ఈ యాక్టర్ ఈ మూవీతోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. హిందీ సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించిన శాశ్వత ఛటర్జీ, ఎన్నో సీరియల్స్ లో, వెబ్ సిరీస్ లలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. విద్యాబాలన్ నటించిన కహానీ మూవీ ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత జగ్గా జాసూస్, దిల్ బేచారా, దోబారా, ధాకడ్ వంటి హిందీ చిత్రాలలో నటించారు.





