సినీ ఇండస్ట్రీలో వారసత్వం అనేది ఎప్పటినుంచో కామన్ అయిన విషయం. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ సాధించిన స్టార్స్ ఎందరో ఉన్నప్పటికీ తమ అభిమాన స్టార్ కొడుకు తెరంగేట్రం చేస్తాడు అంటే ఆ ఆనందం అభిమానులకు వేరే లెవెల్ లో ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్న మరొక వారసుడు మోక్షజ్ఞ.
ఈ నందమూరి నట వారసుడు రాక కోసం ఎప్పటినుంచో అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. నందమూరి కుటుంబం నుంచి ఎందరో హీరోలు ఉన్నారు కానీ బాలకృష్ణకు ఉన్న ఫాలోయింగ్ డిఫరెంట్ అని చెప్పవచ్చు. కథ కన్నీళ్లుగా మోక్షజ్ఞ ఎప్పుడు సినీ ఇండస్ట్రీలో అడుగు పెడతాడు అని నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిగో అదిగో అంటున్నారే తప్ప ఇంతవరకు ఎప్పుడూ అన్న విషయంపై ఎవరూ స్పష్టత ఇవ్వలేదు.

ఈ నేపథ్యంలో అమెరికా తానాసభలలో పాల్గొన్న బాలకృష్ణ మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ పై కాస్త ఓపెన్ అయ్యారు. బాలకృష్ణ కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం ఆదిత్య 369. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో.. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం అప్పటికి ,ఇప్పటికీ ఎప్పటికీ.. బోర్ కొట్టని చిత్రం. దీనికి సీక్వల్ గా రాబోయే చిత్రంతోనే మోక్షజ్ఞ తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టనున్నట్లు బాలకృష్ణ తెలిపారు.

మాస్ డైరెక్షన్లో ఆరితేరిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ నటించబోయే మొదటి చిత్రం ఉండబోతోంది అని మరొక పక్క ప్రచారం జరుగుతుంది. బోయపాటి శీను డైరెక్షన్లో మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు…గాడ్ ఆఫ్ మాస్ బాలకృష్ణ తనయుడు మంచి మాస్ పంచ్ డైలాగ్స్ చెప్తే ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుంది అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ : మహేష్ బాబు “గుంటూరు కారం” మూవీ స్టోరీ లీక్..


‘ఓపెన్ హైమర్’ మూవీకి విడుదలకి ముందు ఇండియాలో వచ్చిన హైప్ మామూలుగా లేదు. ఈ మూవీ రిలీజ్ రోజు ప్రాంతీయ భాషల్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయినా, భారతీయ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ‘ఓపెన్ హైమర్’ కే నంబర్ వన్ గా నిలిచింది. ఆ మూవీకి కొన్ని రోజుల ముందు నుండే అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగాయి. ఓపెనింగ్స్ విషయంలోనూ ‘ఓపెన్ హైమర్’ నంబర్ వన్ మూవీగా నిలిచింది.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో నెటిజెన్లు హీరో మాధవన్ దర్శకత్వం వహించి, నటించిన సినిమా ‘రాకెట్రీ’ ని పోలుస్తున్నారు. ఈ మూవీ ప్రముఖ భారతీయ ఎయిరోస్సేస్ శాస్త్రవేత్త, పద్మభూషణ్ నంబీ నారాయణ్ లైఫ్ ఆధారంగా తెరకెక్కింది. ఇస్రో పరిశోధనలకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ ను వేరే దేశానికి లీక్ చేశాడనే కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు. కానీ సీబీఐ దర్యాప్తులోను, సుప్రీంకోర్టు విచారణలోను తనకు తాను నిర్దోషిగా నంబి నారాయణ్ నిరూపించుకొన్నారు.
ఈ మూవీ గత ఏడాది మే 19న రిలీజ్ అయ్యి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ కమర్షియయల్ గా హిట్ అందుకోలేదు. ‘ఓపెన్హీమర్’ మూవీని చూడటానికి థియేటర్లకు వచ్చిన యువతలో 30% మంది అయినా భారతీయ గొప్ప సైంటిస్ట్ హృదయ విదారక కథతో తెరకెక్కిన ‘రాకెట్రీ’ ని థియేటర్లలో చూసి ఉండాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు.
మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ తరువాత ఏ చిత్రాన్ని పూర్తి చేయలేదు. ఈ మూవీ పూర్తి కాకముందే త్రివిక్రమ్ తో మూవీని అనౌన్స్ చేశాడు. కానీ ఈ మూవీ చాలా అడ్డంకుల మధ్య జనవరిలో ప్రారంభం అయ్యింది. అయితే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న తరువాత వాయిదా పడింది. మళ్ళీ ఇటీవలే చిత్రీకరణ మొదలు పెట్టి ఒక నెల షూటింగ్ జరగగానే మళ్ళీ విరామం తీసుకున్నారు.
‘గుంటూరు కారం’ మూవీని త్రివిక్రమ్ మాస్ మసాలా స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక మూవీ గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ గా మారుతోంది. తాజాగా ఈ మూవీ స్టోరీ లీక్ అయినట్టు ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. వైరల్ అయిన న్యూస్ ప్రకారం ఈ ఇద్దరు హీరోయిన్లు ఈ చిత్రంలో అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్నారని, అయితే ఇద్దరి తండ్రి ఒక్కరే, కానీ తల్లులు వేరని తెలుస్తోంది.
దాంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉంటుందని, వీరిద్దరి మధ్య మహేష్ బాబు క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో స్టోరీ సాగుతుందని, త్రివిక్రమ్ ఫ్యామిలీ సెంటిమెంట్ ను సైతం బలంగా చూపిస్తారని తెలుస్తోంది.

వినీత్ శ్రీనివాసన్ హీరోగా తెరకెక్కిన ‘ముకుందన్ ఉన్ని అసోసియేట్స్’ మలయాళంలో భారీ విజయాన్ని సాధించింది. క్రైమ్ కామెడీ కథాంశంతో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే, ముకుందన్ ఉన్ని (వినీత్ శ్రీనివాసన్) లాయర్. కేసుల కోసం అతను చేసే ఏ ప్రయత్నాలు కూడా ఫలించవు. మరోవైపు లాయర్ వేణు (సూరజ్) యాక్సిడెంట్ అయిన వ్యక్తులకు నకిలీ పత్రాలతో ఇన్సురెన్స్ క్లెయిమ్ చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తుంటాడు. ముకుందన్ కూడా వేణులానే మనీ సంపాదించేందుకు ప్రయత్నిస్తాడు.
వేణు యాక్సిడెంట్ కేసులను క్లెయిమ్ చేసే మెర్క్యూరీ హాస్సిటల్ నే ముకుందన్ కూడా ఎంచుకుంటాడు. వేణుతో పోటీని తట్టుకోవడం కష్టం కావడంతో ఒక ప్లాన్ వేసి వేణుని ముకుందన్ చంపేస్తాడు? వేణు చనిపోయిన తర్వాత ఏమైంది? లాయర్గా డబ్బు, పేరు సంపాదించడం కోసం చెడు దారిని ఎంచుకున్న ముకుందన్కు ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? జీవితంలో సక్సెస్ కావాలనే ముకుందన్ కల నెరవేరిందా? తాను ప్రేమించిన మీనాక్షిని( ఆర్ష చాందిని) ముకుందన్ వివాహం చేసుకున్నాడా? అనేది మిగిలిన కథ.
ఈ మూవీలో హీరో మరియు విలన్ రెండు వినీత్ శ్రీనివాసన్. ముకుందన్ ఉన్ని క్యారెక్టర్ లో వినీత్ జీవించాడు. అర్ష చాందిని మీనాక్షిగా పాత్రకు తగినట్టుగా చేసింది. హీరోతో పాటు మూవీలోని ప్రతి పాత్ర నెగెటివ్ షేడ్స్ లోనే ఉంటుంది. ఎదుటివారి వీక్ పాయింట్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటూ కొందరు లైఫ్ లో ఎలా పైకి వస్తారనేది ఈ మూవీలో ఆలోచనాత్మకంగా చూపించారు.






ప్రస్తుతం ‘కల్కి 2898 ‘ అంటే అర్ధం ఏమిటనే చర్చ ప్రారంభం అయ్యింది. ఇక ఈ టైటిల్ పెట్టడం వెనుక పెద్ద కథ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. ఈ మూవీ కథ ఎలా ఉండబోతుందనే విషయాన్ని నాగ్ అశ్విన్ తెలిపారు. తాను పురాణాలను మరియు సైన్స్ ఫిక్షన్ ను ఇష్టపడతానని, మహాభారతం మరియు స్టార్ వార్స్ ను చూస్తూ పెరిగానని అన్నారు. ఈ 2 ప్రపంచాలను కలిపి ఒక మూవీగా చేయడం అనేది గొప్పగా అనిపించిందని, ఆ విధంగా ‘కల్కి 2989 AD’ వచ్చిందని చెప్పారు.
కల్కి 2898 AD స్టోరీ యుగాంతం బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని సమాచారం. 2898లో అంటే ఫుచర్ లో రాబోయే యుగాంతం ఆధారంగా నాగ్ అశ్విన్ ఈ స్టోరీని రాసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ మూవీని సైన్స్ ఫిక్షన్, టైమ్ మిషన్ నేపథ్యంలో నిర్మిస్తున్నారని తెలుస్తోంది.
ఈ స్టోరీ గురించి సోషల్ మీడియాలో నెటిజెన్లు సైతం తమ అభిప్రాయాలను చెప్తున్నారు. 18 వ శతాబ్దంలో కొంత, 28 వ శతాబ్దంలో కొంత స్టోరీ జరుగుతుందని, చివరి 20 నిముషాల్లో విలన్ కీలకపాత్ర వహిస్తాడని అంటున్నారు. మరొకరు గ్లింప్స్ ఆధారంగా అమితాబ్ దాచిన వస్తువును కోసం ఒక రోబో 18వ శతాబ్దానికి ప్రయాణిస్తుందని కామెంట్ చేశారు.