మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకుని తమ వివాహ జీవితానికి ముగింపు పలికారు. కొద్ది రోజులుగా వీరి విడాకుల పై జరుగుతున్న ప్రచారానికి తెర పడింది. నిహారిక, చైతన్య విడాకులు తీసుకున్నారని, విడిపోయారంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నిహారిక తనకు చైతన్యతో విడాకులు అయ్యాయని తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఆ తరువాత చైతన్య కూడా విడాకులు విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో నాగబాబు గతంలో చైతన్యను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
2020లో డిసెంబర్ లో నిహారిక, చైతన్య పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి రాజస్థాన్ లో ఒక ప్యాలెస్ లో చాలా ఘనంగా జరిగింది. పెద్దల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట ఎంతో సంతోషంగా కనిపించారు. వెకేషన్స్ కు వెళ్ళిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో పంచుకుని అభిమానులను ఆకట్టుకున్నారు. నిహారిక, చైతన్యల వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారని అనుకునేలోపే షాక్ ఇచ్చారు.
నిహారిక, చైతన్య విడాకులు తీసుకున్నాము అంటూ తాజాగా ఒకరి తరువాత మరొకరు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. వీరికి గత నెల జూన్ 5న కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసిందని ఆలస్యంగా కాస్త బయటికి వచ్చింది. ఇక సోషల్ మీడియాలో వీరి గురించి ఎక్కువగా వార్తలు షికారు చేస్తున్నాయి. నిహారిక పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే నాగబాబు నిహారిక, చైతన్య జొన్నలగడ్డ నిశ్చితార్థం అనంతరం చైతన్యను ఉద్దేశించి చేసిన పాత ట్వీట్ కూడా వైరల్ అయ్యింది.
నాగబాబు ఆ ట్వీట్ లో ‘ ప్రియమైన చై దాదాపు అన్ని విషయాలలోను తాను నాలాగే ఉంటుందని అందరు అంటుంటారు. ప్రపంచంలోని ప్రేమనంతా ఆమె పై కురిపిస్తావని నమ్ముతున్నాను. అలాగే ఈ రోజు నుంచి తను అధికారికంగా నీ సమస్యగా మారిపోయింది’ అని రాసుకొచ్చారు.

నిఖిల్ లేఖలో ‘స్పై మూవీకి నా కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ను అందించారు. నాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నా మీద ఉన్న నమ్మకంతో ఎంతో మంది ఫ్యాన్స్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా టికెట్లు కొన్నారు. దాంతో నా కెరీర్ లో నే అత్యధిక ఓపెనింగ్స్ వచ్చాయి. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంచెం బాధగాను ఉంది. కాంట్రాక్ట్, కంటెంట్ విషయాలలో వచ్చిన ఇబ్బందుల కారణంగా స్పై సినిమాను పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయలేకపోయాం.
ఆఖరికి ఓవర్సీస్లో సైతం 350 దాకా తెలుగు ప్రీమియర్ షోలు క్యాన్సల్ అయ్యాయి. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఆడియెన్స్ కు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెపుతున్నాను. ఎందుకంటే కార్తికేయ-2 మూవీతో మీ అందరికీ చేరువయ్యాను. అయితే స్పై మూవీని అందించలేకపోయాను. తర్వాత రాబోయే నా మూడు చిత్రాలు అన్ని భాషల్లో థియేటర్లలో తప్పకుండా అనుకున్న టైమ్ కి విడుదల అవుతాయని మాటిస్తున్నాను.
నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్న తెలుగు ఆడియెన్స్ కి, ఫ్యాన్స్ కి మాటిస్తున్నాను. ఇప్పటి నుండి మూవీ కంటెంట్, క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాను. నాపై ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా మీకు మాత్రం మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను అందిస్తాను’ అని నిఖిల్ పేర్కొన్నాడు.
హాలీవుడ్లో మాత్రమే కాకుండా ప్రపంచమంతా మెచ్చే దర్శకులలో క్రిస్టఫర్ నోలాన్ ఒకరు. క్రిస్టఫర్ తీసిన ప్రతి చిత్రం కూడా అద్భుతమే. ఆయన గతంలో ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, ద ప్రిస్టిజ్, టెనెట్, డార్క్ నైట్ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. చివరగా 2020లో ‘టెనెట్’ అనే సినిమాతో ఆడియెన్స్ ని పలకరించిన క్రిస్టఫర్, మూడు సంవత్సరాల తరువాత ఈ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానున్నాడు.
‘ఓపెన్హైమర్’ మూవీ కేవలం అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా విపరీతమైన బజ్ ఏర్పడింది. ఈ మూవీ అంతా అణుబాంబు కాన్సెప్ట్ చుట్టునే తిరుగుతుందని తెలుస్తోంది. దానివల్లే ఈ చిత్రం పై అంచనాలు రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. బుక్ మై షోలో ఇప్పటి దాకా ఈ మూవీ పై లక్షన్నర మంది ఇంట్రెస్ట్ కనబర్చినట్టుగా తెలుస్తోంది. ఒక మూవీ పై రిలీజ్ కు ముందు ఇంత ఆసక్తి చూపించడం అందరికి ఆశ్చర్యంగా ఉంది.
ఈ మూవీ రిలీజ్ కు ఇంకా 3 వారాలు ఉంది. అయితే ఇప్పటికే బుక్ మై షో లో లక్షన్నర మంది ఈ సినిమా పై ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. ఇక మూవీ రిలీజ్ టై కు ఈ సంఖ్య 3 లక్షలకు పెరిగే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఈ రేంజ్ లో ఇండియాలో ఈ మూవీ పై ఆసక్తి ఉండటంతో ఈ మూవీకి భారీగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
సూపర్స్టార్ మహేష్బాబు మేమ్ ఫేమస్ మూవీ విడుదల కాకముందే ఈ చిత్రాన్ని చూసి, పాజిటివ్ రివ్యూ పెట్టారు. డైరెక్టర్ రాజమౌళి ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ రివ్యూని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహేష్, రాజమౌళి ఇద్దరూ కూడా ఈ సినిమాని ప్రశంసించారు. అది ఆ సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే ఈ మూవీ రీసెంట్ గా ఓటీటీలో విడుదల అయ్యింది. ఈ మూవీ చూసిన వారు మహేష్ బాబు, రాజమౌళిల పై కామెంట్స్, ట్రోల్ చేస్తున్నారు.
‘మేమ్ ఫేమస్’ మూవీని ఓటీటీలో చూసినవారు ఈ చిత్రానికి మహేష్ బాబు, రాజమౌళి ఎలా పాజిటివ్ రివ్యూని పోస్ట్ చేశారనే విషయం అర్థం కావట్లేదని, ఈ సినిమాను ప్రశంసించడం మహేష్ మరియు రాజమౌళిలకి అనవసరం అని కామెంట్స్ చేస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘బలగం’ మూవీ గురించి ఎలాంటి ట్వీట్ చేయలేదు. అలాంటివారు ఈ మూవీని ఎలా ప్రశంసించారని అంటున్నారు.
యూట్యూబ్లో పెట్టాల్సిన ‘మేమ్ ఫేమస్’ సినిమాని థియేటర్లో విడుదల చేసి, అనవసరమైన హైప్ ఇచ్చారని విమర్శిస్తున్నారు. కాగా, ఫ్యాన్స్ మాత్రం మహేష్ బాబు, రాజమౌళి యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడం కోసం అలా ట్వీట్ చేసి ఉండవచ్చని అంటున్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవల్సిన అవసరం ఏం లేదని, ఒక మూవీ నచ్చడం, నచ్చకపోవడం అనే విషయం వారివారి అభిరుచిని బట్టి ఉంటుందని అంటున్నారు.







నిహారిక, చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. జులై 4న అధికారికంగా తెలిసింది. వీరిద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది. కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో జూన్ 5న వీరికి డైవర్స్ ముంజూరు అయ్యాయి. విడాకులకు కారణం ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలే అని సమాచారం. అయితే విడాకుల కోసం ముందుగా పిటిషన్ వేసింది చైతన్య జొన్నలగడ్డనే అని కోర్టు రిలీజ్ చేసిన కాపీలో ఉంది.
పిటిషన్ ఏప్రిల్ 1న ఫైల్ అయ్యింది. ఆ తర్వాత విడాకులకు నిహారిక కూడా అంగీకరించగా, ఆమె తరఫున అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర పిటిషన్ దాఖలు చేశారట. కళ్యాణ్ నాగబాబుకు అత్యంత సన్నితంగా ఉంటారని సమాచారం ఇక విడాకుల మ్యాటర్ ను గోప్యంగా ఉంచాలని ముందే అనుకున్నారని తెలుస్తోంది. మే 19న మొదటి హియరింగ్, మే 29న రెండో హియరింగ్ జరిగినట్లు ఆ కాపీలో ఉంది.
మూడో హియరింగ్ జరిగిన జూన్5న తుది నిర్ణయం తీసుకున్నారు. అదే రోజే కోర్టు విడాకులు మంజూరు చేశారని కాపీలో ఉంది. నిహారిక విడాకుల విషయం బయటికి వచ్చిన తరువాత ఆమె చేసిన మొదటి పోస్ట్ తో అందరు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దానిపై చర్చలు చేస్తున్నారు. ఎందుకంటే ఆమె తన విడాకుల గురించి పోస్ట్ పెడుతుందని అందరు భావించారు.
కానీ ఆమె తన చిత్రాలకు, వెబ్ సిరీస్ల కోసం యూఎస్ నుండి ప్రమోషన్స్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు బర్త్ డే విషెస్ చెప్తూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన వారు ఆమె విడాకుల విషయాన్న లైట్ తీసుకుందని అంటున్నారు. తాజాగా నీహరిక తన విడాకుల పై కూడా ఒక పోస్ట్ చేసింది.
అందులో ‘డైవర్స్ విషయంలో మేము ఇద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని, ఇది చాలా సెన్స్టివ్ విషయం. ఇద్దరం కొత్తగాప్రారంభించబోయే పర్సనల్ లైఫ్ లో ప్రైవసీని కోరుకుంటున్నాం. ఈ ఇబ్బందికర సమయంలో నాకు మద్ధతుగా కుటుంబం, ఫ్రెండ్స్ నిలబడ్డారు. తమపై నెగటివ్గా మా పై ప్రచారం చేయవద్దని, ఇలాంటి టైంలో తమను ఇబ్బంది పెట్టవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను’ అని నిహారిక రాసుకొచ్చారు.
అయితే కోర్టు గత నెల జూన్ 5న విడాకులు మంజూరు చేసిందని తెలుస్తోంది. ఈ వార్తతో గత కొంతకాలంగా వస్తున్న విడాకుల వార్తలకు తెర పడినట్టు అయ్యింది. 2020 డిసెంబర్లో మెగాడాటర్ నిహారిక వివాహం, మాజీ ఐజీ జే ప్రభాకర్ రావు కొడుకు చైతన్య జొన్నలగడ్డతో జరిగింది.
వీరి వివాహం రాజస్థాన్లోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మెగా, అల్లు కుటుంబాలతో పాటు సిని ఇండస్ట్రీ నుండి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. కానీ పెళ్ళి అయిన తరువాత రెండు సంవత్సరాలకే చైతన్య, నిహారిక మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్టు తెలుస్తోంది.
