శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడవి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ మేజర్. పాన్ ఇండియా మూవీగా మేజర్ చిత్రం రూపొందింది. చిత్రం 26/11 ముంబై దాడుల్లో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా చిత్రీకరించబడింది.
ఈ చిత్రం మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్ ఇండియా, ఏ ప్లస్ ఎస్ మూవీస్ నిర్మాణ సారథ్యంలో జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించింది మేజర్ చిత్రం. కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకువెళ్తుంది.
అయితే ఈ చిత్రానికి మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. రెండు తెలుగు రాష్ట్రాల లోని మొదటి రోజు 6.10 కోట్లు వసూళ్లు రాబట్టింది. కానీ నార్త్ లో మేజర్ చిత్రం పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ విధంగా ఈ సినిమాకు కలెక్షన్లు సాధించకపోవడానికి కారణం మహేష్ బాబే అని సినీ ప్రముఖులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేజర్ చిత్రం ట్రైలర్ లాంచ్ సమయంలో మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే.
బాలీవుడ్ ఇండస్ట్రీ నన్ను భరించలేదు అంటూ మహేష్ చేసిన ఆ వ్యాఖ్యలే ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీశాయి. ఈ క్రమంలో కొందరు బాలీవుడ్ సెలబ్రిటీస్ మహేష్ కి మద్దతుగా పలుకగా, మరికొందరు మహేష్ బాబు పై తీవ్రమైన విమర్శలు వ్యక్తంచేశారు. అప్పుడు మహేష్ బాబు చేసిన కామెంట్స్ వల్లనే నార్త్ ప్రేక్షకులు మేజర్ చిత్రం ద్వారా మహేష్ బాబు పై పగ తీర్చుకుంటున్నారని, అందుకే మేజర్ చిత్రం కలెక్షన్లు నార్త్ లో ఎంత దారుణంగా దెబ్బ తీసాయని తెలుస్తోంది.