మన దేశం లో గుర్తింపు కార్డు అనగానే మొదట గుర్తొచ్చేది ఓటర్ ఐడి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇలా వీటి తో పాటు ఓటర్ ఐడి ని కూడా మనం గుర్తింపు కార్డు గా చుపిస్తాము. మన ఓటు హక్కుని మనం వినియోగించుకోవాలి అంటే కచ్చితం గా ఓటర్ ఐడి చూపించాల్సిందే. ఇప్పటి వరకు ఐడి కార్డులన్నీ బ్లాక్ అండ్ వైట్ లోనే వచ్చేవి. తాజాగా, కొత్త గా అప్లై చేసుకునే వారికి కలర్ ఓటర్ కార్డులను ప్రభుత్వం పంపిణి చేస్తోంది. మీకు కూడా కొత్త కలర్ కార్డులు కావాలా? మేము చెప్పినట్లు చేస్తే, మీకు కొత్త కలర్ కార్డు వచ్చేస్తుంది.

ప్రజలకు సౌకర్యం గా అందించడం కోసం.. ప్రభుత్వం ఆన్ లైన్ లోనే అప్లై చేసుకునే ఏర్పాటు చేసింది. ఇంట్లోంచి ఆన్ లైన్ లో నే అప్లై చేసుకుని ఓటర్ ఐడి ని పొందవచ్చు. మొదట ఆన్ లైన్ మీరు ఒక అప్లికేషన్ ను అప్లై చేసింది. కలర్ ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకోవడం కోసం మీరు https://voterportal.eci.gov.in పోర్టల్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ లో మీరు మీ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. హోమ్ పేజీ కి వెళ్లిన తరువాత పోర్టల్ బాక్స్ పై క్లిక్ చేయండి.

ఈ పోర్టల్ లో అభ్యర్థులు తమ సమాచారాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సొంత ఫోటో ను కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే. ఒకసారి సబ్మిట్ చేసిన తరువాత ఈ మొత్తం సమాచారాన్ని అభ్యర్థులు సేవ్ చేసుకోవాలి. ఒకవేళ కొత్త కార్డు కావాల్సిన వారు ఫారం 6 ను ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది. దేశం లో ఎక్కడ నుంచి అయినా, ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకోచ్చు. ఒకసారి అప్లై చేసిన తరువాత, మీ ప్రాంతం లో ఉండే బూత్ లెవెల్ అధికారి ఎన్నికల సంఘం తరపున మీ ఇంటికి వస్తారు. మీరు అందించిన సమాచారాన్ని, ధ్రువీకరణ పత్రాన్ని వెరిఫై చేస్తారు. ఆ తరువాత కలర్ ఓటర్ కార్డుని ఒక నెల రోజుల్లో మీ ఇంటికి పంపిస్తారు.

సినీ ఇండస్ట్రీకి న వచ్చే ప్రతీ అమ్మాయి లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సిందే , నేను కూడా ఎదుర్కొన్నాను అంటూ సంచలనం సృష్టించింది నటి, హిందీ బిగ్బాస్-13 మాజీ కంటెస్టెంట్ రష్మీ దేశాయ్. పెద్ద నిర్మాత సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి తనను అత్యాచారం చేయాలని ప్రయత్నించాడంటూ చెప్పుకొచ్చింది. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు టీవీ కార్యక్రమాలు , సీరియల్స్ ద్వారా అందరికి సుపరిచితమైన నటి రష్మీ దేశాయ్. సల్మాన్ హోస్ట్ చేసే బిగ్ బాస్ 13 లో థర్డ్ రన్నరప్ కూడా. ఆ తర్వాత వెండితెరపై కూడా కనిపించింది. ఇటీవల ఒక ఇంగ్లీష్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందించింది.
పదమూడేళ్ల క్రిందట తాను కెరీర్ ప్రారంభించానని, అప్పుడే టీనేజ్ లోకి అడుగుపెట్టానని, నటనపై ఇంట్రస్ట్ తో ఇటువైపొచ్చనని చెప్పింది. అయితే ఆ సమయంలో ఆఫర్స్ ఇప్పిస్తాను అనే వంకతో సూరజ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇండస్ట్రీలో ఎవరూ పరిచయం లేకపోయేసరికి సూరజ్ నిజంగానే అవకాశాలు ఇప్పిస్తాడని నమ్మాను . కానీ తర్వాత సినిమాల్లో ఆఫర్స్ రావాలంటే లైంగికంగా లొంగాల్సిందే అని చెప్పేవాడని, అలా చాలా సార్లు తనను లొంగగదీసుకునే ప్రయత్నం చేశాడని ఆమె చెప్పుకొచ్చింది.
పెద్ద నిర్మాత యశ్ రాజ్తో కలిసి పనిచేసే అవకాశం ఇప్పిస్తానని తన నెంబర్ తీసుకున్న సూరజ్. ఓసారి ఫోన్ చేసి ఆడిషన్కి రమ్మన్నాడు, తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే ఆ రూమ్లో అతనొక్కడే ఉండడంతో డౌటొచ్చింది . దాంతో వెళ్లిపోతానని చెప్తే కూల్ డ్రింక్ తాగడానికి ఇచ్చి, అది తాగాల్సిందిగా బలవంతం చేశాడు. కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపాడని, దాన్ని తాగించి అత్యాచారం చేయాలనే ప్రయత్నం చేశాడని రశ్మి తెలిపింది.
అక్కడినుండి ఎలాగోలా తప్పించుకుని బయటపడి, ఆ తర్వాత అమ్మతో జరిగినదంతా చెప్పాను . దీంతో అమ్మ సూరజ్ ని పిలిపించి ఇంకోసారి నా బిడ్డ జోలికి వస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చిందని, ఈ పని నేనే చేసి ఉండాల్సిందని అనిపిస్తుంటుంది అంటూ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచిన రశ్మి చేసిన కామెంట్స్ తో మళ్లీ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం వైరలవుతోంది.































