స్ట్రీట్ ఫుడ్ ఆంటీ, అలియాస్ సాయి కుమారి స్టాల్ ని తీసేయమంటూ పోలీసులు ఆదేశాలు ఇవ్వడం, ఇవాళ రేవంత్ రెడ్డి స్టాల్ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం తెలిసిందే. నిన్నటి నుండి ఈ సంఘటన గురించి హైదరాబాద్ అంతా మాట్లాడుకుంది.
పబ్లిసిటీ వల్ల ఇలా అయ్యింది అని, తనని పబ్లిసిటీ చేయొద్దు అని సాయి కుమారి అడిగారు. ఇటీవల ఊరి పేరు భైరవకోన సినిమా ప్రమోషన్స్ కోసం ఈ ఫుడ్ స్టాల్ కి వెళ్లిన సందీప్ కిషన్ కూడా సాయి కుమారికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.

అయితే ఈ సంఘటన మీద రెండు వేరు వేరు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే, “సాయి కుమారి చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. దాదాపు పది సంవత్సరాలకి పైగా ఈ స్టాల్ ఉంది. అప్పటి నుండి వంట చేస్తూ, ఇప్పుడు ఇంత మంచి స్థాయికి వచ్చారు. నిన్న ఒక్కరోజు సరిగ్గా నడవకపోవడం వల్ల దాదాపు 50 వేల నష్టం వచ్చింది అంటే వాళ్ళు ఎంత కష్టపడతారో, వారి ఆహారానికి ఎంత మంది అభిమానులు ఉన్నారు అనే విషయం అర్థం అయిపోతుంది. కాబట్టి అలాంటి వ్యక్తిని ఇంకా ప్రోత్సహించాలి కానీ, ఇలాంటి పనులు చేయకూడదు.”

“ఆమె లాంటి వ్యాపారులకి ప్రోత్సాహం కొండంత బలాన్ని ఇస్తుంది. దాంతో వారు ఇంకా గొప్ప స్థాయికి ఎదగగలరు” అని అనే వాళ్ళు కొంత మంది ఉన్నారు. మరి కొంత మంది ఇంకొక రకమైన వాదనను వినిపిస్తున్నారు. అదేంటంటే, “ఈ స్టాల్ అనేది రోడ్ పక్కన ఉంది. భోజనం అనేది బాగుంటే జనాలు రావడం సహజమైన విషయం. ఒకసారి, రెండు సార్లు అంటే కంట్రోల్ చేయగలుగుతారు. కానీ ప్రతిసారి అంటే కంట్రోల్ చేయలేరు. అక్కడ ఎన్నో కంపెనీలు ఉన్నాయి.”

“ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. అలాంటప్పుడు, ఇలాంటి ఒక స్టాల్ అక్కడ ఉండడం వలన ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి” అని అంటున్నారు. “ఆమె మరొక దగ్గర ఫుడ్ స్టాల్ పెట్టుకోవడం మంచి నిర్ణయం ఏమో” అని అంటున్నారు. అప్పుడు అటు వాళ్ళ స్టాల్ కూడా బాగా నడుస్తుంది. ఇటు ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా ఉండదు అని అంటున్నారు. మీరు ఎటు వైపు సమర్థిస్తారు? ఎవరి చెప్పిన మాట సరైనది అని మీరు అనుకుంటున్నారు?
ALSO READ : అయోధ్య రామ మందిరం మీద మరొకసారి ఈర్షని ప్రదర్శించిన పాకిస్తాన్..! ఈసారి ఏకంగా వారికే లెటర్… ఏం రాశారంటే..?

అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవం ఎంతో దివ్యంగా, అంగరంగ వైభవంగా జరిగింది. అయోధ్యలో దశాబ్దాల తర్వాత బాబ్రీ మసీదు వివాదం ముగిసి, సుప్రీం కోర్టు తీర్పుతో రామ మందిర నిర్మాణం జరిగింది. 500 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవంతో భక్తుల చిరకాల కోరిక నెరవేరింది. రామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవంలో ముస్లింలు కూడా పాల్గొనడం ఆమోదించలేని పాకిస్థాన్, రామ మందిరం పై ఫిర్యాదు చేస్తూ ఐక్యరాజ్యసమితికి అధికారికంగా లేఖ రాసింది.
భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడటంలో ఎప్పుడూ అలసిపోని పాక్ నాయకులలో మునీర్ అక్రమ్ ఒకరు. పాకిస్తాన్ రాయబారి ఉన్న మునీర్ అక్రమ్ రామ మందిరం పై ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. అందులో
ఈ ధోరణి భారతీయ ముస్లింల సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ శ్రేయస్సుతో పాటు ఈ ప్రాంతంలో సామరస్యం మరియు శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. భారతదేశంలోని ఇస్లామిక్ వారసత్వ ప్రదేశాల రక్షణ కోసం తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాబ్రీ మసీదు లాగే భారతదేశంలోని ఇతర మసీదులు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గా మసీదుతో సహా ఇతర మసీదులు ఎన్నో అవమానాలు మరియు విధ్వంసాన్ని ఎదుర్కొంటున్నాయని పాకిస్థాన్ లేఖలో వెల్లడించింది.
హయత్ నగర్ బస్ డిపో 1 బస్ కండక్టర్ ను ఒక యువతి మద్యం మత్తులో బూతులు తిడుతూ, అతని పై దాడి చేసిన ఇన్సిడెంట్ ఆలస్యంగా బయటికి వచ్చింది. అయితే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అనేది తెలియలేదు. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న దాన్ని బట్టి, హయత్ నగర్ నుండి అఫ్టల్ గంజ్ మార్గంలో నడిచే 72 బస్ లో ఉదయాన్నే ఒక యువతి మద్యం సేవించి ఎక్కింది. 500 రూపాయల నోటు ఇచ్చి టికెట్ ఇవ్వమనడంతో కండక్టర్ ఇంత ఉదయం చిల్లర ఉండదని తెలిపాడు.
దాంతో ఆగ్రహించిన యువతి బస్ కండక్టర్ని నానా బూతులు తిట్టి, కొట్టడమే కాకుండా తోటీప్రయాణికులు చెబుతున్నా వినకుండా కండక్టర్ని కాలుతో తన్నడం, ఉమ్మడం జరిగింది. ఎంత చెబుతున్నా వినకుండా కండక్టర్పై దాడి చేసింది. ఆమె ప్రవర్తన భరించలేక చివరికి బస్సును పక్కకు ఆపడంతో ఆమె దిగిపోయింది.
అయితే దిగే ముందు కూడా బస్సులో ఉన్న మరో స్త్రీని సైతం బూతులు తిట్టింది. ఇదంతా ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘట పై ఎండి సజ్జనార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.



ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ అంజు(34), పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెకు కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్ లో పాకిస్థాన్ యువకుడు నస్రుల్లా ఖాన్(29)తో పరిచయం అయ్యింది. వీరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది. అలా కొన్నాళ్ళు సాగిన తరువాత ఇద్దరు కలవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే అంజు,భర్త పిల్లలను విడిచి పెట్టి, ప్రేమించిన వ్యక్తి కోసం సరిహద్దులు కూడా దాటి, జూలై 21న పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ఫ్రావిన్స్లో ఉండే దీర్ సిటీకి వెళ్లినట్టుగా తెలుస్తోంది.
ఈ విషయంలో అంజు భర్త అయిన అరవింద్ మాట్లాడుతూ, తన భార్య అంజు జైపూర్కు వెళ్తున్నాననే వంకతో గురువారం నాడు ఇంటి నుండి వెళ్లినట్టు వెల్లడించారు. అయితే అంజు పాకిస్థాన్కు వెళ్లినట్టుగా తెలిసిందని పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆమె స్నేహితుడిని కలవాలని తెలిపి, ఇంటి నుండి వెళ్లిపోయిందని తెలిపారు. ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు ఆమె భర్తకి ఫోన్ చేసి, ఆమె లాహోర్లో ఉన్నానని, 2, 3 రోజుల్లో ఇంటికి తిరిగి వస్తానని అంజు చెప్పినట్టు వెల్లడించాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో హాట్ టాపిక్గా మారింది.






