నటుడు పృథ్వి రాజ్ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ హాస్పిటల్ లో చేరారు. గత 10 రోజులుగా తీవ్రమైన జ్వరంతో ఆయన బాధ పడుతున్నారంట. కోవిడ్ నెగిటివ్ వచ్చినపటికి 15 రోజులు ఐసోలాషన్ లో ఉండమని డాక్టర్ సలహామేరకు హాస్పిటల్ లో చేరానని ఆయన సెల్ఫీ వీడియో లో తెలిపారు. మీ అందరి ఆశీర్వాదం, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోరుకుంటున్నా అని పృథ్వి రాజ్ అన్నారు.
News
రామ్ గోపాల్ వర్మ “మెగా ఫామిలీ” ని ఎందుకు టార్గెట్ చేసినట్టు? కారణం ఇదేనా?
నేను టాలీవుడ్ లో సినిమాలు చేయను అంటూ తట్ట బుట్ట సర్దేసి బాలీవుడ్ కు మకాం మార్చేసిన వర్మ అక్కడ తనతో సినిమాలు చేయడానికి ఎవరూ దొరకకపోవడంతో తిరిగి టాలీవుడ్ వచ్చేశాడు.తన కథలో పటుత్వం తగ్గడంతో వరుస ఫ్లాపులు డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్స్ కు లాస్ లు వస్తుండడంతో పెట్టిన డబ్బులను రెండింతలుగా రాబట్టుకోవడం కోసం వివాదాలు సృష్టించడం లేదా తన చిత్రాలు వివాదాల్లో ఇరుక్కునేల చేసి ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెంచేసి వాళ్ళని థియేటర్లకు వచ్చేలా చేశాడు.ఎవరి కిటుకైన కొద్దికాలమే పని చేస్తుంది.

అందుకే జనాలు ఈమధ్య రాంగోపాల్ వర్మ చిత్రాలకు వెళ్ళడం పూర్తిగా తగ్గించేశారు. దీనితో ఓటిటిల పై పడ్డారు.అక్కడ ఖర్చు తక్కువ లాభం ఎక్కువ అందుకే అందులో చేయాల్సిన రాక్షస ప్రయత్నాలన్నీ చేశారు బహుశా అవి కూడా బెడిసి కొట్టినట్టున్నాయి అందుకే ఇప్పుడు వరుసగా ఒక్కొక్క ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ చిత్రాలు చేస్తున్నారు.

ఎన్నికల ముందు నారా అండ్ నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఆర్జీవి ఇప్పుడు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు.మొన్న పవన్ ను టార్గెట్ చేసిన ఆర్జీవి ఇప్పుడు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ను టార్గెట్ చేస్తూ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట.ఈ ఆర్జీవి చిత్రాల దెబ్బ న్యూస్ చూడడానికి కూడా లేకుండా పోయింది ఎక్కడ చూసిన ఈయన.ఈయన అర్థం పర్థం లేని లాజిక్స్ అని సామాన్యులు అనుకుంటున్నారట.

ఫేస్ మాస్క్ పెట్టుకొని 22 మైళ్ళు పరిగెత్తారు ఆ డాక్టర్…చివరికి ఏమైందంటే?
కరోనా కారణంగా ఫేస్ మాస్కులు ధరించడం తప్పనిసరి చేసిన విషయం అందరికి తెలిసిందే. ఫేస్ మాస్క్ వేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ముక్కు, నోరు కవర్ అవ్వడం వల్ల కాలుష్యం ఉన్నాకూడా అది మన వరకు రాదు. అంతేకాకుండా కరోనా వచ్చిన వ్యక్తి అవతల వ్యక్తి తో మాట్లాడితే కూడా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందట. దాంతో ఫేస్ మాస్క్ వేసుకుంటే ప్రమాదాన్ని కొంతవరకు నియంత్రించవచ్చు.

ఫేస్ మాస్క్ ఎక్కువ మందికి అలవాటు ఉండదు కాబట్టి ధరించినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దాంతో చాలామంది ఫేస్ మాస్క్ ధరించడానికి ఎక్కువగా ఇష్టపడట్లేదు. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ ఫేస్ మాస్క్ ధరిస్తే ఊపిరి ఆడడం ఇబ్బంది అయ్యి, ఆక్సిజన్ ప్రవాహం తగ్గి హైపోక్సియా వస్తుంది అనే పుకార్లు వచ్చాయి.

representative image
ఈ పుకార్లను ఆపడానికి ఇటీవల ఒక వైద్యుడు 6 సర్జికల్ మాస్క్లను ధరించాడు. పల్స్ ఆక్సిమీటర్ సహాయంతో ఆక్సిజన్ పరిమాణాన్ని కొలిచాడు. ఆక్సిజన్ లెవెల్ మామూలుగానే ఉన్నట్టు తేలింది. మరొక వైద్యుడు ఫేస్ మాస్క్ వేసుకొని 22 మైళ్ళు పరిగెత్తాడు. ఆక్సిజన్ లెవెల్ 94 శాతం కంటే ఎక్కువగా ఉంటే సాధారణమైన ఆక్సిజన్ లెవెల్ గా పరిగణించబడుతుంది. పరిగెత్తేటప్పుడు ఆ డాక్టర్ ఆక్సిజన్ లెవెల్ 98 శాతం ఉందట.
ఈ విషయంపై డాక్టర్ టామ్ మాట్లాడుతూ ” చాలామంది మాస్క్ లను ధరించడానికి ఇష్టపడక ఏవేవో కారణాలు వెతుకుతూ ఉంటారు. ఇలాంటి పుకార్ల వల్ల ముఖ్యంగా భయపడేది శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవాళ్లు. ఒకవేళ ఫేస్ మాస్క్ ధరిస్తే ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, హైపోక్సియా వచ్చే అవకాశం ఉందేమో అన్న అనుమానాలు వాళ్లలో ఇంకా ఎక్కువగా ఉంటాయి.

ఇంట్లో కూడా పల్స్ ఆక్సిమీటర్ ఉంటే మంచిది. అందులోనూ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ల దగ్గర ఉంటే ఇంకా మంచిది. పల్స్ ఆక్సిమీటర్ ద్వారా ఆక్సిజన్ లెవెల్ ఎంతుందో మనమే తెలుసుకోవచ్చు, అప్పుడు ఆక్సిజన్ లెవెల్ ని బట్టి వైద్య సహాయం అవసరమా లేదా అనే విషయంపై ఒక నిర్ణయానికి రావచ్చు” అని అన్నారు.
“ఘటోత్కచుడు” సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా?
కోడి రామకృష్ణ తర్వాత సోషియో ఫాంటసీ సినిమాలు తీయడంలో ప్రత్యేకమైన ముద్ర ఏర్పరుచుకున్నారు ఎస్.వి.కృష్ణారెడ్డి. 90 సమయంలో పుట్టిన వాళ్లకి ఆయన సినిమాలు, పాటలు ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. అలా అని సోషియో ఫాంటసీ సినిమాలే కాకుండా మామూలు సినిమాలు కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీసేవారు.

కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా సినిమా నిర్మాణం, సంగీత దర్శకత్వం కూడా చేసేవారు. అలాగే కొన్ని సినిమాల్లో నటించారు కూడా. ఎస్ వి కృష్ణారెడ్డి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే మల్టీ టాలెంటెడ్ అన్న పదం ఆయనకి సరిగ్గా సరిపోతుంది.

ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సినిమాల్లో ఘటోత్కచుడు ఒకటి. ఆ సినిమాకి దర్శకత్వం తో పాటు సంగీత దర్శకత్వం కూడా వహించారు కృష్ణారెడ్డి. ఘటోత్కచుడు సినిమా తో ఎస్ వి కృష్ణారెడ్డి ఖాతాలో మరొక హిట్ పడడమే కాకుండా. ఆ సినిమాలో నటించిన కైకాల సత్యనారాయణ, అలీ, రోజా, తనికెళ్ల భరణి ఇలా ఎంతో మంది నటులకు మంచి పేరు తీసుకొచ్చింది.

ఘటోత్కచుడు సినిమా లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరొక పాత్ర చిట్టి. బేబీ నికిత నటన ఆ పాత్రకి జీవం పోసింది. అంత చిన్న వయసులోనే ఎంతో బాగా నటించింది నిఖిత. తన నటన చూసిన చాలామంది నిఖిత భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఆ సినిమా తర్వాత మరెక్కడా కనిపించలేదు నిఖిత.

అప్పుడే అంత బాగా నటించింది కాబట్టి ఇన్ని సంవత్సరాల సమయంలో తన నటన ఖచ్చితంగా ఇంకా మెరుగుపడే ఉంటుంది. ఒకవేళ నిఖిత సినిమాల్లోకి వస్తే మంచి నటిగా పేరు తెచ్చుకుంటుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఎంతో మంది బాల నటులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. బహుశా నిఖిత కూడా భవిష్యత్తులో హీరోయిన్ గా అందరినీ పలకరిస్తుందేమో చూద్దాం.
ఎప్పుడూ షూటింగ్ లు ప్రమోషన్స్ అంటూ బిజీగా ఉండే సెలబ్రెటీలు లాక్ డౌన్ ఎఫెక్ట్ తో అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు.ఇక ఇప్పుడు లాక్ డౌన్ మినహాయింపులు ఒక్కొక్కటిగా వస్తుండడంతో ఇంతకుముందులా మరోసారి సెలబ్రిటీలు బాగా బిజీ అయిపోనున్నారు.ఈ సందర్భంలో కెమెరా ముందు మాట్లాడిన ప్రగతి గారు తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సినిమాలలో సాంప్రదాయమైన అమ్మగా మోడరన్ పిన్నిగా నటించి మనల్ని అలరిస్తున్న ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ డాన్స్ లు,వర్కౌట్లు చేస్తూ ఫిట్ నెస్ ఆవశ్యకతను నేటి తరం యువతకు తెలియజేస్తున్నారు.షూటింగ్స్ లో ఎప్పుడూ బిజీగా ఉండే ఈమె ప్రస్తుతం తన ఫ్యామిలీతో టైం గడపుతున్నాని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా తన చేతి మీద ఎన్ని టాటూలు ఉన్నాయో వాటి వెనుక ఉన్న సిక్రెట్స్ ఏంటో చెప్పేశారు.అవేంటో ఇప్పుడు చూద్దాం.చిన్నప్పుడు తనకు టీకా వేసేటప్పుడు తన భుజం పై ఓ గాయం అయ్యిందని అందుకే అక్కడ సూర్యుని టాటూ వేయించుకున్నాని అలాగే తన మోచేతికి చేతికి మధ్య ఓ టాటూ ఉంది అది తన బెస్ట్ ఫ్రెండ్ తను కలిసి వేయించుకున్నామని చెప్పారు.ఆగండి ఇంకో టాటూ కూడా ఉంది అదే ఆమె ఉంగరం వేలు పైన ఉంది.దాని అర్థం క్వీన్ ఆట.సో ఇలా తన గురించి అభిమానులతో ఆసక్తికర విషయాలు పంచుకున్న ప్రగతి గారు తన టాటూలు వెనుక దాగున్న సీక్రెట్స్ ను కూడా చెప్పేశారు.
ఆశీర్వదించడానికి, గౌరవించడానికి ఎదుటివారిపై “ఉమ్మేస్తారంట”…ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?
ఉమ్మడం. ఇది వింటుంటేనే చాలామందికి చిరాగ్గా ఉంటుంది. రోడ్డు మీద మనం నుంచుని ఉంటే చాలామంది ఆలోచించకుండా ఎక్కడపడితే అక్కడ ఉమ్ముతారు. పక్కన మనుషులు ఉన్నారు కూడా పట్టించుకోరు. అలా ఉమ్మే వారికి వాళ్ళు చేసే పని తప్పు అని చెప్పి తిట్టాలి అనిపించినా కూడా చాలామంది నియంత్రించుకుంటారు.

కొంతమంది అయితే మామూలుగా కాకుండా గొంతుతో విచిత్రమైన శబ్దాలు చేస్తూ వాంతి చేసుకున్నట్టు ఉమ్ముతారు. ఈ ఎక్స్ప్లనేషన్ చూసి తిట్టుకోకండి. ఇలా నిజంగానే ఉంటారు.

గవర్నమెంట్ ట్రాఫిక్ రూల్స్ తో పాటు ఇలా ఉమ్మడానికి కూడా ఎక్కువ మొత్తంలో ఫైన్ వేస్తే బాగుండు అని అనుకుంటాం. తెలుసా? మనం అంతగా చిరాకు పడే ఉమ్మడం ఒక ఊరిలో సాంప్రదాయం. షాక్ అయ్యారా? ఇది నిజమే. అసలు విషయానికొస్తే కెన్యా, నార్త్ టాంజానియా ప్రాంతంలో ఉండే మసాయి అనే ఒక జాతి ప్రజలు ఉమ్మడాన్ని సాంప్రదాయంగా భావిస్తారు.

ఎవరినైనా పలకరించాలంటే వాళ్ల చేతుల్లో ఉమ్మి తుడుచుకుని తర్వాత అవతలి వారిని పలకరిస్తారట. అప్పుడే పుట్టిన పిల్లలని దీవించాలి అన్నా కూడా వాళ్ళపై ఉమ్ముతారట. అంతే కాకుండా అక్కడ పెళ్లిళ్లు అయినప్పుడు తండ్రి తన కూతురి నుదుటి పై ఉమ్మి ఆశీర్వదిస్తారట.
వర్మ “పవర్ స్టార్” బడ్జెట్ 10 లక్షలు…మరి కలెక్షన్స్ ఎంతో తెలుసా?
వివాదాలకు కేంద్ర బిందువైన రాంగోపాల్ వర్మ కరోనా టైంలో కూడా వరుసగా సినిమాలు తీస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.తాజాగా ఆయన పవర్ స్టార్ అనే చిత్రాన్ని తీశారు.ఈ చిత్రంలో పవన్ టార్గెట్ చేసే అంశాలు బోలెడు ఉన్నాయి.వాటిలో కొన్నిటిని ట్రైలర్ లో చూపించారు.దానితో ఒక వైపు మీడియా ప్రశ్నలతో మరోవైపు ఫ్యాన్స్ తిట్లతో ఆయనను ఫుల్ గా వాయించడం మొదలుపెట్టారు. కాని వాటిని ఆయన అసలు పట్టించుకోలేదు.పైగా దాని ద్వారా కావల్సినంత పబ్లిసిటీ దొరుకుతుంది కదా అని లైట్ తీసుకున్నాడు.

ఆయన కోరిన విధంగా సినిమా విడుదలైంది.ఈ చిత్రాన్ని చూడడానికి టికెట్ ధర 150 రూపాయిలు పెట్టారు.దానితో అసలు అందులో ఏముందో చూద్దాం అని కొన్న వాళ్ళంతా తర్వాత ఎందుకొన్నాం రా బాబు అనే రేంజిలో ఫీల్ అయ్యారు.ఎందుకంటే అందులో మ్యాటర్ లేదట సినిమా అంతా ఓ స్పూఫ్ లా ఉంది.పైగా చిత్రం బాగా బోరింగ్ గా సాగింది.ఈ చిత్రానికి ఇప్పటి వరకు దాదాపు 1,20,000 టికెట్స్ సేల్ అయ్యాయట.

ఈ చిత్రం పై ఆర్జీవి కనీసం పది లక్షలు కూడా ఖర్చు పెట్టలేదట.ఈ చిత్రం పై దాదాపు పది రెట్లు డబ్బులు వర్మ సంపాదించుకున్నాడు. తన ప్రయోగం సక్సెస్ అయ్యి బాగా డబ్బులు రావడంతో మరోసారి ఈ ప్రయోగానికి సిద్దమైపోయారు.ఈసారి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని టార్గెట్ చేసే స్క్రిప్ట్ ను రెడీ చేసుకుంటున్నారు. ఇది చూస్తున్న జనాలు,సినీ విశ్లేషకులు వర్మ ఏంటయ్యా మాకు ఈ కర్మ అని తలలు బాదుకుంటున్నారు.
సుశాంత్ మేనేజర్ దిశా ఆత్మహత్య కేసును కూడా సిబిఐ కి అప్పగించాలని కుటుంబసభ్యుల డిమాండ్.!
దేశాన్ని విస్తుపోయేలా చేసిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ కేసు రోజుకొక మలపు తిరుగుతుంది. ఎంతోమంది ప్రముఖులు ఇది ఆత్మహత్య కాదు హత్య అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.సరిగ్గా సుశాంత్ చనిపోయే వారం ముందు ఆయన మేనేజర్ దిశా సలియాన్ కూడా 14వ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.దీనితో వీరిద్దరి మరణానికి ఏదైనా కారణం ఉండి ఉండవచ్చని ప్రముఖులు అనుమానాలు వక్తం చేస్తున్నారు.

ఇలాంటి టైంలో ముంబై పోలీసులు దిశా సలియాన్ కేసుకు సంబంధించిన ఫైల్స్ను ధ్వంసం చేశామని చెప్పడంతో పోలీసుల తీరు పై బోలెడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అంతేకాకుండా తాజాగా రిపబ్లిక్ టీవీ నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్న సుశాంత్ ఫ్యామిలి ఫ్రెండ్ స్మిత పారిఖ్ తమ మేనేజర్ ను చంపిన వాళ్ళు తనని కూడా వదలరని సుశాంత్ సోదరి మీతూ సింగ్కు ఫోన్ చేసి చెప్పాడు.

ఇదంతా చూస్తుంటే వీరిద్దరి మరణం వెనుక ఓ పెద్ద గ్యాంగ్ ఉన్నట్లు దాని ఇన్ ఫ్లుఎన్స్ కు భయపడే పోలీసులు సరిగ్గా పని చేయట్లేదని ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఇన్ని రోజులు సైలంట్ గా ఉన్న దిశా సలియాన్ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఈ కేసును సిబిఐకి అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

సుశాంత్ కేసులో ముంబై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై చాలా రోజుల నుండి పలు వర్గాల నుండి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.రోజుకొక మలుపు తిరుగుతున్న సుశాంత్ కేసు చివరికి ఎటు చేరుతుందో వేచి చూడాలి.
కరోనా భయంతో 14 లక్షల రూపాయలు వాషింగ్ మెషిన్ లో వేసాడు…చివరికి ఏమైందంటే?
ఏదైనా అతిగా చేస్తే కచ్చితంగా అది ప్రమాదకరమే. కరోనా వైరస్ కారణంగా జనాలు దేని ముట్టుకోవాలి అన్నా కూడా భయపడుతున్నారు. దాంతో తీసుకునే జాగ్రత్తలు అన్ని కరెక్ట్ గానే తీసుకుంటున్నారు. అవేంటో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది మాత్రం అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానివల్ల కరోనా వైరస్ ఏమోగానీ లేని పోని సమస్యలు వస్తున్నాయి.

దక్షిణ కొరియా రాజధాని సియోల్కు దగ్గరలో ఉన్న అన్సాన్ నగరానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల మరణించారు. దాంతో అతని కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా బంధుమిత్రులు అందరూ కలిసి 42 డాలర్ల సహాయం చేశారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం 50000 రూపాయలు అన్నమాట. ఆ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా కాలం కావడంతో నోట్ల మీద ఏమైనా వైరస్ ఉంటుందేమో అనే అనుమానం వచ్చింది.

నోట్లని శానిటైజర్ తో శుభ్రం చేసి ఉంటాడేమో అని అనుకుంటాం. కచ్చితంగా ఇది అతి జాగ్రత్త అనిపిస్తుంది. కానీ అతను ఒక అడుగు ముందుకేసి నోట్లని వాషింగ్ మిషిన్ లో వేశాడు. ఇంక చెప్పేదేముంది? నోట్లన్నీ నానిపోయాయి. అంతటితో ఆగకుండా ఆ తడిసిన నోట్లని ఆరబెట్టడానికి వాటిని మైక్రోవేవ్ లో పెట్టాడు. నోట్ల కి చిల్లులు పడి పాడైపోయాయి.

అతనికి ఏం చేయాలో తెలీక నోట్ల ని తీసుకెళ్లి బ్యాంకులో ఇచ్చాడు. “అలాంటి నోట్లని బ్యాంకు వాళ్లు ఎందుకు తీసుకుంటారు కచ్చితంగా తీసుకోరు” అని అంటారా? అవును. మీరు అన్నట్టే జరిగింది. ఆ బ్యాంకు వాళ్లు ఆ నోట్లను తీసుకోలేదు. దాంతో ఈ వ్యక్తి చాలా సేపు వాళ్ళని బతిమిలాడితే చివరికి నోట్లపై నంబర్లు ఉన్న వాటిని తీసుకొని 1500 రూ ఇచ్చారు.
దేని గురించి అయినా అతిగా భయపడినప్పుడు మన మెదడు పనిచేయడం ఆగిపోతుంది. అతను కూడా తర్వాత ఆలోచించి ఉండొచ్చు ” అరె! అవి పేపర్లు కదా. నీళ్ళలో వేస్తే పాడైపోతాయి కదా. ఇంత చిన్న విషయాన్ని నేను ఎందుకు ఆలోచించలేకపోయాను? అని.
అతనే కాదు మనలో చాలామంది ఆలోచించకుండా చిన్న వాటిని కూడా అతిగా శుభ్రం చేస్తున్నారు. అతి జాగ్రత్త అంటే నోట్లని వాషింగ్ మిషన్ లో వేయడం ఒక్కటే కాదు ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి ఒకసారి శుభ్రం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆ వస్తువు లేదా పదార్థం పాడవకుండా శుభ్రం చేయండి. ఆరోగ్యంతో పాటు ఆలోచన కూడా చాలా ముఖ్యం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి.
రాఖీ కట్టమంటే ఆ చెల్లెలు ఏం కట్టిందో తెలుసా? దీంతో అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ చూస్తే నవ్వాపుకోలేరు!
రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళ బంధానికి నిదర్శనం. ఈ పండుగ ఎప్పుడు వస్తుంది అని చెల్లెలు వెయిట్ చేస్తుంటే అన్నలు మాత్రం ఈ పండుగ రోజు చెల్లెళ్లకు గిఫ్ట్ ఇవ్వడానికి డబ్బులు ఎక్కడ నుండి తేవాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటారు.

సాధారణంగా అనుబంధాలు, ఆత్మీయతల మీద తెలుగులో బోలెడన్ని చిత్రాలు ఉన్నాయి.కాని వాటి అన్నిటికంటే రాఖీ పండుగ కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగులో ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ రాఖీ పండగ గురించి దాని విశిష్టత గురించి మనం చిన్నప్పటి నుండి సినిమాలు,సీరియల్ లలో బోలెడు సార్లు చూసున్నాం మళ్లీ వాటి గురించి చెప్పి నేను మిమ్మల్ని విసిగించను లెండి విషయంలోకి వెళ్తాను.

నేడు రక్షాబంధన్ సందర్భంగా ఓ చెల్లి అన్నయ్యకి పూలు కట్టడానికి వాడే దారాన్ని కట్టి. రాఖీ కట్టానుగా మరి నా గిఫ్ట్ ఏది అని అడిగింది. ఇది రాఖీ నా? అని అన్నయ్య అడిగాడు.దానికి చెల్లెలు రాఖీ అంటే నమ్మకం అంతేకాని అది కలర్ దారమా లేక పూలు కట్టే దారమా అనేది చూడకూడదు అని అన్నది.

దానితో ఆ అన్నయ్య తను వాడే రేజర్ చెల్లెలు చేతిలో పెట్టాడు.నేను ఇదేం చేసుకోవాలి అని అడిగింది?దానికి ఆ అన్నయ్య లెజెండ్ లో బ్రహ్మానందం లాగా డబ్బులు ఇస్తే ఖర్చు చేసేస్తావు.అదే నీకు ఉపయోగపడేది ఇస్తే పూర్తిగా వాడి పాడు చేసేస్తావు అందుకే జ్ఞాపకంగా దాచుకుంటావని ఇది ఇచ్చాను అని కౌంటర్ ఇచ్చాడు.

దాంతో చెల్లి ఇంటి పక్కన ఉన్న షాప్ కి వెళ్ళి రాఖీ తెచ్చి కట్టింది. ఆతర్వాత మనోడు 500 రూపాయిలు ఆ చెల్లికి ఇచ్చాడు.ఈ అన్నా చెల్లెలు కథ సోషల్ మీడియా పుణ్యాన బయటకు వచ్చింది.
