ప్రముఖ హీరోయిన్ ఛార్మి సినిమాలలో నటనకు గుడ్ బై చెప్పేసి ప్రస్తుతం నిర్మాత పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు.ఎప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉండే ఛార్మి తన చిత్రాలకు సంబంధించి మరియు తన వ్యక్తిగత విషయాలు అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు అందిస్తుంటారు.

తాజాగా ఆమె ట్విట్టర్ వేదికగా తన ఆంటీ చనిపోయారన్న విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు.ఆమెతో దిగిన చిన్ననాటి ఫోటో మరియు వీడియో కాల్ సమయంలో తీసుకున్న స్క్రీన్ షాట్ ను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.విధి రాత చాలా బలమైనది దానికి ఎవరైనా తల వంచక తప్పదు నువ్వు లేని లోటు ఎవరు తీర్చలేనిది అంటూ ఆమె బాధను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు.
— Charmme Kaur (@Charmmeofficial) July 16, 2020


























