పూర్వం..టెలిఫోన్ అంటే ఎక్కడో ఉంటుండె..ఆ తరువాత సెల్ ఫోన్ యుగం మొదలైయింది.ఒకరి చేతిలో సెల్ ఫోన్ చూస్తే అదో విచిత్రం…ఇక రాను రాను..మన జీవితం లో సెల్ ఫోన్ ఒక భాగం గా మారింది.సెల్ ఫోన్ లేని మనిషి చాలా రాదు..సెల్ ఫోన్ లేని ఊరు లేదు,,మనిషి లేదు అన్నట్టుగా మనలో భాగం అయింది,ఎవరి స్థోమతకు తగ్గ ఫోన్ వారి దగ్గర ఉంటుంది..
ఇకపోతే సెల్ ఫోన్స్ లో ఎన్నో రకాలు..ఎన్నో కంపెనీలు,,ఉన్నాయి వాటి ధర కి అనుగుణంగా వాటిలో ప్రత్యేకతలు ఉంటాయి..మొబైల్ ఫోన్స్ ఎన్ని ఉన్న కూడా ‘ఐ’ ఫోన్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది,స్మార్ట్ ఫోన్ కి మించి ఉండే ఈ లుక్..స్టైల్ ఇంకో లెవెల్..అనుకోండి.ఇక పోతే ఐ ఫోన్లో ఐ అని ఉంటుంది అది గమనించారా ? ఆలా ఎందుకు ఉంటుంది ?

మొబైల్ ఫోన్స్ లో ఐ ఫోన్ ని బాహుబలి తో పోల్చవచ్చు..సాధారణంగా చాల మంది ఐ ఫోన్ వాడుతున్నా కూడా ఎవరికీ ఐ ఫోన్ లో ఐ గురించి తెలియకపోవచ్చు. 1998 వ సంవత్సరం లో ఐమాక్ కంప్యూటర్స్ ని విధుల చేసారు…దాని తరువాత చాలా మంది మదిలో ఐ అనే అక్షరం ఏంటి అనే ఆలోచనలో పడేసింది..ఇప్పుడు ఆ ఐ గురించి క్షున్నంగా తెలుసుకుందాం

ఐఫోన్ లోని మొదట అక్షరం ఐ ఫోన్లోని ఫీచర్స్ ని ఇంకా ఇంటర్నెట్ గురించి తెలియచేస్తుంది…కానీ ఐ అనే దాని యొక్క అర్థం చేసుకోవడమే కష్టమే ఎందుకంటే ఐఫోన్ కి ముందు వుండే ఐ అనే సంప్రదాయం మొదటగ మొదలైంది ‘ఐమాక్’ తోనే ఆపిల్ సంస్థ ప్రపంచానికి మొదటి కంప్యూటర్ ని 1998 వ సంవత్సరంలో ప్రవేశ పెట్టింది.

కంప్యూటర్ ని వినియోగదారులకి సౌకర్యవంతంగా ఉండేలా..మరియు ఇంటర్నెట్ చేరే విధంగా దీని రూపకల్పన జరిగిందని.ఆపిల్ చీఫ్ ఎక్సిక్యూటివ్ స్టీవ్ జాబ్స్ తెలిపారు.ఇది ఇంటర్నెట్ తో ఉపయోగించే పరికరం అని..వినియోగదారుని డ్రెన్స్ కి అనుగుణంగా తయారుచేయబడద్దని చెప్పారు.ఇది ఫుల్ బ్లడెడ్ మాకింతోష్.అయినప్ప్పటికీ ఇంటర్నెట్ సహాయంతో వేగవంతంగా పనిచేసే కంప్యూటర్ రూపకల్పన చెందిందని స్టీవ్ జాబ్స్ అన్నారు

లాంచింగ్ సమయంలో మిస్టర్ జాబ్స్ కొన్ని స్లైడ్స్ చూపిస్తూ ఐ యొక్క అర్ధం చెప్పే ప్రయత్నం చేసారు .ఆ స్లైడ్ ఏంటంటే
- ఇంటర్నెట్
- ఇండివిడ్యుల్
- ఇన్ సృక్ట్
- ఇన్ఫర్మ్
- ఇన్ స్పైర్

మాది ఒక పర్సనల్ కంప్యూటర్ సంస్థ అయినప్పటికి దీనిని విద్య విధానం కోసం లక్ష్యంగా పెట్టుకుని ఈ ఉత్త్పత్తి ని తయారు చేశామని .టీచింగ్ కి మరియు ఇతరత్రా చాల వాటికీ ఉపయోగ పడుతుంది అని జాబ్స్ చెప్పుకొచ్చారు . మా సంస్థ ఉత్త్పతులన్నిటిని చిన్న అక్షరాలతో బ్రాండ్ చేస్తుంది . ఐటూల్స్ మరియు ఐపాడ్ తో సహా హార్డ్ వేర్ సాఫ్ట్ వేర్ అన్ని పేరుతోనే మాట్లాడతాయి .ఇది అంతిమంగా ఐమేక్ లాగే ఐఫోన్ కుడా ఆపిల్ కంపెనీ ప్రోడక్ట్ అని పోల్చుకోదగ్గ దీటుగా ఉంటుంది ..

ఇంతకీ ఐ యొక్క అర్ధం ఏంటంటే జాబ్స్ తన స్లైడ్స్ లో చూపించనట్టుగానే ఐ అంటే ముఖ్యంగా ఇంటర్నెట్ ,ఇండివిడ్యుల్. ఆపిల్ విడుదల చేసిన ఐవాచ్ గాని ఐపాడ్ ఐమాక్ గాని అన్ని కుడా ఐ తో మొదలవుతాయి ఎందుకంటే ఆపిల్ ప్రొడక్ట్స్ అన్ని కుడా ఇంటర్నెట్ కి కనెక్ట్ చేసుకునే విధంగా ఉంటాయి . మొదటగా ఇంటర్నెట్ కి సరిపోయే కంప్యూటర్ ను రుపొందించింది ఆపిల్ సంస్థే .

టైటానిక్ నౌక 1912లో సముద్రంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ నౌక శకలాలను చూడడం కోసం పాకిస్తాన్ బిలియనీర్ షెహజాదా దావూద్, ఆయన తనయుడు సులేమాన్, బ్రిటీష్ బిజినెస్ మెన్ హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ నేవీ ఆఫీసర్ పాల్ హెన్నీ, ఓషన్ గేట్ ఫౌండర్ స్టాక్టన్ రష్ టైటాన్ జలాంతర్గామిలో ప్రయాణించారు.
ఈ అడ్వెంచర్ ట్రిప్ కు టికెట్ 2 కోట్ల పైనే ఉంటుంది. అత్యంత ఖరీదైన టూర్ అయినప్పటికీ సాహసాలు ఇష్టపడే వారు సముద్రం అడుగున ఉన్న టైటానిక్ శిథిలాలను చూడడానికి ఇష్టపడుతుంటారు. ముగ్గురు పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బందితో ఈ జలాంతర్గామి బయలుదేరింది. అయితే సముద్రం లోపలికి వెళ్లిన అనంతరం జలాంతర్గామిలో ఏదో సమస్య వచ్చింది. సిగ్నల్ కట్ అయింది. ట్రిప్ ను ప్రారంభించిన గంట 45 నిముషాల్లోనే జలాంతర్గామి కమ్యూనికేషన్ కోల్పోయింది. అయితే జలాంతర్గామిలో మరో 72 గంటలవరకు సరిపడే ఆక్సిజన్ ఉన్నట్లు సమాచారం.
జలాంతర్గామి లోపల చలి ఎక్కువయినపుడు ఆక్సీజన్ ఎక్కువ అవసరం ఉంటుందని, అందరు ఒక్కదగ్గర ఉండడం ద్వారా శరీరంలోని వేడిని ఆదా చేసుకోవచ్చని సెయింట్ జాన్స్ మెమోరియల్ యూనివర్సిటీ హైపర్బరిక్ మెడిసిన్ ఎక్స్పర్ట్ డాక్టర్ కెన్ లీడెజ్ అన్నారు. ఆక్సీజన్ నిల్వలు తగ్గిపోవడం మాత్రమే సమస్య కాదని, ఆ నౌకలో విద్యుత్ నిలిచిపోయిన ప్రమాదమే అని అన్నారు. జలాంతర్గామి లోపలి ఆక్సీజన్, కార్బన్ డయాక్సైడ్ల లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో విద్యుత్ పాత్ర ఉంటుంది.
ఆక్సీజన్ లెవెల్స్ తగ్గిపోయిన కొద్ది, కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి. అలా జరిగితే వారి కండిషన్ సీరియస్ అవుతాయి. కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ పెరిగిన కొద్దీ బాడీ మందకొడిగా మారి, మత్తు మందు పీల్చినట్లుగా వారంతా నిద్రలోకి వెళతారని, మనిషి బ్లడ్ ఫ్లోలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ అయితే వారు హైపర్కాప్నియాకు గురవుతారు. వెంటనే ట్రీట్మెంట్ అందకపోతే చనిపోతారు’’ అని చెప్పారు.




















ఇటీవల కాలంలో ఇలాంటి గేమ్ షోలు ఇండియాలో ఎక్కువగానే ప్రసారం అవుతున్నాయి. అనేక టీవి ఛానెల్స్ ఇలాంటి గేమ్ షోలను ప్రారంభించాయి. ఈ షోలలో పాల్గొని, గెలవడం ద్వారా డబ్బును గెలుచుకోవచ్చు. బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ 2000లో ప్రారంభించిన “కౌన్ బనేగా కరోడ్ పతి” టీవీ షోకు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అదే షోని తెలుగులో “మీలో ఎవరు కోటీశ్వరుడు” పేరుతో 2014 నుంచి మాటీవీలో ప్రారంభం అయ్యింది. తెలుగులో కూడా ఈ షో సక్సెస్ అయ్యింది.
తొలి 3 సీజన్లకి నాగార్జున హోస్ట్, 4వ సీజన్కి మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా చేశారు. 5 వ సీజన్కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అలరించారు. అయితే ఐదో సీజన్ జెమిని టీవిలో ప్రసారం అయ్యింది. ఈ షో పేరును “ఎవరు మీలో కోటీశ్వరులు” గా మార్చారు. ఈ షోలలో ఇప్పటివరకు చాలా మంది ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. అయితే ఈ షోలలో మనీని గెలుచుకున్న పోటీదారులకు మనీని నిజంగానే ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఆ మనీని ఎవరు ఇస్తారనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. షోలో గెలిచినవారికి వారికి ఆ షో నిర్మాత డబ్బును ఇస్తారు.
సినిమాలకు ప్రొడ్యూసర్స్ ఎలా ఇస్తారో అలాగే షోను హోస్ట్ చేసిన వ్యక్తికి, అలాగే గెలిచిన కంటెస్టెంట్ కి కూడా నిర్మాతనే డబ్బును ఇస్తారు. ఈ షో మధ్యలో వచ్చే ప్రకటనల ద్వారా నిర్మాతలకు అధిక మొత్తంలో డబ్బు వస్తుంది. ఈ షో రాత్రి పూట మాత్రమే టెలికాస్ట్ చేస్తారు. ఏ భాషలో అయినా సరే ఈ షో రాత్రి పూట వస్తుంది. అందుకు కారణం ఏంటంటే ఆ సమయంలో టిఆర్పి చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో టిఆర్పి ఎక్కువగా ఉంటే యాడ్స్ కూడా ఎక్కువగా వస్తాయి.







