ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2022 ఫైనల్ మ్యాచ్ లో విన్నింగ్ సిక్సర్ కొట్టిన అనంతరం శుబుమన్ గిల్ సెలబ్రేషన్స్ మాత్రం మామూలుగా లేవు.
రాజస్థాన్ బౌలర్ మేక్ కామ్ బౌలింగులో డీప్ స్క్వేర్ లెగ్ సైడ్ సిక్స్ కొట్టటంతో గుజరాత్ టైటాన్స్ గెలుపు సొంతమైంది. ఈ గెలిచిన సంబరంలో గిల్ అచ్చం విరాట్ కోహ్లీలాగే సెలబ్రేట్ చేసుకున్నారు.

కోహ్లీ విన్నింగ్ షాట్స్ పుట్టినప్పుడు గాని, సెంచరీలు చేసినప్పుడు హెల్మెట్ తీసేసి.. బాడీ ని కాస్త వెనకకు వంచి కేకలు వేస్తూ సెలబ్రేట్ చేసుకుంటాడు. అయితే గిల్ కూడా ఆ విధంగానే సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో ఆయన సెలబ్రేషన్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే శుబు మాన్ హెల్మెట్ తీసేసి సింహంలా గర్జించాడు. అనంతరం అవతల ఉన్నటువంటి తన సహచరుడు మిల్లర్ ను కౌగిలించుకుని వేడుకలు జరుపుకున్నాడు.
.@gujarat_titans – The #TATAIPL 2022 Champions! 👏 👏 🏆 👍
The @hardikpandya7-led unit, in their maiden IPL season, clinch the title on their home ground – the Narendra Modi Stadium, Ahmedabad. 🙌🙌 @GCAMotera
A round of applause for the spirited @rajasthanroyals! 👏 👏 #GTvRR pic.twitter.com/LfIpmP4m2f
— IndianPremierLeague (@IPL) May 29, 2022
ఈ మ్యాచ్ లో గిల్ మాత్రం అద్భుతంగా ఆడాడు అని చెప్పవచ్చు. 43 బంతుల్లో 45 పరుగులతో చివరి వరకు క్రీజులో ఉన్నాడు. హార్థిక్ పాండ్యాతో జత కట్టి మూడో వికెట్ కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. దీని అనంతరం డేవిడ్ మిల్లర్ (19/32)తో కలిసి మ్యాచ్ అయిపోయే వరకు క్రిజ్ లో నిలబడ్డాడు. వీరిద్దరు కలిసి మ్యాచ్ విన్నింగ్ కోసం (29/47) పరుగులు చేశారు.
King 👑 and Prince 🤴@imVkohli @ShubmanGill #ViratKohli𓃵 #ShubmanGill #AavaDe pic.twitter.com/JmhcJA7r1S
— 133*𓃵 (@133_NotOut) May 29, 2022
లైఫ్ ఇచ్చిన చాహల్ :
131 పరుగుల చిన్న లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగినటువంటి గుజరాత్ కు శుభారంభం మాత్రం దక్కలేదు. బౌన్సీ పీచ్ కావడంతో వేసిన బంతులు ఎక్స్ట్రా బౌన్స్ అవుతూ బ్యాటర్లకు సరైన అంచనా లేకుండా ఉన్నాయి. ఈ సందర్భంలోనే బౌల్ట్ వేసిన మొదటి ఓవర్లో గిల్ ఇచ్చిన క్యాచ్ చాహల్ నేలపాలు చేశారు. ఇలా గోల్డెన్ అకౌంట్ నుండి తప్పించుకున్న గిల్ ఇచ్చిన లైఫ్ ను సద్వినియోగం చేసుకున్నారు. ఇలా చివరి వరకు క్రీజులో ఉండి చివరికి విన్నింగ్ షాట్ కొట్టేశారు.
https://twitter.com/AkshatOM10/status/1530977937897705473?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1530977937897705473%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.mykhel.com%2Fcricket%2Fipl-2022-final-shubhman-gill-celebrates-in-kohli-style-after-hitting-a-match-winning-six-in-final-041840.html


































































#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
పాటిదర్ సెంచరీతో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి బెంగళూరు జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించగా.. లక్ష్యఛేదనలో లక్నో టీం 193/6 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ ను గెలిపించి ఇన్నింగ్స్ ఆడిన రజత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నిజానికి ఐపీఎల్ 2022 వేలంలో బెంగళూరు జట్టు రజత్ ను కొనుగోలు చేయలేదు. గత ఏడాది ఆర్సిబి తరఫున ఆడిన మిడిలార్డర్ బ్యాటరును రిటర్న్ కూడా చేసుకోలేదు. ఐపీఎల్ 2022 సీజన్లో 20 లక్షల కనీస ధర తో రజత్ పాటిదర్ రాగ బెంగళూరు కనీస బిడ్ కూడా వేయలేదు..
దీంతో ఏ ప్రాంచైజీ అతని పై ఆసక్తి చూపకపోవడంతో, ఆయన అన్ ఫోల్డ్ ఆటగాడిగా మిగిలిపోయారు. ఐపీఎల్ 2021 లో నాలుగు మ్యాచులు ఆడిన పాటిదర్ 71 పరుగులు చేశారు. దీంతో ఆర్సిబి అతన్నీ వద్దనుకుంది. కానీ ఈ సీజన్ ప్రారంభంలోనే వికెట్ కీపర్ మరియు బ్యాటరు లూవింగ్ సిసోడియా గాయం వల్ల బెంగళూరు జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో వచ్చిన రజత్ తన కెరీర్లో 31 t20 మ్యాచ్ లు ఆడి 138.64 స్ట్రైక్ రేట్ తో 861 పరుగులు చేసి ఉన్నాడు.
దీంతో అతన్ని జట్టులోకి తీసుకున్న వెంటనే తుది జట్టులో అవకాశం ఇచ్చింది. ఈ ఛాన్స్ లను రెండు చేతులా రజత్ ఉపయోగించుకున్నారు. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన పాటిదర్ 156.25 స్ట్రైక్ రేట్ తో 275 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ మరియు హాఫ్ సెంచరీ కూడా ఉంది. అయితే లక్నో మ్యాచ్ జరిగిన తరువాత వేలంలో అతని తీసుకోకపోవడంపై స్పందించేందుకు అతడు నిరాకరించాడు. అది నా పరిధిలో ఉండని అంశమని చెప్పుకొచ్చారు.
కానీ 19వ ఓవర్ లో దినేష్ చేసినటువంటి చిన్న తప్పిదం కారణంతో స్ట్రైకింగ్ కి వెళ్లిన రాహుల్.. ఆ తర్వాత బాల్ కే అవుటయ్యారు.. దీంతో బెంగళూరు జట్టు గెలుపు ఖాయమైంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో ఉన్నప్పుడు హేజిల్ వుడ్ బంతిని స్లో డెలివరీ చేశాడు. దీన్నీ గమనించ లేకపోయినా ఎవిన్ లావిస్ బ్యాట్ అడ్డంగా ఊపాడు. అయితే అతని బ్యాట్ కు దొరకని బాల్ దినేష్ కార్తీక్ ముందు పడింది.
దీంతో సింగిల్ కు కేఎల్ రాహుల్ పరిగెత్త గా.. ఊహించలేని దినేష్ కార్తీక్ ఒక గ్లోవ్స్ తీసేసి చాలా వేగంగా బంతిని బౌలర్ కి విసిరాడు.. కానీ హెజిల్ ఆ బాల్ ను అందుకని నాన్ స్ట్రైక్ రనౌట్ చేయలేకపోయాడు. మ్యాచ్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వికెట్ కీపర్ ఒక గ్లోవ్ తీసేసి.. రనౌట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు.. దీంతో బ్యాటరులు బైస్ కొరకు పరిగెత్తే సాహసం అయితే చేయరు. కానీ ఈ మ్యాచ్ లో దినేష్ కార్తీక్ ఏమరా పాటుతో వ్యవహరించారు. కానీ రాహుల్ చాన్స్ తీసుకున్నాడు. ఇదే బెంగళూరుకు కలిసొచ్చింది.
ఆ సింగిల్ తో స్ట్రైక్ కి వచ్చిన రాహుల్.. హేజిల్ వుడ్ విసిరిన లో యార్కర్ బాల్ ను స్కూఫ్ చేయబోయి షాబాజ్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన బంతిలో పాండ్య గోల్డెన్ డక్ అయ్యాడు. ఈ రనౌట్ నుంచి తప్పించుకొని చివరిదాకా లావిష్ క్రీజులో ఉన్న ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. ఒకవేళ కె.ఎల్.రాహుల్ చివరి వరకు క్రీజులో ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో అని అంటున్నారు క్రికెట్ అభిమానులు.




























