మత్తు వదలరా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు శ్రీ సింహ. ఈ సినిమా సైలెంట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత నుండి శ్రీ సింహ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఉస్తాద్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : ఉస్తాద్
- నటీనటులు : శ్రీ సింహ కోడూరి, కావ్య కళ్యాణ్రామ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా.
- నిర్మాత : రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు
- దర్శకత్వం : ఫణిదీప్
- సంగీతం : అకీవా బి
- విడుదల తేదీ : ఆగస్ట్ 12, 2023

స్టోరీ :
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా కథ మొదలవుతుంది. సూర్య (శ్రీ సింహ) అక్కడే పుట్టి పెరిగిన ఒక అబ్బాయి. చిన్నప్పుడే సూర్య తండ్రి (వెంకటేష్ మహా) చనిపోవడంతో, తల్లి (అను హాసన్) సూర్యని పెంచుతుంది. అయితే సూర్యకి ఎత్తైన ప్రదేశాలు అంటే భయం. అంతే కాకుండా కోపం కూడా విపరీతంగా ఉంటుంది. జీవితంలో ఏ విషయం మీద క్లారిటీ ఉండదు. డిగ్రీలో ఉన్నప్పుడు సూర్య ఒక బైక్ కొనుక్కుంటాడు. ఆ బైక్ కి ఉస్తాద్ అని పేరు పెడతాడు.

ఆ తర్వాత మేఘన (కావ్య కళ్యాణ్రామ్) తో ప్రేమలో పడతాడు. అయితే సూర్య తర్వాత పైలట్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు. అసలు ఎత్తైన ప్రదేశాలు అంటే భయం ఉన్న సూర్య పైలట్ అవ్వాలని నిర్ణయించుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. సూర్య తన భయాన్ని ఎలా అధిగమించాడు? పైలట్ అయ్యాడా? ఆ తర్వాత సూర్య ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? తన ప్రేమ కథలో ఎలాంటి సమస్యలు వచ్చాయి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
కీరవాణి గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రీ సింహ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన మొదటి సినిమా అయిన మత్తు వదలరా, ఆ తర్వాత వచ్చిన తెల్లవారితే గురువారం సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇటీవల వచ్చిన భాగ్ సాలే సినిమా మాత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఇంక ఉస్తాద్ సినిమా విషయానికి వస్తే కథ కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. అది కూడా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందించారు అనంగానే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి.

సినిమాలో చాలా మంది మంచి యాక్టర్లుగా పేరు పొందిన నటీనటులు ఉన్నారు. అందుకే ప్రతి పాత్ర తెరపై చూపించిన విధానం బాగుంది. హీరో హీరోయిన్లుగా నటించిన శ్రీ సింహ, కావ్య కూడా బాగా నటించారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్క యాక్టర్ నటనలో సహజత్వం కనిపిస్తుంది. అలాగే పవన్ కుమార్ పప్పుల అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కానీ కథని తెరపై చూపించే విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. సినిమా చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది.

చిన్న పాయింట్ ని చాలా ఎక్కువ సేపు చూపించడానికి ప్రయత్నం చేశారు. కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. అసలు ఒక పాయింట్ తర్వాత సినిమా ఎటో పోతుంది ఏమో అనిపిస్తుంది. హీరో హీరోయిన్స్ కి మధ్య వచ్చే డైలాగ్స్, కామెడీ బాగానే ఉన్నాయి. అంత మంచి ఎమోషన్స్ ఉన్న స్టోరీ సినిమా ల్యాగ్ కారణంగా ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వదు. స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం ఫాస్ట్ గా ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- దర్శకుడు ఎంచుకున్న పాయింట్
- సినిమాటోగ్రఫీ
- నటీనటులు
- కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్:
- సినిమా నిడివి
- సాగదీసినట్టుగా ఉండే స్క్రీన్ ప్లే
రేటింగ్ :
2.5 / 5
ట్యాగ్ లైన్ :
దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా కూడా చూపించడంలో విఫలం అయ్యారు ఏమో అనిపిస్తుంది. ఇంత సాగదీయకుండా ఉన్నట్టు అయితే సినిమా ఫలితం వేరేగా ఉండేది ఏమో. ఇప్పుడు అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే ఉస్తాద్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : “సినిమాలో వీటి అవసరం ఏం ఉంది..?” అంటూ… చిరంజీవి “భోళా శంకర్” మూవీపై కామెంట్స్..!

భోళా శంకర్ మూవీ సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్. 2015లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన వేదాళం అనే సూపర్ హిట్ చిత్రానికి భోళా శంకర్ రీమేక్ గా తెరకెక్కింది. ఒరిజినల్ మూవీకి కి డైరెక్టర్ శివ దర్శకత్వం వహించారు. తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. దాదాపు 10 సంవత్సరాల తరువాత దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు.
గతంలో మెహర్ రమేష్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్ లాంటి అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను తీసినప్పటికీ, అవి హిట్ అందుకోలేకపోయాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తో మంచి కమ్ బ్యాక్ కావాలని భావిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే షోలు పడడంతో మూవీ చూసిన ఆడియెన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
భోళా శంకర్ సినిమాను చూసినవారు కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఈ మూవీ లోని సీన్స్ కు సంబంధించిన ఫోటోలతో కూడిన మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ సామాజిక మధ్యమాలలో ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
















సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రలలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు నటించారు. మలయాళ ఇండస్ట్రీ నుండి మోహన్ లాల్, కన్నడ ఇండస్ట్రీ నుండి శివరాజ్ కుమార్, బలివుడ్ నుండి జాకీష్రాఫ్ నటించారు. రజిని కాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించగా, హీరోయిన్ తమన్నా, టాలీవుడ్ నటుడు సునీల్ కూడా ఈ మూవీలో నటించారు. విలన్ గా మలయాళ నటుడు వినాయకన్ నటించారు.
మొదట ఈ మూవీ పై అంతగా అంచనాలు లేనప్పటికీ, టీజర్, సాంగ్స్, రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో ‘కావాలయ్యా’ సాంగ్ 100 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే షోలు ప్రారంభం కావడంతో జైలర్ మూవీ చూసిన వారు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. కొందరు నెటిజెన్లు ఫస్ట్ హాఫ్ బాగుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇంటర్వల్ సన్నివేశంలో వింటేజ్ రజినీకాంత్ కనిపిస్తాడని, స్క్రీన్ ను షేక్ చేశాడని అంటున్నారు. మరికొందరు ఈ మూవీ రజినీకాంత్ అభిమానులకి ఫుల్ ఫీస్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే జైలర్ మూవీ రిలీజ్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆ మీమ్స్ ఏమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.







సూపర్ స్టార్ మహేష్ బాబు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఆ తరువాత వారిద్దరి కాంబోలో తెరకెక్కిన రెండవ చిత్రం ‘బిజినెస్ మేన్’. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు యాక్షన్. డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
మహేష్ బాబు హీరోగా నటించిన పలు చిత్రాలు థియేటర్లలో రి రిలీజై సెన్సేషన్ సృష్టించగా, ఈ ఏడాది మహేష్ పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ అవుతున్న బిజినెస్ మేన్ సినిమా కూడా రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో కోటి రూపాయల గ్రాస్ మార్క్ ను దాటిందని తెలుస్తోంది.
హైదరాబాద్ లో 172 షోలు పడుతుండగా, వీటిలో 110 హౌస్ ఫుల్స్ అయినట్టు తెలుస్తోంది. మహేష్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు బిజినెస్ మేన్ మూవీ రీరిలీజ్ పై పలు మీమ్స్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. సోమవారం (ఆగస్టు 7) నాడు రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయం పై చర్చ జరుగగా, మన్మోహన్ సింగ్ చక్రాల కుర్చీలో వచ్చి ఓటు వేసారు. ఓటింగ్ ముందు సీరియస్ గా జరిగిన చర్చలో 90 ఏళ్ల వయసులోనూ పాల్గొన్నారు. ఆయన మౌనంగా రాజ్యసభలో జరిగిన చర్చను నిశితంగా గమనించి, ఆ తరువాత ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే రాజ్యసభకు వచ్చిన మన్మోహన్ సింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తన అనారోగ్యాన్ని పట్టించుకోకుండా, తన బాధ్యతను నెరవేర్చడం కోసం వచ్చిన మన్మోహన్ సింగ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు పార్లమెంట్ కు రాకుండా ఉంటారని, కానీ 90 సంవత్సరాల వయసులో ఉన్న మన్మోహన్ సింగ్ ను చూసి వారు నేర్చుకోవాలని నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు. సెప్టెంబర్ లో మన్మోహన్ సింగ్ 91వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు.
సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో ఆ బిల్లును ఆమోదముద్ర కోసం రాష్ట్రపతికి పంపించనున్నారు. ఈ బిల్లుతో దేశరాజధాని డిల్లీలోని పరిపాలన యంత్రాంగం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక పై కేజ్రీవాల్ ప్రభుత్వ నియంత్రణ ఢిల్లీ ఉద్యోగుల పై నామమాత్రంగా ఉంటుంది.
కరాటే కళ్యాణి ప్రజాకవి గద్దర్ మరణ వార్త తెలిసి, ముందుగా పద్ధతిగా ఆయన మరణానికి బాధపడుతూ ఒక పోస్ట్ ను సోషల్ మీడియాలో పెట్టారు. కాసేపటికి ఫేస్ బుక్ లో వివాదాస్పద పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో ‘బాలు గారు విశ్వనాథ్ గారు సిరివెన్నెల గారు వెళ్లిపోయిన రోజున ఎర్ర బ్యాచ్ ఏమన్నారు మర్చిపోలేదు కానీ పోయినోల్లని తిట్టే సంస్కారం మా ధర్మం లో లే’ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ తో గద్దర్ ఫ్యాన్స్ కరాటే కళ్యాణి పై మండిపడ్డారు.
‘మనిషి మరణిస్తే ఇలాంటి పోస్ట్ చేస్తావా? అందువల్లే కదా అందరూ నిన్ను తిట్టేది.. పోయినవాళ్ళని తిట్టడానికి ఎలా మనసు వస్తుంది. నువ్వు అసలు మనిషివేనా? అని ఓరేంజ్లో ఆగ్రహిస్తున్నారు. అయితే గద్దర్ అభిమానులు చేస్తున్న కామెంట్లపై కరాటే కళ్యాణి స్పందిస్తూ ఫేస్ బుక్లో లైవ్ పెట్టింది. ఆ లైవ్ లో గద్దర్ పాటల పై, గద్దర్ కుమారుడి పై వివాదాస్పద కామెంట్స్ చేసింది. గద్దర్ పాటలతో ఎంతోమంది ప్రభావితం అయ్యి, అడవిబాట పట్టారు. అంతమంది అడవిదారి పడితే, మరి గద్దర్ కుమారుడు అమెరికాలో ఉన్నారు.
తాను అయితే ఏ విషయం అయినా మొదట మనం పాటించి, ఆ తరువాత అమలు పరచాలని భావిస్తాను. కానీ గద్దర్ అందర్నీ అడవిదారి పట్టించి, తన కుమారుడిని మాత్రం అమెరికాకు పంపించారు. సోషల్ మీడియాలో పెట్టె పోస్ట్లన్ని అందరికీ నచ్చనవసరం లేదు. అందరికి నచ్చేలా పోస్ట్లు పెట్టలేం, తిట్టేవాళ్ళు తిడుతూనే ఉంటారు. అలాంటి వారి కోసం తన పద్దతిని మార్చుకోనని, ఎవరు తిట్టినా పట్టించుకోనని, తన పోస్ట్లు తన ఇష్టం అని చెప్పుకొచ్చారు.
విశాఖలోని వన్టౌన్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రమేష్ మర్డర్ కేసులో వీడియో లభించిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడియో చూసిన పోలీసులు, రమేష్ వైఫ్ తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. లవర్ రామారావుతో కలిసి రమేష్ భార్య మంగళవారం రాత్రి భర్తను ఊపిరాడకుండా చేసి చంపేసిన సంగతి తెలిసిందే. అయితే రమేష్ ను చంపడం కోసం ముందుగానే తన లవర్ తో కలిసి శివాని కుట్ర పన్నింది. హత్య విషయంలో తన పై సందేహం రాకుండా హత్య చేయకముందే రమేష్ తో చాలా ప్రేమగా ఉన్నట్లు వీడియో తీసింది.
మంగళవారం నాడు రాత్రి మటన్ కర్రీ చేసి, భర్తకు పెట్టి, మద్యం తాగించింది. తాను చాలా మంచిదని, మై వైఫ్, మై లైఫ్ అని రమేష్ తో చెప్పించి, వీడియోను రికార్డు చేసింది. ఆ తరువాత మద్యం మత్తులో ఉన్న భర్తను తీసుకెళ్ళి బెడ్ పై పడుకోబెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మర్దర్ కేసు తనపై పడకుండా ఉండడం కోసమే, తాను మంచిదాన్ని అని రమేష్ తో చెప్పించి, వీడియోను రికార్డ్ చేసినట్లు శివాని పోలీసులు ఎదుట ఒప్పుకుంది. దీంతో శివాని తెలివితేటలకు అందరూ షాక్ అవుతున్నారు.
విచారణలో శివాని తనకు పెద్దమ్మ కూతురు పైడమ్మ వల్లే రామారావుతో పరిచయం అయ్యిందని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో రమేష్ మర్డర్ ఈ హత్య కేసులో పైడమ్మ హస్తం కూడా ఉందని శివాని పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించిందని సమాచారం. ఇక ఈ కేసులో ప్రస్తుతం రమేష్ భార్య శివాని, ఆమె లవర్ రామారావు, మరియు అతని ఫ్రెండ్ నీలా మీద మాత్రమే కేసును నమోదు చేశామని పోలీసులు తెలిపినట్లు సమాచారం.