ఈ మూడు కీర్తి సురేష్ సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటో గమనించారా..?

ఈ మూడు కీర్తి సురేష్ సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటో గమనించారా..?

by Anudeep

Ads

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు ఇండస్ట్రీ లో బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన “మహానటి” సినిమాలో నటించిన కీర్తి సురేష్ సావిత్రిని మరిపించింది. ఆ సినిమా చూస్తున్నంతసేపు మనకి కీర్తి సురేష్ కనిపించదు. సావిత్రి గారే కనిపిస్తారు. అంతలా ఆమె నటించి మెప్పించింది.

Video Advertisement

ప్రస్తుతం కీర్తి సురేష్ పలు తెలుగు సినిమా ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉంది. వాటిలో మెగాస్టార్ తో నటిస్తున్న సినిమా కూడా ఉంది. మెగాస్టార్ “భోళా శంకర్” సినిమాలో కీర్తి సురేష్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ మెగాస్టార్ కు చెల్లెలిగా నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇది ఇలా ఉంటె.. ప్రస్తుతం కీర్తి సురేష్ నటించిన “సర్కారు వారి పాట” సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. “నేను శైలజ” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కీర్తి సురేష్ తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు. ఆ తరువాత నేను లోకల్, మహానటి, రంగ్ దే, మిస్ ఇండియా, అజ్ఞాతవాసి, గుడ్ లక్ సఖి.. వంటి సినిమాలతో తెలుగు వారికి మరింత చేరువయ్యారు. తాజాగా విడుదల అయిన “సర్కారు వారి పాట సినిమా”తో మరో హిట్ ను తన ఖాతాలో జమ చేసుకున్నారు.

masters 1

ప్రస్తుతం కీర్తి సురేష్ కెరీర్ ఫుల్ ఫామ్ లో నడుస్తోంది అని చెప్పొచ్చు. అయితే కీర్తి సురేష్ నటించిన ఓ మూడు సినిమాల్లో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటో ఇప్పుడు చెప్పుకుందాం. కీర్తి సురేష్ నటించిన రంగ్ దే, మిస్ ఇండియా.. తాజాగా నటించిన సర్కారు వారి పాట సినిమాలలో కీర్తి సురేష్ మాస్టర్స్ చదవడం తన డ్రీం అని చెప్తూ ఉంటారు. మాస్టర్స్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న అమ్మాయి పాత్రల్లో కనిపిస్తారు. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. మాస్టర్ చేసే అమ్మాయి రోల్ అని చెప్తే చాలు.. కీర్తి సురేష్ సినిమా ఒకే చేసేస్తారు అంటూ కొందరు నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

 


End of Article

You may also like