రిలీజ్ అవ్వకముందే కోట్లల్లో లాభం..! దిల్ రాజు ప్లాన్ మాములుగా లేదుగా..?

రిలీజ్ అవ్వకముందే కోట్లల్లో లాభం..! దిల్ రాజు ప్లాన్ మాములుగా లేదుగా..?

by Anudeep

Ads

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా వారసుడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి తమిళంలో ‘వారిసు’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా తెలుగులో వారసుడుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ నెట్టింట వైరల్ గా మారింది.

Video Advertisement

కమర్షియల్ హంగులతో వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న ఈ సినిమాపై జనాల్లో భారీ అంచనాలున్నాయి. పైగా రోజురోజుకు విజయ్ పాపులారిటీతో పాటు ఆయన సినిమాల మార్కెట్ రెట్టింపవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారసుడు సినిమా బిజినెస్ విషయమై దిల్ రాజు బెస్ట్ డీల్స్ చేస్తున్నారట.

dil raju making best plans for varisu business
ఈ సినిమా నాన్ థియేట్రికల్, వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ కలుపుకుని మొత్తంగా 300 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ నడిచిందని తెలుస్తోంది. అయితే తెలుగులో మాత్రం స్వయంగా తానే ఈ సినిమా హక్కులు తీసుకొని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట దిల్ రాజు.

dil raju making best plans for varisu business
ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. అదే సమయంలో విడుదల కాబోతున్న చిరంజీవి “వాల్తేరు వీరయ్య” మరియు బాలకృష్ణ “వీరసింహారెడ్డి” సినిమాలతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ కాబోతోంది. ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్, క్రేజీ హీరోయిన్ రష్మిక మందన నటిస్తుండటం జనాల్లో మరింత ఆసక్తి పెంచింది.

dil raju making best plans for varisu business

మహర్షి సినిమాతో మంచి గుర్తింపును అందుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి పూర్తి కమర్షియల్ అంశాలతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి బిజినెస్ జరగబోతున్నట్లు తెలుస్తోంది.

source:https://twitter.com/sekartweets/status/1587270790776786944


End of Article

You may also like