Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ నటించిన సర్కారు వారి పాట మే 12న ప్రేక్షకులను అలరించడానికి భారీ అంచనాలతో వచ్చేసింది. గీత గోవిందం ఫేమ్ పరుశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కామెడీ అండ్ యాక్షన్ మిక్సిడ్ కంటెంట్ గా రూపొందిందని తెలిసిన విషయమే.
Video Advertisement
మొదటి షో లో ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నా, కొన్ని కారణాల వల్ల సర్కారు వారి పాట సినిమా కి రాను రాను ప్రేక్షకులలో నెగిటివ్ టాక్ వెలువడుతుంది. తాజాగా ఈ సినిమాలో ఓ లాజిక్ మిస్ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.
పరశురాం ఎక్కువగా మహేష్ బాబు మీద ఫోకస్ పెట్టడంతో, కథలో చాలా లాజిక్స్ మిస్ చేశాడని, ఇలా లాజిక్ మిస్ చేయడం వల్ల దర్శకుడు కథకు కావాల్సిన బలం చేకూర్చోలేక పోయాడని ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ దర్శకుడు పరశురామ్ మిస్ చేసిన లాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా స్టోరీకి, మహేష్ బాబుకు ఉన్న లింక్ విషయంలో క్లారిటీ మిస్ అయింది.
అసలు మహేష్ బాబు ఇండియాకి వచ్చిందే కళావతి మహేష్ నుంచి మోసం చేసి తీసుకున్న డబ్బు కోసం. అది కూడా పదివేల డాలర్లు. అంటే 77 లక్షల కోసం. కానీ, మహేష్ నుంచి కళావతి ఇంకా ఎక్కువ డబ్బులే తీసుకుంటుంది. కానీ.. మహేష్ మొదట ఇచ్చిన పదివేల డాలర్ల కోసమే అడుగుతాడు. తరువాత ఇచ్చిన పాతికవేల డాలర్ల గురించి అడగడు. దీనితో హీరోకి లెక్కలు రావా అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ పై మహేష్ బాబు స్పందించారు.
హీరో మొదట ఇచ్చిన పదివేల డాలర్లకి అప్పుగా ఇస్తాడని, కానీ తరువాత ఇచ్చిన పాతికవేల డాలర్లకి ప్రేమతో ఇస్తాడని చెప్పుకొచ్చారు. ప్రేమలో ఉన్నపుడు హీరో ఇచ్చిన డబ్బుని పెళ్ళాం జేబులోంచి తీసుకుంటే ఎలా ఉంటుందో అదే ఫీల్ తో ఇస్తాడని.. అందుకే మొదట అప్పుగా ఇచ్చిన డబ్బుని మాత్రమే రికవర్ చేయాలనీ రికవరీ ఏజెంట్స్ తో చెబుతాడు..” అని అసలు కారణాన్ని డైరెక్టర్ పరశురామ్ చెప్పుకొచ్చారు. అమెరికాలో వడ్డీ వ్యాపారం చేసే టైం లో ఎవరైనా టైం కి వడ్డీ కట్టకపోతే.. ముక్కు పిండి మరీ వసూల్ చేసేవాడు. కానీ, ఇండియాలో కొందరు మధ్యతరగతి కుటుంబాలు వడ్డీ కట్టడం కోసం నైట్ టైం కూడా జాబ్ లు చేస్తూ ఉండడం చూసి.. వారికి రెస్పెక్ట్ ఇవ్వాలని.. ముందు వడ్డీలు ఎగ్గొట్టే పెద్ద వాళ్ళ నుంచి రికవర్ చేసిన తరువాతే.. వీరి వద్ద తీసుకోవాలని రికవరీ ఏజెంట్స్ కు చెబుతాడు.
End of Article