Ads
బింబిసార’ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ గా నిలిచిన చిత్రాలలో ఒకటి. చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్కి ఈ చిత్రం కమర్షియల్ హిట్ అయ్యింది. మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 5న విడుదలైంది . ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా స్టడీగా ఉన్నాయి. మరియు బింబిసార మూవీ లో కళ్యాణ్ రామ్ కు హీరోగా ఎంత గుర్తింపు దక్కిందో , దర్శకుడు మల్లిడి వశిష్ట కూడా అదే స్థాయిలో గుర్తింపు పొందారు. వశిష్ట డైరెక్షన్ కి అందరూ అతన్ని అభినందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:“అలీ” కూతురికి కాబోయే భర్త ఎవరో తెలుసా..? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?
Video Advertisement
అయితే ఈ క్రమంలో బింబిసార చిత్రానికి వశిష్ట ఎంత పారితోషికం తీసుకున్నారనే దానిపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకుందామా….కళ్యాణ్ రామ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.35 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఫుల్ రన్ ముగిసే సమయానికి 40 కోట్ల షేర్ సాధించాలని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. అంతేకాకుండా ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రంగా బింబిసార నిలిచింది.ఈ సినిమాతో టాలీవుడ్లో కళ్యాణ్ రామ్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది.
బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట మాత్రం ఈ చిత్రానికి పనిచేసిన అంతకాలం నెలవారీ జీతం తీసుకున్నాడు.కానీ చిత్రం రిలీజ్ అయి హ్యూజ్ సక్సెస్ అవ్వడంతో కళ్యాణ్ రామ్ కు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. అయితే ప్రస్తుతం వశిష్ట బింబిసార-2 స్క్రిప్ట్పై పని చేస్తున్నాడు.
దీంతో సంతోషించిన కళ్యాణ్ రామ్ డైరెక్టర్ కు మూడు కోట్ల అతను తీయబోయే సీక్వెల్ చిత్రానికై పారితోషికం గా ఇచ్చినట్లు సమాచారం. తీయబోతున్న రెండవ చిత్రానికి అంత భారీ మొత్తాన్ని ఒక డైరెక్టర్ పారితోషకంగా అందుకోవడం ఇండస్ట్రీలో సామాన్యమైన విషయమైతే కాదు అన్న చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి: “శ్రీదేవి డ్రామా కంపెనీ: డాన్స తో అదరగొట్టిన బస్ కండక్టర్ రియల్ లైఫ్ కన్నీటి కష్టాల గురించి తెలుసా.?
End of Article