ఇంటిని మాత్రమే ఉంచుకొని 600 కోట్లు విరాళంగా ఇచ్చేసిన ఈయన ఎవరో తెలుసా.?

ఇంటిని మాత్రమే ఉంచుకొని 600 కోట్లు విరాళంగా ఇచ్చేసిన ఈయన ఎవరో తెలుసా.?

by Anudeep

Ads

ప్రస్తుత సమాజంలో పక్క వాడి నుంచి ఏం లాగాలి అని చూడడమే కానీ రూపాయి కూడా దానం చేసే గుణం లేకుండా పోయింది. అలాంటిది 600 కోట్ల రూపాయల ఆస్తిని పేదవాళ్లకు పంచిపెట్టడం అంటే మాములు విషయం కాదు. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌‌‌కు చెందిన వ్యాపారవేత్త, డాక్టర్ అర్వింద్ కుమార్ గోయల్ అదే చేశారు.

Video Advertisement

ఒక్క ఇంటిని మాత్రమే తన వద్ద ఉంచుకుని 50 ఏళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తినంతటినీ దానం చేశారు. తన ఆస్తినంతా పేదవారి కోసం ఖర్చు పెట్టమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అందించారు. పేదవారికి సేవలందించేందుకు దాదాపు వందకు పైగా విద్యా సంస్థలను, వృద్ధాశ్రమాలను, ఆసుపత్రులను ఉత్తరప్రదేశ్‌తో పాటు రాజస్తాన్, మహారాష్ట్రల్లో గోయల్ నెలకొల్పారు.

లాక్‌డౌన్ సమయంలో మొరదాబాద్‌లోని 50 గ్రామాలను దత్తత తీసుకుని ఫ్రీ ఫుడ్, మెడిసిన్‌ను అందించారు. డాక్టర్ గోయల్ కుటుంబంలో ఆయన భార్య రేణు, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. డాక్టర్ అర్వింద్ కుమార్ గోయల్ తన ఆస్తినంతటినీ పేదవారికి పంచివ్వాలన్న నిర్ణయాన్ని ఆయన కుటుంబం కూడా స్వాగతించింది. గత సోమవారం రాత్రి ఆస్తిని దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు డాక్టర్ గోయల్ బహిర్గతం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాతికేళ్ల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. డాక్టర్ గోయల్ ప్రాపర్టీకి సరైన ధరను నిర్ణయించేందుకు ఐదుగురితో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారిలో ముగ్గురిని గోయల్ చెప్పిన వ్యక్తులనే తీసుకుంది. మిగిలిన ఇద్దరినీ ప్రభుత్వం నియమించింది. మొరదాబాద్‌లో డాక్టర్ అర్వింద్ గోయల్ జన్మించారు.

ఆయన తండ్రి ప్రమోద్ కుమార్, తల్లి శకుంతలా దేవి ఇద్దరూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారే. గోయల్ బావ  సుశీల్ చంద్ర దేశ ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేశారు. డాక్టర్ అర్వింద్ కుమార్ గోయల్ చేసిన సేవలకు గానూ ఆయనను ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు దేశ రాష్ట్రపతులుగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, డాక్టర్. ఏపీజే అబ్దుల్ కలాం కూడా కొనియాడారు.

 


End of Article

You may also like