ఇంతకంటే దారుణం ఉంటుందా..? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్య గర్భంపై అనుమానంతో ఎంత పని చేసాడంటే..!

ఇంతకంటే దారుణం ఉంటుందా..? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్య గర్భంపై అనుమానంతో ఎంత పని చేసాడంటే..!

by Anudeep

Ads

ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. వివాహాలు ఎంతో కాలం సాగడం లేదు. తాజాగా.. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, భార్య గర్భం పై అనుమానం తో ఆమెను దూరం పెట్టాడో భర్త. ఈ ఘటన  తమిళనాడులోని తిరుచ్చి అన్నానగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, న్యూస్ 18 కథనం ప్రకారం తమిళనాడులోని తిరుచ్చి అన్నానగర్ ప్రాంతానికి చెందిన దివ్య నివసిస్తున్నారు. ఆమె నివసిస్తున్న వీధిలోనే జ్ఞానశేఖరన్ అనే యువకుడు నివసిస్తున్నారు.

Video Advertisement

వీరిద్దరికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. జ్ఞానశేఖరన్ పలు సార్లు శారీరకంగా దగ్గరవ్వాలని దివ్యని కోరేవాడు. కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ నమ్మించాడు. అయితే.. కొన్ని సార్లు వారు శారీరకంగా కలిసేసరికి దివ్య గర్భం దాల్చింది. అయితే. తనను పెళ్లి చేసుకోవాలని దివ్య జ్ఞానశేఖరన్ ను హెచ్చరించింది. దీనితో అతను ఆమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు.

Also Read: పెళ్ళైన వారానికే పనికోసం సిటీకి వచ్చాడు.. 6 నెలల తర్వాత భార్య కోసం వచ్చి.. ఆ తర్వాత ఆత్మహత్య.. అసలేమైందంటే?

wife and husband

పెళ్ళికి ముందే గర్భం దాల్చడంతో.. పెళ్లి అయ్యాక వారికి మరిన్ని బాధ్యతలు పెరిగాయి. ఈ క్రమంలో దివ్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీనితో ఆమె భర్త తన నిజస్వరూపాన్ని చూపించాడు. ఆడపిల్ల పుట్టిందనో, లేక అతనికి డబ్బుపై వ్యామోహం కలిగిందో గాని ఆ కోపాన్ని భార్యపై చూపించాడు. డబ్బు తీసుకురావాలంటూ భార్యని పుట్టింటికి పంపాడు.

బిడ్డ పుట్టిన కొద్దీ రోజులకే ఆమెను వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు. ఆమె ఏమి చేయాలో తెలియని పరిస్థితిల్లో ఉండిపోయింది. ఈ క్రమంలో అతను మరో పెళ్ళికి సిద్ధం అయినట్లు ఆమెకు తెలిసింది. దీనితో మరింత బాధపడి.. ఆ పసి బిడ్డతో అత్తవారింటి ముందు కూర్చుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని తప్పుపట్టి.. ఇలా నడి రోడ్డుపై పడినందుకు అతడిని శిక్షించాలంటూ దివ్య తల్లి తండ్రులు కోరుతున్నారు.

Also Read: సావిత్రి గారికి జయంతి గారిపై ఎందుకు కోపం వచ్చిందో తెలుసా.? కానీ చివరికి కాళ్ళ మీద పడిపోయారంట.!


End of Article

You may also like