Ads
ఐపీఎల్ 2020 లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి, రాజస్థాన్ రాయల్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడా తో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నారు. శామ్ కరన్ (22: 25 బంతుల్లో 1×4, 1×6) తో కలిసి, డుప్లెసిస్ (10: 9 బంతుల్లో 1×4) ఇన్నింగ్స్ ప్రారంభించారు. తర్వాత షేన్ వాట్సన్ (8), అంబటి రాయుడు (13) స్కోర్ చేశారు. రవీంద్ర జడేజా (35 నాటౌట్: 30 బంతుల్లో 4×4) తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన మహేంద్ర సింగ్ ధోనీ (28: 28 బంతుల్లో 2×4) ఐదవ వికెట్ కి 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివరిలో కేదార్ జాదవ్ (4 నాటౌట్: 7 బంతుల్లో) చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 125/5 స్కోర్ చేసింది.
Video Advertisement
తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (4), బెన్ స్టోక్స్(19) చేయగా సంజు శాంసన్ (0) చేశారు. జోస్ బట్లర్ (70 నాటౌట్: 48 బంతుల్లో 7×4, 2×6) , స్టీవ్ స్మిత్ (26 నాటౌట్: 34 బంతుల్లో 4×4) స్కోర్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలర్లలో దీపక్ చాహర్ రెండు వికెట్లు, హేజిల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 126/3 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
1)
2)
3)
4)
5)
6)
7)
8)
9)
10)
11)
12)
13)
14)
15)
End of Article