ఆ సినిమాలో షియాజీ షిండేను యముడిగా పెట్టారు.. అందుకే తప్పుకున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన కోటా..!

ఆ సినిమాలో షియాజీ షిండేను యముడిగా పెట్టారు.. అందుకే తప్పుకున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన కోటా..!

by Anudeep

Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇతర భాషలకు చెందిన నటీనటులు కూడా ఎక్కువగానే ఉంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే తెలుగు అమ్మాయిల కంటే ఎక్కువగా ముంబై అమ్మాయిలకు, ఉత్తరాది వారికో అవకాశాలు వస్తున్నాయి. ఈ విషయమై తెలుగు ఆర్టిస్ట్ లు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

Video Advertisement

అయినప్పటికీ దర్శక నిర్మాతలు భాషతో సంబంధం లేకుండా.. తెలుగు వారి కంటే ఎక్కువగా ఇతర భాషా నటీనటులను ఎంచుకుంటూ వస్తున్నారు. దీనిపై ఇప్పటికి కూడా అసంతృప్తి వ్యక్తం అవుతూనే ఉంది.

kota 1

తాజాగా ఈ విషయమై కోటా శ్రీనివాస రావు కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి వివరించారు. తెలుగు ఇండస్ట్రీలో ఇతర భాషలకు చెందిన నటులకు కూడా అవకాశం ఇస్తున్నారని.. అందులో తప్పు లేకపోయినా తెలుగు నటులను కూడా తీసుకుని వారిని పక్కన పెట్టి ఇతర భాషల నటులకు కీలక పాత్రలు ఇవ్వడం మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.

kota 2

ఈ సందర్భంగా ఆయన మరాఠీ నటుడు షియాజీ షిండే గురించి కామెంట్ చేసారు. తెలుగు వారికీ షియాజీ షిండే సుపరిచితుడే. ఎక్కువగా విలన్ క్యారెక్టర్స్ లో నటించిన ఆయనను చూస్తే ఎవరికైనా తెలుగు వాడే అన్న భావన కలుగుతుంది. మెగాస్టార్ “ఠాగూర్” సినిమాలో విలన్ గా నటించి తెలుగు వారికి పరిచయం అయ్యారు. ఆ తరువాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, విలన్ గా నటించి పేరు తెచ్చుకున్నారు. అల్లరి నరేష్ “యముడికి మొగుడు” సినిమాలో ఈయన యముడి పాత్రలో నటించారు. ఇతర భాషా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తికి యముడి క్యారక్టర్ ఇవ్వడం ఏంటి అంటూ కోటా శ్రీనివాసరావు గారు కామెంట్స్ చేసారు. షియాజీ షిండే పై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.


End of Article

You may also like