“సర్కారు వారి పాట” సినిమాలో ఇది గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?

“సర్కారు వారి పాట” సినిమాలో ఇది గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?

by Anudeep

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ నటించిన సర్కారు వారి పాట మే 12న ప్రేక్షకులను అలరించడానికి భారీ అంచనాలతో వచ్చేసింది. గీత గోవిందం ఫేమ్ పరుశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కామెడీ అండ్ యాక్షన్ మిక్సిడ్ కంటెంట్ గా రూపొందిందని తెలిసిన విషయమే.

Video Advertisement

మొదటి షో లో ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నా, కొన్ని కారణాల వల్ల సర్కారు వారి పాట సినిమా కి రాను రాను ప్రేక్షకులలో నెగిటివ్ టాక్ వెలువడుతుంది. తాజాగా ఈ సినిమాలో ఓ లాజిక్ మిస్ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

mahesh 1

పరశురాం ఎక్కువగా మహేష్ బాబు మీద ఫోకస్ పెట్టడంతో, కథలో చాలా లాజిక్స్ మిస్ చేశాడని, ఇలా లాజిక్ మిస్ చేయడం వల్ల దర్శకుడు కథకు కావాల్సిన బలం చేకూర్చోలేక పోయాడని ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ దర్శకుడు పరశురామ్ మిస్ చేసిన లాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా స్టోరీకి, మహేష్ బాబుకు ఉన్న లింక్ విషయంలో క్లారిటీ మిస్ అయింది.

mahesh 2

విలన్ తో గొడవపడి పదివేల కోట్ల రూపాయల విషయంలో మహేష్ బాబు ఇన్వాల్వ్ అవ్వడానికి రీసన్ ఏంటో చెప్పలేదు. అసలు మహేష్ బాబు ఇండియాకి వచ్చిందే కళావతి మహేష్ నుంచి మోసం చేసి తీసుకున్న డబ్బు కోసం. అది కూడా పదివేల డాలర్లు. అంటే 77 లక్షల కోసం. కానీ, ఇండియాకి వచ్చి మహేష్ వేరే అమౌంట్ కోసం ఫైట్ చేస్తున్నట్లు చూపిస్తారు. వేరే గొడవలో సంబంధం లేకుండా పదివేల కోట్ల రూపాయల కోసం సంబంధం లేని విలన్ తో గొడవపడుతుంటాడు.

అసలు తాను వచ్చిన పని వదిలేసి.. సంబంధం లేని గొడవ కోసం ఎవరో రౌడీలను ఎందుకు కొడుతున్నాడో సినిమా చూసే ప్రేక్షకులకు అర్ధం కాదు. అసలు మహేష్ లక్ష్యం ఎందుకు డైవర్ట్ అయ్యిందో..? ఇక్కడ లాజిక్ ని పరశురామ్ ఎలా మిస్ అయ్యాడో అని ప్రేక్షకులు చర్చలకు దిగుతున్నారు. మహేష్ బ్లైండ్ గా దర్శకుడిని ఫాలో అయిపోయారని.. చాల చిన్న లాజిక్ ని డైరెక్టర్ మిస్ అయ్యారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


End of Article

You may also like