బిగ్ బాస్ లో మళ్ళీ మొదలైన గొడవలు

బిగ్ బాస్ లో మళ్ళీ మొదలైన గొడవలు

by Anudeep

Ads

బిగ్ బాస్ సీజన్ 4 మొదలయ్యి అప్పుడే రెండు వారాలు గడిచాయి. మొదటి వారం తో పోలిస్తే ఈ వారం లో దాదాపు అందరు కంటెస్టెంట్స్ ఓపెన్ అప్ అయ్యారు. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ లో  మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఈ రోజుల్లో, బస్టాప్, బ్రాండ్ బాబు సినిమాల్లో నటించిన కుమార్ సాయి, జబర్దస్త్ ఫేమ్ అవినాష్ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి వారం లో సూర్య కిరణ్ ఎలిమినేట్ అవ్వగా , రెండవ వారం నామినేషన్స్ లో కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యారు.

Video Advertisement

నిన్న సండే కావడంతో ఎపిసోడ్ మొత్తం సరదాగా సాగింది. శనివారం నాడు ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణి నిన్న స్టేజ్ మీద మాట్లాడారు. ఈ వారం ఎవరైనా ఒక కంటెస్టెంట్ ని నామినేట్ చేయడం అనే బిగ్ బాంబ్ కరాటే కళ్యాణి కి ఇచ్చి ఆ బిగ్ బాంబ్ ఎవరి మీద వేస్తారు అని అడిగితే దేవి నాగవల్లి అని చెప్పారు కరాటే కళ్యాణి. తర్వాత కరాటే కళ్యాణి వెళ్లిపోయారు. కంటెస్టెంట్స్ అందరూ డాగ్ ఎండ్ ది బోన్ గేమ్ ఆడారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని ముందే చెప్పారు కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఇంకొక కంటెస్టెంట్ అలేఖ్య హారిక అని చెప్పారు నాగార్జున. ఎలిమినేట్ అవ్వడంతో అలేఖ్య హారిక హౌస్ లో నుండి బయటికి రావడానికి సిద్ధమయ్యారు. బయటికి వచ్చే సమయానికి మళ్ళీ వెనక్కి పిలిచి ఇది ఫేక్ ఎలిమినేషన్ అని, సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం ఎంత తప్పో తెలియాలి అని ఇలా చేశానని చెప్పారు నాగార్జున.

 

Bigg Boss Telugu 4 – Karate Kalyani Rapid Fire Round


End of Article

You may also like