• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

వీధులు శుభ్రం చేయించి… “రోల్స్ రాయిస్” కంపెనీ మీద పగ తీర్చుకున్న ఈ భారతీయ రాజు ఎవరో తెలుసా.?

Published on June 23, 2022 by Usha Rani

మొదటి ప్రపంచ యుద్ధానికి (1914-1918) ముందు రోల్స్ రాయిస్ కంపెనీ 20 వేలకు పైగా కార్లను ఉత్పత్తి చేస్తే.. అందులో 20% ఇండియాకే దిగుమతి చేయబడింది అని మనలో చాలా మందికి తెలీదు.

ఆ కాలంలో ఇండియాలో 230 మంది మహారాజులు ఉన్నారు. దేశంలో సగటున 2000 రోల్స్ రాయిస్ ఉన్నాయి. ఆ రోజుల్లో ఇండియన్ కింగ్స్ కి రోల్స్ రాయిస్ కి మధ్య ప్రత్యేక అనుబంధం ఉండేది. రాజస్థాన్‌లోని అల్వార్ కు చెందిన ప్రముఖ మహారాజు “జై సింగ్” ఒకేసారి మూడు ఆటోమొబైల్స్ కొనుగోలు చేసేవాడు.

1920లో ఆల్వార్ మహారాజా జై సింగ్ లండన్‌లోని మేఫెయిర్ ఏరియా వీధుల్లో తిరుగుతున్నాడు. అతను సాధారణ వస్త్రధారణలో ఉండి రోల్స్ రాయిస్ షోరూమ్‌లోకి ప్రవేశించాడు. అప్పుడు ఒక బ్రిటీష్ సేల్స్‌మాన్ మహారాజా జై సింగ్‌ను చూసి చూడనట్టు వ్యవహరించాడు. ఎందుకంటే అతను కేవలం ఒక సాధారణ పేద భారతీయుడు అని.

కింగ్ జై సింగ్ ఈ అవమానాన్ని భరించలేక వెంటనే తన హోటల్ గదికి తిరిగి వచ్చాడు. అప్పుడు అతను తన సేవకులతో  షోరూమ్‌కి కాల్ చేయించి, అల్వార్ నగర రాజు వారి కార్లలో కొన్నింటిని కొనుగోలు చేయబోతున్నాడని చెప్పించాడు. ఆ తర్వాత రాజు దర్శనాన్ని పురస్కరించుకుని షోరూమ్‌లోని సేల్స్‌మెన్స్ అందరూ బారులు తీరి షోరూమ్‌లో రెడ్ కార్పెట్ పరిచారు.

అప్పుడు రాజు తన రాజ రూపంలో షోరూమ్‌ని సందర్శించాడు. ఆ సమయంలో షోరూమ్‌లో ఆరు కార్లు ఉన్నాయి. రాజు ఒకేసారి ఆరు కార్లను కొనుగోలు చేశాడు. డెలివరీ ఛార్జీలతో సహా పూర్తి మొత్తాన్ని చెల్లించాడు.

ఆరు రోల్స్ రాయిస్ భారతదేశానికి దిగుమతి చేసాక, నగరంలోని వీధులను ఊడ్చేందుకు ఈ కార్లను ఉపయోగించాలని రాజు మున్సిపాలిటీని ఆదేశించాడు. కొద్దిసేపటికే ఈ వార్త ప్రపంచం అంత వ్యాపించింది. వరల్డ్ నంబర్ వన్ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ షాక్‌ అయ్యింది.
దీంతో ఆ కంపనీ గుడ్ విల్ మరియు ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. చివరకు.. రోల్స్ రాయిస్ వారి ప్రవర్తనకు క్షమాపణలు చెబుతూ భారత రాజు జై సింగ్‌కు టెలిగ్రామ్ పంపింది. అంతేకాదు.. మరో ఆరు సరికొత్త కార్లను కూడా ఉచితంగా అందించింది.  చెత్తను సేకరించడానికి రోల్స్ రాయిస్‌ను ఉపయోగించడం మానేయాలని రాజు మున్సిపాలిటీని కోరాడు. అలాగే కంపనీ క్షమాపణలను కూడా అంగీకరించాడు.

ఈ కథ చదివాక “ఇండియన్ కింగ్ దెబ్బ.. రోల్స్ రాయిస్ అబ్బా..” అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.


We are hiring Content Writers. Click Here to Apply



About Usha Rani

హాయ్.. నా పేరు ఉషారాణి. నాకు పుస్తకాలు చదవడంపై ఉన్న ఆసక్తే నన్ను ఈ రోజు రైటర్ ను చేసింది. ప్రస్తుతం తెలుగు అడ్డాలో కంటెంట్ రైటర్ గా వర్క్ చేస్తున్నాను. సినిమా, స్పోర్ట్స్ అండ్ హెల్త్ గురించి రాయడాన్ని ఎక్కువ ఇష్టపడతాను.

Search

Recent Posts

  • మీనా భర్త మృతికి “పావురాలు” కారణమా..? అసలేం జరిగిందంటే..?
  • ఇంటర్ రిజల్ట్స్ లో జిల్లా టాపర్ గా నిలిచింది.. కానీ ప్రాణాలతో లేదు..కంటతడి పెట్టిస్తున్న సంఘటన!
  • విడాకుల రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర, శ్రవణ భార్గవి..! ఇది మంచి విషయమే అంటూ..?
  • తన కెరీర్ ఫెయిల్ అవ్వడానికి అసలు కారణం బయటపెట్టిన అర్చన..! ఆ టైం లో ఓకే అనుంటే.?
  • 45 ఏళ్ళు దాటుతున్నా నటుడు సుబ్బరాజు పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..? కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions