VIRAL PHOTO: “దేవుడు ఓదారుస్తున్నాడు” సీన్ ని “నమ్రత”తో రీ క్రియేట్ చేసిన “మహేష్ బాబు”.!

VIRAL PHOTO: “దేవుడు ఓదారుస్తున్నాడు” సీన్ ని “నమ్రత”తో రీ క్రియేట్ చేసిన “మహేష్ బాబు”.!

by Mounika Singaluri

Ads

తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌ అంటే గుర్తొచ్చే జంటల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జోడీ కూడా ఒకటి. అంతగా ఈ జంట ఆకట్టుకున్నారు. వీరు సినిమాలో నటిస్తున్నప్పుడు అయిన పరిచయం, ప్రేమగా మారి,పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.తాజాగా వీరిద్దరిది ఒక ఫోటో వైరల్ అవుతుంది.ఖలేజా లో దేవుడు ఓదారుస్తున్నాడు అనే స్టిల్ అది. ఆ ఫోటో చూసేయండి.

Video Advertisement

సినిమాల్లో నటిస్తూ ఆ తరువాత వివాహ బంధంతో ఒక్కటైన వారిలో మహేష్, నమ్రత జోడీ ఒకటి. అయితే వీరి ప్రేమకథ ఎలా ప్రారంభం అయ్యిందంటే సూపర్ స్టార్ మహేష్ బాబు , నమ్రతలు ‘వంశీ’ మూవీలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగ్‌ న్యూజిలాండ్‌‌ లో నెల రోజులు జరిగింది. వీరిద్దరి మధ్య ఆ సమయంలోనే పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా ఆ తరువాత ప్రేమగా మారింది. అయితే ముందుగా లవ్ ప్రపోజ్ చేసింది నమ్రతనే. అప్పటికే మహేష్‌ నమ్రతను ఇష్టపడుతుండడంతో వెంటనే ఒకే చెప్పేశారంట.

అలా ఈ ప్రేమజంట దాదాపు 4ఏళ్లపాటు ప్రేమలో మునిగితేలారు. అయితే సెలబ్రిటీల పర్సనల్ విషయాలు సాధారణంగా మీడియాకు లీకవుతుంటాయి. కానీ మహేశ్‌ బాబు -నమ్రతల విషయం బయటికి రాకపోవడం విశేషం. నాలుగేళ్ళ తర్వాత ఇద్దరు వారి కుటుంబ సభ్యులకు తమ లవ్ గురించి చెప్పారట. మొదట్లో మహేష్ ఫ్యామిలీ కొంచెం బెట్టు చేయడంతో, మహేష్ సోదరి మంజుల అందరిని ఒప్పించిందట. ఆ విధంగా ఇద్దరి ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో 2005లో ఫిబ్రవరి 10న వీరి వివాహం చాలా సింపుల్ గా జరిగింది.


End of Article

You may also like