Ads
టాలీవుడ్ ఆన్ స్క్రీన్ పై ది మోస్ట్ రొమాంటిక్ కపుల్ నాగచైతన్య మరియు సమంత. ఏడేళ్ల పాటు ప్రేమ లో ఉండి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట 2021 అక్టోబర్ లో విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట హఠాత్తుగా ఎందుకు విడిపోయారు అనే విషయం ఎవరికీ తెలియలేదు.
Video Advertisement
ఈ జంట విడిపోవడం పై వారి అభిమానులు ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు. నాగచైతన్య సమంత అభిమానులు వీరు ఎప్పటికైనా కలవాలని ఆశిస్తూ నే ఉన్నారు. సోషల్ మీడియాలో వాళ్లపై ఎన్నో వార్తలు హాట్ టాపిక్ గా వచ్చిన , ఇప్పటికీ అసలు విషయం ఏంటనేది ఎవరికీ తెలీదు.
‘అలా మొదలైంది’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి. అసలు విషయానికి వస్తే సమంత కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన మంచి ఫ్రెండ్ నందిని రెడ్డి. జబర్దస్త్ మూవీ తో స్టార్ట్ అయిన సమంతా, నందిని స్నేహం ఓ బేబీ తో బలపడింది. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన ఓ బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
వీళ్ళు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ అని, ఇద్దరి మధ్య మంచి సిస్టర్స్ అనుబంధం ఉందని నందిని రెడ్డి తెలియజేశారు.
అసలు విషయం పై క్లారిటీ :
ఆ ఇంటర్వ్యూ లో నాగచైతన్య, సమంత విడాకులు విషయంపై ఒక క్లారిటీ ఇచ్చిన నందిని రెడ్డి. మనిషి జీవితంలో ఒడిదుడుకులు సహజం. ప్రతి భార్య భర్తల మధ్య గొడవలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అది వాళ్ల పర్సనల్ మేటర్. వాళ్ల పర్సనల్ విషయాలపై తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. నేను కూడా వాళ్ల విడాకులు కారణం ఏమిటనే విషయం పై తెలుసుకోవాలన్న ఆసక్తి చూపలేదు.. ఏంత క్లోజ్ ఫ్రెండ్స్ మైనా మన పరిమితి మనకు ఉంటుంది. దాని దాటి వెళ్లకపోవడమే మంచిది. అని విడాకుల విషయం పై మంచి క్లారిటీ ఇచ్చారు నందిని రెడ్డి.
End of Article