నెహ్రూ గిరిజన భార్య గురించి మీకు తెలుసా…? వీరి వివాహం ఎలా జరిగిందంటే..?

నెహ్రూ గిరిజన భార్య గురించి మీకు తెలుసా…? వీరి వివాహం ఎలా జరిగిందంటే..?

by Mounika Singaluri

Ads

పండిట్  నెహ్రూ గురించి పరిచయం అక్కర్లేదు. భారతదేశ తొలి ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి, స్వాతంత్ర ఉద్యమంలో పాలుపంచుకున్న నాయకుడు.తాజాగా నెహ్రూ భార్య గత శుక్రవారం తుది శ్వాస విడిచారు. అదేంటీ.. నెహ్రూ భార్య, కమలా 1936లోనే మరణించారు.ఇప్పుడు మళ్లీ భార్య మరణించారు అంటారేంటి అనుకుంటున్నారా.? అయితే దీని వెనకాల పెద్ద చరిత్రే ఉంది. ఈ కథ తెలియాలంటే 64 ఏళ్ల వెనక్కి వెళ్లాల్సిందే.

Video Advertisement

1959లో దామోదర నదిపై నిర్మించిన పాంచెట్ డ్యామ్‌, జల విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించేందుకు అప్పటి ప్రధాని నెహ్రూ వచ్చారు. నెహ్రూకు స్వాగతం పలికేందుకు దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ అధికారులు కొందరు ఆదివాసీ మహిళలను పిలిచారు. టీవీ 9 తెలుగు కథనం ప్రకారం, ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యులైన వారు కూడా వీరిలో ఉన్నారు. వీరిలో ఒకరు బుద్ధిని మంఝి.

what wrote in nehru's wedding card..!!

ఆ సమయంలో ఆమె వయసు 15 ఏళ్లు. సంతాలీ తెగకు చెందిన ఈ అమ్మాయితో ప్రాజెక్టును ప్రారంభించాలని నెహ్రూ అనుకున్నారు. అందుకోసం బుద్ధిని మంఝిను పిలిచారు. ఆమెతో బటన్‌ నొక్కించి ప్రాజెక్టు ప్రారంభింపజేశారు.అనంతరం బుద్ధిని గౌరవంగా నెహ్రూ మెడలో పూలమాల వేసింది. వెంటనే నెహ్రూ స్పందిస్తూ.. ఈ మర్యాద దక్కాల్సింది నాకు కాదు, ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చి, ప్రాజెక్ట్ నిర్మాణంలో పాలుపంచుకున్న మీకే అంటూ తిరిగి ఆ మాలను బుద్ధిని మెడలో వేశారు. అనంతరం షేక్‌హ్యాండ్‌ ఇచ్చి అభినందనలు తెలిపారు. ఇదిగో ఈ చర్య బుద్ధిని జీవితాన్ని మార్చేసింది. ఊరు పెద్దలు బుద్ధిని నిందించడం మొదలు పెట్టారు. దీనికి కారణం ఆ జాతి ఆచారాల ప్రకారం దండలు వేసుకొని చేతులు కలుపుకుంటే వివాహం అయిపోయినట్లే.

వేరే జాతికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నావని, తమ కట్టుబాట్లకు వ్యతిరేకంగా వ్యవహరించింది అనే కారణంతో ఆమెను తెగనుంచి వెలివేశారు. దీందో ఒక్కసారిగా బిత్తరపోయిన బుద్ధినికి ఏం చేయాలో అర్థం కాలేదు.అప్పుడే దామోదర్‌ వ్యాలీ కూడా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఏం చేయాలో తెలియక బతుకుతెరువు కోసం బెంగాల్‌లోని పురూలియాకు వలస వెళ్లి అక్కడ జీవనం సాగించడం మొదలు పెట్టింది. ఆ క్రమంలోనే ఆమెకు సుధీర్‌ దత్తా అనే వ్యక్తితో పరిచయం అవ్వడం అతనితో సహజీవనం చేయడం ప్రారంభించింది. వీరికి ఓ పాప జన్మించింది. ఇక ఏళ్లు గడిచినా ఆ తెగవారు మాత్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు.

nehru

ఇక ఈమె జీవిత గాథను కొన్ని పత్రికలు వెలుగులోకి తీసుకొచ్చాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న రాజీవ్‌ గాంధీ.. ఆమెను తన దగ్గరికి పిలిపించుకున్నారు. ఆమెకు తిరిగి దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌లో ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. అలా మళ్లీ ఆమె ఉద్యోగంలో చేరింది. ఈ క్రమంలోనే బుద్ధిని జీవితాంతం తన కూతురు, అల్లుడితోనే జీవనం సాగించింది. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి పూల మాల వేసినందుకు బుద్ధిని జీవితం ఇలా ఒక్కసారిగా తలకిందులైంది.

Also Read:భర్త తన భార్యకి ఉండాలి అనుకునే 5 లక్షణాలు ఇవే..! తప్పక చదవండి..!


End of Article

You may also like