Ads
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాబోయే ఎన్టీఆర్ 31 మూవీ గురించి అప్ డేట్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న ఈ సినిమాకు హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి ఉండాలి అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Video Advertisement
కెజిఎఫ్ రెండు పార్ట్స్ లోను శ్రీనిధి శెట్టికి మంచి మార్కులు పడ్డాయి. దీనితో సోషల్ మీడియాలో చాలా చోట్ల ఈ సినిమాకు కూడా డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్, హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి కాంబో అయితే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఫ్యాన్స్ కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ నీల్ కూడా శ్రీనిధి శెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన శ్రీనిధి శెట్టి కెజిఎఫ్, కెజిఎఫ్ చాప్టర్ 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులనే కొట్టేసారు. ప్రస్తుతం శ్రీనిధి శెట్టి విక్రమ్ సరసన కోబ్రా మూవీలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగష్టు 11 వ తేదీన విడుదల కావాల్సి ఉంది.
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనిధి శెట్టి పేరు కంటే డబ్బు ముఖ్యం అంటూ కామెంట్స్ చేసారు. దీనితో ఈ కామెంట్స్ చాలా మందికి నచ్చలేదు. ఈ విషయమై శ్రీనిధి శెట్టిని చాలా ట్రోల్ చేసారు. కెజిఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో శ్రీనిధికి గుర్తింపు లభించింది. ఎన్టీఆర్ మూవీలో ఛాన్స్ వస్తే తెలుగునాట కూడా ఆమె క్రేజీ హీరోయిన్ గా బిజీ అయ్యే అవకాశం ఉంది. 2023 ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా షూటింగ్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలో హీరోయిన్ విషయంలో ప్రశాంత్ నీల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
End of Article