Ads
ఎంతో ఉత్కంఠతో జరిగిన ఐపిఎల్ -2020 ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఈ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 రన్స్ చేసింది. 157 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ దిగిన ముంబై ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు.
Video Advertisement
డీకాక్(20; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) సూర్యకుమార్(19; 20 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) , రోహిత్ శర్మ(68; 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించి విజయంలో కీలక పాత్ర పోషించగా, ఇషాన్ కిషన్( 33 నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) ,కృనాల్ పాండ్యా(1) విన్నింగ్ షాట్ ఆడి లాంఛనం పూర్తి చేశాడు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నార్ట్జే 2 వికెట్లు తీయగా, రబాడా ఒక వికెట్, స్టోయినిస్ ఒక వికెట్ పడగొట్టారు. ఇందులో చివరిలో పోటీపడిన జట్లు ఎంత ప్రైజ్ మనీ గెలుచుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
# ఐపీఎల్ 2020 లో గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకి 20 కోట్ల ప్రైజ్ మనీ అందజేశారు.
# రన్నరప్ గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి 12.5 కోట్ల ప్రైజ్ మనీ అందజేశారు.
# లూజింగ్ క్వాలిఫైయర్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి 8.75 కోట్ల రూపాయలను ఇచ్చారు.
# మరొక లూజింగ్ క్వాలిఫైయర్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి 8.75 కోట్ల రూపాయలను ప్రైజ్ మనీగా ఇచ్చారు.
End of Article