Ads
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2024 ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమాకి వచ్చిన క్రేజ్ ని కాపాడుకునే విధంగా పుష్ప2 ని రూపొందిస్తున్నారు.
Video Advertisement
దీనికోసం 400 కోట్ల పై బడి బడ్జెట్ ను కేటాయించారు. సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. సుకుమార్ కూడా తను అనుకున్నది వచ్చేవరకు నిద్రపోని డైరెక్టర్. నిర్మాతలు కూడా డైరెక్టర్ కి పూర్తి సహకారం అందిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న పుష్ప 2 విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ సినిమాలో ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ దేవి నాగవల్లి ఓ కీలకపాత్రలో కనిపంచనుందని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఆమె పుష్ప2 సెట్కు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెతో దర్శకుడు సుకుమార్ కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు టాక్. అయితే ఈ సినిమాలో న్యూస్ రీడర్గా కనిపిస్తారా,లేక ఏదైనా రోల్లో సందడి చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు పుష్ప సిరీస్లో మూడో పార్ట్ కూడా రానుందని తెలుస్తోంది. పుష్ప 2లో పుష్పరాజ్ రూలింగ్ చూపిస్తూ ఓ భారీ ట్విస్ట్తో ముగిస్తారట. ఇక పుష్ప 3తో ఈ సిరీస్ను ముగిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథ ఇప్పటికే రెడీ అయ్యిందట. ఈ మూడో పార్ట్.. 2025లో షురూ కానుందని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా సినిమా తర్వాత ఈ పుష్ప 3 ఉండనుందట. ఈ లెక్కను చూస్తుంటే పుష్ప మేనియా ఇప్పట్లో ఆగేలాగ లేదు
End of Article