సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు పెట్టడం వెనక ఇంత కథ నడిచిందా? ఆమె ఏడ్చేసరికి?

సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు పెట్టడం వెనక ఇంత కథ నడిచిందా? ఆమె ఏడ్చేసరికి?

by Mounika Singaluri

Ads

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తెలుగు సినిమాల్లో “నరసింహ” తిరుగులేని విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రమ్యకృష్ణ ప్రతి నాయకిగా, సౌందర్య రజనీకాంత్ సరసన హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో రజనీకాంత్ ను రమ్యకృష్ణ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది.

Video Advertisement

కానీ, రజనీకాంత్ సౌందర్యని ఇష్టపడడం, సౌందర్య కూడా రజనీకాంత్ ను ఇష్టపడడంతో వారిద్దరికీ పెళ్లి జరుగుతుంది. అయితే.. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తోందన్న విషయం గ్రహించిన రమ్యకృష్ణ సౌందర్యాన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటుంది.

narasimha

ఈ సన్నివేశాల్లోనే.. ఓ చోట రమ్యకృష్ణ తన కాలుతో సౌందర్య ముఖాన్ని తన వైపుకు తిప్పుకోవాల్సి ఉంటుంది. ఇది కొంచం ఇబ్బందికరమైనదే అయినా సన్నివేశం మాత్రం బాగా పండుతుంది. అయితే.. ఈ సన్నివేశాన్ని షూట్ చేయడానికి ముందు చాలా స్టోరీనే జరిగిందట. అసలు ఈ సన్నివేశాన్ని చేయడానికే రమ్యకృష్ణ ఒప్పుకోలేదట. సౌందర్యకు చాలా పెద్ద మార్కెట్ ఉందని.. తనకి ఇంకా అంత మార్కెట్ లేదని ఇలాంటి సన్నివేశాన్ని చేయలేనని చెప్పేశారట.

narasimha 1

ఈ సన్నివేశం చేయడానికి రమ్యకృష్ణ అస్సలు ఒప్పుకోలేదట. కానీ సౌందర్య గారే రమ్యకృష్ణ తో మాట్లాడి ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ఒప్పించారట. షూటింగ్ జరిగే టైం లో కూడా రమ్యకృష్ణ చాలా ఇబ్బంది పడ్డారట. అప్పుడు సౌందర్యే రమ్య కృష్ణ కాలుని తన ముఖంపై పెట్టుకుని నటించాలని రమ్యకృష్ణకి సూచించారట. అయితే.. ఈ సన్నివేశం చేయలేక రమ్యకృష్ణ ఏడ్చేశారట. చివరకు ఎన్నో షాట్ ల తరువాత ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారట.


End of Article

You may also like