Ads
తాము అభిమానించే హీరోలపై అభిమానులు తమ ఇష్టాలను ఒక్కో విధంగా వ్యక్తం చేస్తారు. ఇదేవిధంగా ఒక అభిమాని రామ్ చరణ్ కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తో తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఆ అభిమాని ఇచ్చిన గిఫ్ట్ చూసి రామ్ చరణ్ ఎంతో భావోద్వేగాలకు లోనయ్యారు.
Video Advertisement
చేతిలో నైపుణ్యం ఉంటే ఎలాంటి అద్భుతాలైన సృష్టించవచ్చు. గొప్ప గొప్ప కళాఖండాలను అవలీలగా అద్భుతంగా మలచవచ్చు. అద్భుతమైన ఆర్ట్ రూపొందించడంలో ఆవిడ మా ఆవిడే సాటి.
ఆమె బొడ్డు శ్రీమతి. తన భర్త సుదర్శన్ ప్రోత్సాహంతో ఎన్నో అద్భుతమైన కళాఖండాలకు జీవం పోస్తుంది ఆమె. ఎలాంటి గొప్ప కట్టడాలు అయినా తన చేతులతో అద్భుతంగా కళాఖండాల రూపంలో మార్చేస్తుంది. వీరు కరీంనగర్ లోని బోయవాడ లో నివాసం ఉంటున్నారు. ఈమె ప్రత్యేకత ఏంటంటే వెదురు బొంగులతో, చీపురు పుల్లలతో అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తుంది.
ప్రపంచంలోనే గొప్ప కట్టడాలు అయినా ఈఫిల్ టవర్, లోటస్ టెంపుల్, గేట్వే ఆఫ్ ఇండియా, ఎర్రకోటతో పాటు హైటెక్ సిటీ మన పార్లమెంట్ భవనాన్ని కూడా చీపురు పుల్లలు, ఎదురు బద్దలతో డిజైన్ చేసి డెకరేటివ్ ఆర్ట్ గా రూపొందిస్తుంది..ఈ నైపుణ్యం అలవాటు కావడానికి కారణం ఆవిడ చిన్నతనములో తన మామగారు అట్టముక్కల తో కట్టిన స్కూల్ బిల్డింగ్ ను చూసి తన మనసులో ఆసక్తి పెరిగిందని చెబుతోంది. ఒక ఆర్ట్ క్రియేట్ చేయడానికి తనకి సుమారు 3 – 6 నెలల సమయం పడుతుందని చెబుతోంది. ఆమె తయారుచేసిన ఆర్ట్ కి ఎలాంటి వంకలు పెట్టలేమని స్థానికులు చెప్పడం విశేషం.
ఇంతకీ విషయానికి వస్తే ఈమె మెగా ఫ్యామిలీ కి వీరాభిమాని. ఈ క్రమంలో రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా చరణ్ కొత్త గా కట్టుకున్నా ఇంటిని సైతం పుల్లలతో ఒక కళాఖండంగా సృష్టించి ఆయనకు బహుమతిగా ఇచ్చిందట. ఆ బహుమతి అందుకున్న రామ్ చరణ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైయి ఆమె కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాకుండా మన మెగాస్టార్ చిరంజీవికి ఒక గిఫ్ట్ తయారు చేస్తున్నారట. అది ఇంకేదో కాదు మన చిరంజీవి గారి సొంత ఊరైన మొగల్తూరులోని ఆయన నివాసం ఉన్నా ఇల్లు.
End of Article