మళ్లీ ఆగిన గుంటూరు కారం షూటింగ్..! కారణం ఏంటంటే..?

మళ్లీ ఆగిన గుంటూరు కారం షూటింగ్..! కారణం ఏంటంటే..?

by Mohana Priya

Ads

మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారు అని ఈ టైటిల్ టీజర్ చూస్తే అర్ధం అవుతోంది.

Video Advertisement

ఈ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సినిమా ఎలా ఉంటుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇవాళ మొదలు అవ్వాల్సి ఉంది. సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా కూడా ఎన్నో కారణాల వల్ల మధ్యలో బ్రేక్ తీసుకొని షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారు.

guntur-karam-title

ఇవాళ కొత్త షెడ్యూల్ మొదలవ్వాల్సి ఉంది. కానీ ఆ షెడ్యూల్ ఆగిపోయింది. అందుకు కారణం ఏంటి అంటే ఈ సినిమాలో ముఖ్య పాత్రలను పోషించే కొంత మంది నటులు ఈ షెడ్యూల్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆ నటుల డేట్స్ ఇప్పుడు అందుబాటులో లేవు. ఈ కారణంగానే ఇప్పుడు ఈ సినిమా షెడ్యూల్ ఆగిపోయింది అని అంటున్నారు. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఆ షెడ్యూల్ మొదలవుతుంది.ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుంది అని సినిమా బృందం ఇప్పటికే ప్రకటించింది.

ఈ సినిమాలో పూజ హెగ్డే, శ్రీ లీలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు కుటుంబ కథాచిత్రంగా నిలిచే ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి అని అంటున్నారు. వీరు మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటినటులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

ఇంక మహేష్ బాబు విషయానికి వస్తే, మహేష్ బాబు ఈ సినిమా పూర్తి అయిన తర్వాత రాజమౌళి సినిమా పనిలో పాల్గొంటారు. అదే కాకుండా మహేష్ బాబు రాజమౌళి సినిమా అయిపోయిన తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం అయితే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్ లో ఉన్నారు. అంతే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సినిమాకి అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ తో మరొక సినిమా చేస్తారు అని అంటున్నారు.


End of Article

You may also like