Ads
సినిమా ప్రపంచంలో రాణించాలని అందరూ కలలు కంటూ ఉంటారు. అయితే.. ఆ కలలు నెరవేర్చుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ.. ఈ లోపే కొంతమంది మోసగాళ్ల వలలో పడి నష్టపోతుంటారు. ఇలాంటి సంఘటనే తాజాగా యూట్యూబర్ నానికి చోటు చేసుకుంది.
Video Advertisement
యూట్యూబ్ వీడియోలు రెగ్యులర్ గా చూసేవారికి నాని సుపరిచితమే. లోకల్ బాయ్ నాని అనే ఫేమస్ యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న నాని కూడా ఇలానే మోసపోయారట. స్వతహాగా మత్స్యకారుడు అయిన నాని యూట్యూబ్ లో తన చేపలు పట్టే వీడియోలు, వంటల వీడియోస్ తో ఫేమస్ అయ్యాడు.
ఓరోజు అతనికి రామ్ చరణ్ అసిస్టెంట్లమంటూ ఫోన్ వచ్చింది. మీ వీడియోస్ చూసి రామ్ చరణ్ ఫిదా అయ్యారు. ఆయన మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అంటూ ఫోన్ లో చెప్పారు. నీకు సీ ఫుడ్ లిస్ట్ ఇస్తామని, ఆ ఫుడ్ తీసుకుని వచ్చేయాలని.. సీ ఫుడ్ అంటే రామ్ చరణ్ కి పిచ్చి అని కల్లబొల్లి మాటలు చెప్పారు. నిజమే అనుకున్న నాని వారు చెప్పిన ఫుడ్ తీసుకుని వెళితే అక్కడ లోపలకు కూడా రానివ్వలేదు. చివరకు ఏదోకటి చెప్పి లోపలకి వెళ్తే డబ్బులు ఇచ్చి సెటిల్ చేసారు. రామ్ చరణ్ గురించి అడిగితే.. లేరు అని బయటకి వెళ్లారు అని చెప్పుకొచ్చారు.
దీనితో ఫ్రస్ట్రేట్ అయిన నాని ఈ విషయాలు వీడియో తీసి యు ట్యూబ్ లో చెప్పుకొచ్చారు. తాజాగా దీనిపై హీరోయిన్ రేఖా భోజ్ స్పందించారు. ఈమె ‘దామిని విల్లా’, ‘రంగేలా’, ‘కళ్యాణ తస్మై నమహ:’ వంటి సినిమాలలో నటించింది. ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో వైజాగ్ లోనే సొంతంగా స్టూడియో నిర్మించుకుని.. కవర్ సాంగ్స్ చేస్తూ పాపులర్ అవుతోంది. ఆమె కూడా గతంలో ఇలానే తనను ప్రభాస్ పిలిచారని, నోవాటెల్ హోటల్ లో ఉన్నారని.. నువ్వు ప్రభాస్ ఫ్యాన్ అని లైవ్ లో చెప్పడంతో.. నిన్ను కలవాలని ప్రభాస్ అన్నారని చెప్పుకొచ్చారు.
అయితే అవి అన్నీ విన్నాక దొబ్బేయమని చెప్పడంతో వారు తన కాల్ ను బ్లాక్ చేసారని చెప్పుకొచ్చింది. ఎందుకంటే అంతకు రెండు రోజుల క్రితమే తమ టీం వారు ప్రభాస్ శ్రీను గారిని కలిస్తే.. ప్రభాస్ యుఎస్ లో ఉన్నట్లు, ఆరు నెలల వరకు రారని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఇలాంటివి నమ్ముతూ పోతే.. ఎలాంటి మోసాలు జరుగుతాయో అని ఆమె అలెర్ట్ చేసారు.
watch video:
End of Article