Ads
విడాకుల విషయంలో సమంత ఫ్యాన్స్ కు షాక్ తగిలినప్పటికీ.. కెరీర్ విషయంలో సమంత దూసుకెళ్తోంది. వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతోంది. చై తో విడాకుల తరువాత సమంత పూర్తిగా కెరీర్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి కూడా వరుసగా ప్రకటించేస్తోంది.
Video Advertisement
గతంలో సమంత సోషల్ మీడియా లో చాలా ఆక్టివ్ గా ఉండేవారు. ప్రస్తుతం కూడా ఆక్టివ్ గానే ఉంటున్నారు. ఇటీవల ఆమె ఎక్కువగా “మై మమ్మా సెడ్..” అంటూ వరుస పోస్ట్ లు చేస్తూ ఉంటున్నారు.
తాజాగా.. సమంత షేర్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అయింది. సమంత తన తల్లితో చాట్ చేసిన స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియా లో పంచుకున్నారు. ఈ స్క్రీన్ షాట్ లో సమంత తల్లి సమంత కు ఒక ఫోటో మెసేజ్ ను పంపించారు. “నీలో కొత్తదనం నీకు తెలియదు.. ఆ ముక్కలని తిరిగి పేర్చు..” అంటూ ఉన్న మెసేజ్ ను ఆమె పంపించారు.
ఈ కొటేషన్ ఉన్న మెసేజ్ షేర్ చేస్తూ.. “బ్లెస్ యూ మై బేబీ” అంటూ మెసేజ్ చేసారు. ఈ స్క్రీన్ షాట్ ను సమంత సోషల్ మీడియా లో పంచుకున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. విడాకుల తరువాత సమంత మానసికంగా బలహీనం అవ్వకుండా.. ఆమె తల్లి సపోర్ట్ చేస్తున్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: అఖండ సినిమాలో కనిపించిన ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?
End of Article