వైరల్ అవుతున్న సెల్ఫీ…! ఆ ఇద్దరి జీవితాల వెనుక ఉన్న కథ ఏంటంటే..?

వైరల్ అవుతున్న సెల్ఫీ…! ఆ ఇద్దరి జీవితాల వెనుక ఉన్న కథ ఏంటంటే..?

by Anudeep

Ads

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రస్తుతం ప్రతి చిన్న విషయం కూడా వైరల్ గా మారుతుంది. తెలియని వ్యక్తులు కూడా సోషల్ మీడియా ద్వారా ఎంతో గుర్తింపు పొందుతున్నారు.

Video Advertisement

ఇప్పుడు అదే విధంగా రైల్వే విధినిర్వహణలో ఉన్న ఇద్దరు వ్యక్తులు  తీసుకున్న  ఒక సెల్ఫీ  సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది . పోస్ట్ చేసిన ప్రతి సామాజిక మాధ్యమంలో మిలియన్ లైక్ లను సంపాదించుకుంది ఈ సెల్ఫీ.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా వెళ్తున్న రైలు లో విధి నిర్వహణలో ఉన్నారు. ఒకరు సెల్ఫీ తీస్తుండగా మరొకరు ఆ సెల్ఫీ వైపు చూస్తూ ఉన్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఇద్దరు స్వయానా తండ్రీకొడుకులు కావడం.

తండ్రి కుమారుడు ఇద్దరు రైల్వే లోనే పనిచేస్తున్నారు. తండ్రి రైల్వేలోని గాడ్ గా విధులు నిర్వహిస్తున్నారు, అదేవిధంగా కుమారుడు రైల్వేలో ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ (TTE)గా పని చేస్తున్నారు.

వీరిద్దరూ విధి నిర్వహణలో ఉండగా అనుకోకుండా ఈ ఊహించని సంఘటన జరిగింది. వీరు పనిచేసే రెండు రైళ్లు పక్కపక్కనే ఆగి ఉన్నాయి. దీంతో ఒక ట్రైన్ లో విధి నిర్వహణలో ఉన్నా కొడుకు, మరోపక్క ట్రైన్ లో గార్డ్ విధులు నిర్వహిస్తున్న తండ్రితో సెల్ఫీ తీశాడు.

ఈ అద్భుతమైన సెల్ఫీ ని  For a change  అనే  ఫేస్బుక్ మాధ్యమంలో బెస్ట్ సెల్ఫీ ఆఫ్ ఎ ఫాదర్  అండ్ సన్ అని పోస్ట్ చేశారు. ఇది దాదాపు 1.5 మిలియన్ లైకులు పొందింది. వాట్ ఎ టైమింగ్ అంటూ ఒకరు, బెస్ట్ సెల్ఫీ ఆఫ్ ది ఇయర్ అంటూ మరొకరు, వండర్ఫుల్ అంటూ ఈ విధంగా నెటిజెన్లు అనేక విధాలుగా కామెంట్ చేస్తున్నారు.


End of Article

You may also like