చిరంజీవి వల్ల కృష్ణ ఆ సినిమాను వదిలేసుకోవాల్సి వచ్చిందా..? అసలు ఏం జరిగిందంటే..?

చిరంజీవి వల్ల కృష్ణ ఆ సినిమాను వదిలేసుకోవాల్సి వచ్చిందా..? అసలు ఏం జరిగిందంటే..?

by Anudeep

Ads

సినిమా అనే రంగుల లోకం అందరిని ఊరిస్తూనే ఉంటుంది. ఒక రకమైన మూస ధోరణిలో సినిమాలు రిలీజ్ అయిపోతున్న టైం లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఒక మాములు హీరోగా చిరంజీవి అడుగు పెట్టినప్పటికీ.. తన టాలెంట్ తో మెగాస్టార్ అన్న టైటిల్ ను సొంతం చేసుకున్నారు.

Video Advertisement

వినూత్నమైన నటన, కాన్సెప్ట్ లతో ప్రేక్షకులకు తక్కువ టైం లోనే చేరువ అయ్యారు. అటువంటి టైం లోనే కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో పసివాడి ప్రాణం సినిమా విడుదల అయ్యింది.

పసి వాడి ప్రాణం సినిమాలో హీరోయిన్ గా విజయశాంతి నటించారు. ఈ సినిమాను ఏ. కోదండ రామి రెడ్డి గారు డైరెక్ట్ చేసారు. పూవిను పూతియా పూంతెన్నల్ అనే మలయాళ సినిమా అప్పట్లో ఓ రేంజ్ లో హిట్ అయింది. ఆ తరువాత ఇదే సినిమాను తమిళంలో కూడా రీమేక్ చేయగా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే.. ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేయాలనీ చాలా మంది తెలుగు డైరెక్టర్లు, నిర్మాతలు ఎదురు చూసారు. అయితే ఈ సినిమా రీమేక్ రైట్స్ మాత్రం కోదండ రామి రెడ్డి గారికే దక్కాయి.

pasivadi pranam

అయితే.. ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ కూడా రీమేక్ చేయాలనీ భావించారు. అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న మహేష్ బాబుని ఈ సినిమాలో పసివాడుగా నటింప చేయాలనీ భావించారు. అంతా సిద్ధం చేసుకున్నాం అనుకునేలోపే ఈ సినిమాను చిరంజీవి రీమేక్ చేస్తున్నారని తెలియడంతో కృష్ణ గారు ఈ సినిమాను తీసే ఆలోచనని విరమించుకున్నారు. అలా ఈ సినిమాను ఎంత ఇష్టపడిన.. చిరంజీవి కోసం ఈ సినిమాను వదిలేసారు. ఈ సినిమా అప్పట్లోనే ఓ రేంజ్ లో రికార్డులు సృష్టించింది. అంతే కాదు.. తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమాతోనే చిరంజీవి బ్రేక్ డాన్స్ ను తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసారు.


End of Article

You may also like