Ads
టాలీవుడ్ నటి “సురేఖా వాణి” గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమాల్లో ఆమె ఎక్కువ గా అక్క, వదిన పాత్రలను పోషిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె సినిమాలు తగ్గించినా.. సోషల్ మీడియా లో మాత్రం ఆమె దుమ్ము రేపుతున్నారు.
Video Advertisement
సురేఖ వాణి తన కూతురు సుప్రీత తో పాటు సోషల్ మీడియా లో ఫొటోస్, వీడియోస్ అప్ లోడ్ చేస్తూ ఫుల్ ఆక్టివ్ గా ఉంటారు. వారిద్దరూ ఫోటోలు చుస్తే అక్క చెల్లెళ్ళ ఫోటోలు లాగా ఉంటాయి. వీరికి అభిమానులు కూడా ఎక్కువేనండోయ్. అయితే.. 2019 లోనే సుప్రీతా తండ్రి అనారోగ్యం తో మృతి చెందారు. మే 6 వ తేదీన ఆయన వర్ధంతి. ఈ ఏడాది కి ఆయన ఈ లోకాన్ని వీడి రెండు సంవత్సరాలు అవుతోంది.
ఈ సందర్భం గా సురేఖ కూతురు సుప్రీతా సోషల్ మీడియా లో ఓ పోస్ట్ ను షేర్ చేసారు. “ఈరోజు నా జీవితం లో చాలా చెత్త రోజు.. కొన్ని సార్లు కొంతమంది నుంచి ఎలాంటి కాల్స్ రావు., మనతో మాట్లాడరు కూడా.. అయినా మనం వారి గురించి ఆలోచిస్తూనే ఉంటాం.. దానినే ప్రేమ అంటాం. వుయ్ మిస్ యూ నాన్నా.. నువ్వు వెళ్లిపోయే రెండేళ్లు అయిపోయిందంటే నమ్మలేకపోతున్నా.. నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా..” అంటూ పోస్ట్ చేసారు. తన తండ్రిని తలచుకుని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఆ పోస్ట్ ను చూసిన అభిమానులు స్టే స్ట్రాంగ్ అంటూ ధైర్యం చెపుతున్నారు.
End of Article