అక్కినేని నట వారసుడు అఖిల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి సక్సెస్ అయిన సినిమాలకంటే ఫ్లాప్ అయిన మూవీస్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆయన ఈ సారైనా బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నారు.
ఈ సినిమా హిట్టయితే గాని అతని సినీ జీవితం గాడిలో పడదు. ప్రస్తుతం అఖిల్ “ఏజెంట్” అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దీనికి డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ఎలాగైనా 100 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందని అభిమానులు అనుకుంటున్నారు. ఈ తరుణంలోనే తాజాగా ఏజెంట్ మూవీ నుండి అఖిల్ ఫస్ట్ లుక్ విడుదల కాగా నెటిజన్లు కొన్ని నెగిటివ్ కామెంట్లు తీసుకువస్తున్నారు. ఈ లుక్ కాపీ అని , ఈ పోస్టర్ ను చూస్తుంటే గేమ్ ఆఫ్ త్రోన్స్ హీరో గుర్తుకు వస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.

జోన్ స్నోనీ హీరోనీ అఖిల్ కాపీ కొట్టారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ “ఏజెంట్” కాపీ మరక గురించి దర్శకుడు ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాల్సిందే. కానీ అఖిల్ ఈ మూవీలో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే సినిమా బ్లాక్ బ్లాస్టర్ టాక్ వస్తే మాత్రమే కమర్షియల్ గా విజయవంతం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.
ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య నడుస్తుండగా, మమ్ముట్టి మలయాళ నటుడు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 12వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానుంది అని, దీనికోసం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోందని సమాచారం.

వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారితో కలిపి మొత్తం 18 మంది పాల్గొన్నారు. వీరిలో ముఖ్యంగా అఖిల్,అరియనా, అనిల్, బిందు, మిత్ర, శివ, బాబా ఫినాలే కి చేరుకున్నారు. శనివారం రోజున గ్రాండ్ ఫినాలే జరగగా హీరో నాగార్జున బిందు మాధవిని విన్నర్ గా ప్రకటించాడు. ఇందులో అఖిల్ సర్థక్ రన్నరప్ గా నిలిచారు. ఇందులో యాంకర్ శివ మాత్రం రెండవ రన్నరప్ గా నిలిచాడు.
వీరి స్థానాలను ముందుగానే అంచనా వేసుకున్న అరియనా 10 లక్షల సూట్ కేస్ తో రేసు నుంచి పక్కకు తప్పుకుంది. మరి విజేతగా నిలిచిన టువంటి బిందుమాధవి ఎంత అమౌంట్ గెలుచుకుందో మీకు తెలుసా.. అక్షరాల 40 లక్షల రూపాయలు.. అయితే బిందుకు మాత్రం అరకోటి దక్కాలి కానీ మధ్యలోనే అరియనా డ్రాప్ అవడంతో ప్రైజ్ మనీ 10 లక్షలు తగ్గించారు.
మొత్తానికి ఊహించని గెలుపుతో బిందు మాధవి చాలా ఎమోషనల్ అయ్యింది. ఎవరికైనా కొన్ని రోజులు, కొన్ని నెలలు కష్టపడితే మాత్రం సక్సెస్ వస్తుంది. కానీ చాలామందికి ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే విజయం దక్కుతుంది. అలా ఆలస్యంగా విజయాన్ని అందుకునే వారికి నా గెలుపు అంకితం. ఎన్నో సంవత్సరాలు కష్టపడి తర్వాత నాకు ఈ ట్రోఫి దక్కింది అని బిందు భావోద్వేగానికి లోనయింది.