ధనుష్ గ్రే మ్యాన్ మూవీతో హాలీవుడ్ స్థాయికి ఎదిగాడు. దానితో అతను గ్లోబల్ లెవెల్ ఫేమస్ అయ్యాడు. అయితే ధనుష్ నుండి కొన్ని సార్లు చాలా రొటీన్ సినిమాలు వస్తాయి. మరోసారి సమాజాన్ని తట్టిలేపే సందేశాత్మక సినిమాలు వస్తాయి. మరి కొన్నిసార్లు హృదయానికి హత్తుకునే ఎమోషనల్ కథలతోనూ వస్తాడు.
ఇటీవల ధనుష్ తిరు సినిమాతో ప్రేక్షకులను ముందుకు వచ్చాడు. తెలుగులో అంతగా ఆడకపోయిన, తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫీల్ గుడ్ సినిమాగా పిలవబడింది ఈ సినిమా. తిరు (ధనుష్) మధ్యతరగతి యువకుడు. అతనికి తండ్రితో కలిగిన సమస్యల కారణంగా కష్టపడుతుంటాడు. అతనికి చిన్నప్పటి స్నేహితురాలు శోభన (నిత్యామీనన్) అన్నివేళలా తిరుకు తోడుగా ఉంటుంది.
తిరు ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేసే క్రమంలో అనూష, రంజనిలను ప్రేమిస్తాడు అయితే వారు అతన్ని ప్రేమించరు. నిరాశలోకి వెళ్ళిన అతన్ని వాళ్ల తాత శోభన స్నేహాన్ని, ప్రేమగా చెప్పడంతో అక్కడ నుండి కథ మలుపు తీసుకుంటుంది.
అయితే ఈ సినిమా అభిమానులకు నచ్చినప్పటికి, సూపర్ హిట్ అయినప్పటికీ మరికొంత మందికి నచ్చలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కోరాలో ఈ సినిమా గూర్చి చర్చ జరుగగా, ఈ సినిమాలో మూడు ప్రధాన లోపాలను కలిగి ఉన్నట్టుగా ఒకరు చెప్పారు. ఇవి నేటి యువతను పూర్తిగా తప్పు దారిలో నడిపిస్తుందని అన్నారు.
1. నిత్యా మీనన్ (శోభన) తనకు ప్రేమ కలిగిన వెంటనే తెలియజేసి ఉండాలని, అలా అప్పుడే చెప్పకుండా ఇరవై ఏళ్లు ఎందుకు ఎదురుచూసిందని, ధనుష్ (తిరు) తన తాత శోభన గురించి చెప్పేవరకు కూడా శోభన పై అతనికి ఏమీ అనిపించదు.
2. ఎదిగిన మనిషికి ఎదుటివారికి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో తెలియకుండా ఎలా ఉంటాడు. అది కాకుండా అతనికి ఎటువంటి ఫిలింగ్స్ లేకున్నా అతని తాత అతన్ని తప్పుదారి పట్టించాడు. ఇది కూడా అర్దం లేని విషయమే.
3.ఈ సినిమా ఒక అబ్బాయి మరియు అమ్మాయి మధ్య చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహాన్ని కూడా దిగజార్చిందని, వారు నిజంగా స్నేహితులు అయినప్పటికీ, అసంబద్ధ కారణాలతో వారిని ఒకరినొకరు ప్రేమించేలా చేసింది.
డైరెక్టర్ గారు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఎప్పటికీ మంచి స్నేహితుడిగా ఎందుకు ఉండలేడు. ఇది 1980ల కాలం కాదు. ప్రస్తుత ట్రెండ్ కి తగ్గ సినిమాలా లేదు. మీరు 2022లో ఉన్నారు.ప్రజల్లోకి తప్పుడు ఆలోచనలు, మూర్ఖత్వం ఇంజెక్ట్ చేయవద్దు అని అంటున్నారు.

అధిక బరువును ఎలా తగ్గించుకోవాలి,ఏం చేయాలి అనే దానిపై సమీరా ఫ్యాన్స్ కి సలహాలు కూడా ఇచ్చారు. వీక్లీ 4 సార్లు యోగా, బ్యాడ్మింటన్ చేయడంతో పాటు,అప్పడప్పుడు ఉపవాసం చేస్తూ బరువు తగ్గనని తెలిపారు అంతేకాకుండా సోషల్ మీడియాలో బరువు పెరిగిన ఫోటోను, తర్వాత సన్నగా అయిన ఫోటోను షేర్ చేసి ఎంతోమందికి మార్గదర్శకురాలిగా నిలుస్తున్నారు. ఇక సమీరా రెడ్డి రెండో బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఆ అనుభవాల్ని వెల్లడిస్తానని ముందే ఫ్యాన్స్ కి మాట ఇచ్చిన సమీరా, ఆ తరువాత ఆ విషయాల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటూ కాబోయే తల్లులకు ధైర్యాన్ని ఇస్తూ ఆదర్శంగా నిలుస్తునాన్నారు.
అంతేకాకుండా బిడ్డకు పాలివ్వడం వల్ల అందం చెడిపోతుందని రకరకాలుగా బయట సమాజం మాట్లాడుకుంటుంది. అలా అనుకోవడం సరికాదని చెబుతోంది. గోవాలో ఉంటున్న ఆమె రోజువారీ విశేషాలు, ఆరోగ్య చిట్కాలు, వంటలు వంటి అనేక విషయాలను సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో, నెటిజన్లతో పంచుకుంటూ అలరిస్తున్నారు. ఇక ఈ నేచురల్ బ్యూటీ అంటూ సమీరారెడ్డి మేకప్ లేకుండా పెట్టిన డీగ్లామరస్ ఫోటోలు ఒకవైపు వైరల్ అవుతుంటే,మరోవైపు వాటికి ట్రోల్స్ కూడా వస్తున్నాయి.అయిన ట్రోల్స్ అన్నిటికీ సమీరా ధీటుగా కౌంటర్లు ఇస్తుంటారు.
1949వ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు 18 ఫిబ్రవరిన అన్నపూర్ణను పెళ్లి చేసుకున్నారు. అయితే నాగేశ్వరరావు తన వివాహం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన తన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతూ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో తాజాగా సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఈ జంట తమ 78 సంవత్సరాల ప్రయాణంలో భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలో తమ వైవాహిక జీవితం ద్వారా చూపించారు. వీరికి ఐదుగురు పిల్లలు నాగార్జున, వెంకట్ రత్నం, సరోజ, సత్యవతి, నాగ సుశీల.
అక్కినేని నాగేశ్వరరావు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు. మాయాబజార్, బ్రతుకు వీధి, సంసారం, ఆరాధన, దొంగ రాముడు, అర్ధాంగి, డాక్టర్ చక్రవర్తి, ఇల్లరికం, మాంగల్య బలం, శాంతినివాసం, భార్య భర్తలు, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, బాటసారి, ధర్మదాత, కాలేజీ బుల్లోడు లాంటి బ్లాక్ బాస్టర్ మూవీస్ ను తెలుగు సినిపరిశ్రమకి అందించారు
1970ల లో తెలుగు సినిమా పరిశ్రమను మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తీసుకు రావటంలో ముఖ్య పాత్రను పోషించారు. 1976వ సంవత్సరంలో తన భార్య పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించి తెలుగు సినిమాకు మౌలిక సదుపాయాలను అందించారు. అక్కినేని నాగేశ్వరరావుతెలుగు సినిమా పై తనదైన ముద్రను వేశారు.
అదేం ఇంప్రెస్ చేసే స్టోరీ కాదు. ఆ సినిమాలో కథనం సరిగ్గా లేదు, ఇలా చాలా కామెంట్స్ వినిపించాయి. కానీ గాలోడు సినిమా 11 రోజుల్లో 8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది. ఈ సినిమాని 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదల చేస్తే, టార్గెట్ పూర్తి చేసి, లాభాల్లోకి వచ్చి, ప్రస్తుతం సూపర్ హిట్ దిశగా ముందుకెళ్తోంది. అయితే నిజానికి ఇది సుడిగాలి రేంజుకు చాలా పెద్ద విజయమే. ఇది పూర్తిగా సుధీర్ వ్యక్తిగత విజయం అని చెప్పాలి. బుల్లితెర పై తను తెచ్చుకున్న క్రేజ్ కూడా ఈ విజయానికి కారణం అయ్యింది.
వెండితెర పై కమెడియన్ పాత్రలు చేసే చాలామంది నటులు హీరోలుగా ప్రయత్నించి విఫలమైన ఉదంతాలు బోలెడు ఉన్నాయి. కానీ వాటిని పక్కన పెడితే సుడిగాలి సుధీర్ ఓ టీవీ షోలలో కామెడీ చేసే క్యారెక్టర్ మాత్రమే, ఈమధ్య కాలంలో టివి షోస్ కి హోస్టింగ్ కూడా చేస్తున్నాడు. సుధీర్ లో డాన్సర్, ఫైటర్ ఉన్నాడు. అయితే అన్నింటి కన్నా మంచి నటుడు ఉన్నాడు. అయితే సుధీర్కు సమయం కూడా కలిసొచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో గాలోడు సినిమాకు థియేటర్లు దొరికాయి. అయితే, పెద్ద పెద్ద హీరోల సినిమాలు డిజాస్టర్లు అవుతుంటే, ఒకప్పుడు అనామకుడు అని వెక్కిరింపుకు గురైన సుడిగాలి సుధీర్ హిట్ కొట్టాడు.
ఈమధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ‘బద్రి’ సినిమా సమయంలో ఇచ్చిన ఒక ఇంటర్వూ సోషల్ మీడియాలో షికారు చేసింది. తాజాగా 1998లో పవర్ స్టార్ ఇంటర్యూకి న్యూస్ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. అయితే పవన్ ఈ ఇంటర్యూలో పర్సనల్ మరియు వృత్తిపరమైన విషయాల గురించి కూడా చెప్పాడు. అందులో మీ మొదటి స్నేహితురాలు ఎవరని అడిగితే ఆరోజుల్లో నాతో మాట్లాడటానికి ఏ అమ్మాయి కూడా ఆసక్తి చూపించేవారు కాదని, నాలో స్పెషల్ ఏం లేదని ఆయన తెలిపాడు. ఇంకా చెప్తూ చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ అయస్కాంత ముక్కలు తెలీకుండా తీసుకున్న విషయం చెప్పాడు.
కానీ అప్పుడు చేసినదానికి ఇప్పటికీ కూడా ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది అని బాధ పడుతూనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. దేవదాసు సినిమాలోని అంతా భ్రాంతియేనా సాంగ్ , దాని సాహిత్యం, ట్యూన్ అంటే చాలా ఇష్టమనీ, ఆ ఇంటర్వూలో ఇంట్రెస్టింగ్ విషయాలను పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ ఇంటర్వూ వచ్చిన న్యూస్ పేపర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను 2023 సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
సంజయ్ లీలా భన్సాలీ
డైరెక్టర్ అట్లీ
ఏఆర్ మురుగదాస్
కొరటాల శివ
డైరెక్టర్ త్రివిక్రమ్
బోయపాటి శ్రీను



కానీ పూరీ జగన్నాథ్ కి తన కెరీర్లో మెగాస్టార్ చిరంజీవితో మూవీ చేసే ఛాన్స్ మాత్రం రాలేదు. అప్పట్లో ఒకసారి ‘ఆటో జానీ’ అంటూ వార్తలు వచ్చినా, ఆ తరువాత అది అక్కడే ఆగిపోయింది. మెగాస్టార్ రీఎంట్రీ తరువాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కొత్త దర్శకులకు కూడా అవకాశాలిస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే రీసెంట్గా పూరీ చెప్పిన కథ నచ్చి సినిమా అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ సినిమా డిజాస్టర్ అవడంతో, పాన్ ఇండియాగా విడుదలైన ఈ సినిమా పూరీకి భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో పూరీ కెరీర్లో కోలుకోవడం చాలా కష్టం అనే మాటలు ఎక్కువ వినిపించాయి. అయితే, పూరీ జగన్నాథ్ కి ఇలాంటి అప్ అండ్ డౌన్స్ మామూలే. తన స్కిల్నే నమ్ముకుని పూరీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేసాడు.

యశోద ఓటీటీ విడుదలపై క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. మయోసైటిస్తో అనే దీర్ఘకాలిక వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే సమంత ఈ సినిమాలో ఫైట్స్ చేసింది. సమంత చేసిన కొన్ని స్టంట్స్ అందర్నీ ఆశ్చర్యపర్చాయి. థియేటర్ల నుండి వెళ్లిపోయిన యశోద సినిమా కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇటీవల ఈ మూవీ పై ఇవా హాస్పటల్ పరువు నష్టం దావా వేసింది. ఈ మూవీ పై ఈవా పేరుతో ఉన్న సరోగసీ సెంటర్లో నేరం చేసినట్లుగా చూపించారని, ఓటీటీలో కూడా ఈ మూవీ రిలీజ్ ఆపేయాలని ఇవా హాస్పటల్ యాజమాన్యం డిమాండ్ చేసింది.
అయితే నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ వారితో రాజీ కుదుర్చుకున్నారు. ఓటీటీలో విడుదల చేసే వెర్షన్లో హాస్పటల్ బ్లర్ చేస్తామని చెప్పారు. దీంతో ఓటీటీ రిలీజ్కి అడ్డంకి తొలిగింది. డిసెంబరు 9న స్ట్రీమింగ్ అవబోతునట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ప్లాప్ సినిమాలనే త్వరగా ఓటీటీలో రిలీజ్ చేస్తారు.కానీ యశోద సినిమా హిట్ అయ్యింది. అయిన కూడా ఇంత త్వరగా ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారో అని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో హీరో నాని అర్జున్ సర్కార్ అనే పేరుగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని, సినిమా పూర్తి వివరాలను త్వరలో తెలియచేస్తామని చెప్పారు. ఇదివరకే దర్శకుడు శైలేష్ కొలను హిట్ వర్స్ ని ఎవెంజర్స్ మాదిరిగా చేస్తామని స్పష్టం చేశాడు. అంటే ఎవెంజర్స్ మూవీస్ లో ఒకేదానిలో ఇద్దరు ముగ్గురు హీరోస్ ఉంటారో, అలాగే హిట్ రాబోయే సిరీసుల్లో కూడా ఒకరు కంటే ఎక్కువ హీరోలు కనిపిస్తారని చెప్పారు. మరో విధంగా చెప్పాలంటే మల్టీస్టారర్ మూవీ అనవచ్చు.
ఇక హిట్-3లో నాచురల్ స్టార్ నానినే హీరో అనే విషయం తెలిసిందే. హిట్-2 సినిమా క్లైమాక్స్ లో ఆ విషయాన్ని చూపించారు. హీరో నానిని పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ గా ఇంట్రడ్యూస్ చేసారు. దీని ప్రకారం హిట్-3లో నానినే హీరో. అయితే తాజాగా శైలేష్ కొలను పెట్టిన పోస్ట్ తో నానితో పాటు అడివి శేష్, విశ్వక్ సేన్ లు ఈ సినిమాలో నటించే అవకాశం కనిపిస్తోంది.