ధనుష్ గ్రే మ్యాన్ మూవీతో హాలీవుడ్ స్థాయికి ఎదిగాడు. దానితో అతను గ్లోబల్ లెవెల్ ఫేమస్ అయ్యాడు. అయితే ధనుష్ నుండి కొన్ని సార్లు చాలా రొటీన్ సినిమాలు వస్తాయి. మరోసారి సమాజాన్ని తట్టిలేపే సందేశాత్మక సినిమాలు వస్తాయి. మరి కొన్నిసార్లు హృదయానికి హత్తుకునే ఎమోషనల్ కథలతోనూ వస్తాడు.
ఇటీవల ధనుష్ తిరు సినిమాతో ప్రేక్షకులను ముందుకు వచ్చాడు. తెలుగులో అంతగా ఆడకపోయిన, తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫీల్ గుడ్ సినిమాగా పిలవబడింది ఈ సినిమా. తిరు (ధనుష్) మధ్యతరగతి యువకుడు. అతనికి తండ్రితో కలిగిన సమస్యల కారణంగా కష్టపడుతుంటాడు. అతనికి చిన్నప్పటి స్నేహితురాలు శోభన (నిత్యామీనన్) అన్నివేళలా తిరుకు తోడుగా ఉంటుంది.
తిరు ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేసే క్రమంలో అనూష, రంజనిలను ప్రేమిస్తాడు అయితే వారు అతన్ని ప్రేమించరు. నిరాశలోకి వెళ్ళిన అతన్ని వాళ్ల తాత శోభన స్నేహాన్ని, ప్రేమగా చెప్పడంతో అక్కడ నుండి కథ మలుపు తీసుకుంటుంది.
అయితే ఈ సినిమా అభిమానులకు నచ్చినప్పటికి, సూపర్ హిట్ అయినప్పటికీ మరికొంత మందికి నచ్చలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కోరాలో ఈ సినిమా గూర్చి చర్చ జరుగగా, ఈ సినిమాలో మూడు ప్రధాన లోపాలను కలిగి ఉన్నట్టుగా ఒకరు చెప్పారు. ఇవి నేటి యువతను పూర్తిగా తప్పు దారిలో నడిపిస్తుందని అన్నారు.
1. నిత్యా మీనన్ (శోభన) తనకు ప్రేమ కలిగిన వెంటనే తెలియజేసి ఉండాలని, అలా అప్పుడే చెప్పకుండా ఇరవై ఏళ్లు ఎందుకు ఎదురుచూసిందని, ధనుష్ (తిరు) తన తాత శోభన గురించి చెప్పేవరకు కూడా శోభన పై అతనికి ఏమీ అనిపించదు.
2. ఎదిగిన మనిషికి ఎదుటివారికి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో తెలియకుండా ఎలా ఉంటాడు. అది కాకుండా అతనికి ఎటువంటి ఫిలింగ్స్ లేకున్నా అతని తాత అతన్ని తప్పుదారి పట్టించాడు. ఇది కూడా అర్దం లేని విషయమే.
3.ఈ సినిమా ఒక అబ్బాయి మరియు అమ్మాయి మధ్య చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహాన్ని కూడా దిగజార్చిందని, వారు నిజంగా స్నేహితులు అయినప్పటికీ, అసంబద్ధ కారణాలతో వారిని ఒకరినొకరు ప్రేమించేలా చేసింది.
డైరెక్టర్ గారు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఎప్పటికీ మంచి స్నేహితుడిగా ఎందుకు ఉండలేడు. ఇది 1980ల కాలం కాదు. ప్రస్తుత ట్రెండ్ కి తగ్గ సినిమాలా లేదు. మీరు 2022లో ఉన్నారు.ప్రజల్లోకి తప్పుడు ఆలోచనలు, మూర్ఖత్వం ఇంజెక్ట్ చేయవద్దు అని అంటున్నారు.

బరువు తగ్గడం వృత్తిపరంగా అవసరం అయితే తాను బరువు తగ్గడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. నేను ఖచ్చితంగా చేస్తానని తెలిపారు. నిజానికి మా పెళ్లిలో కూడా కొంత మంది దీని పై కామెంట్ చేశారు. ఇంతకు ముందు ఇలాగే ఉండేవారు. నా శరీరంతో ఇప్పుడు నేను కంఫర్టబుల్గా ఉన్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు బరువు తగ్గవచ్చని, ఫిట్నెస్ తో ఉన్నాను. నేను నా శరీరంతో సంతోషంగా ఉన్నాను. నేను లావుగా ఉండడం వల్ల ఇతరులకు ఎలా, ఎందుకు ఇబ్బందిగా ఉందో నాకు తెలియడం లేదు అని తెలిపింది.
నటి మంజిమా మోహన్ కొన్ని నెలలుగా షూటింగ్స్ నుండి విరామం తీసుకుంది. పెళ్లి తరువాత మీరు సినిమాల్లో నటిస్తారా అన్న ప్రశ్నకు సినిమాలు చేయడానికి సిద్ధమేనని మంచి స్టోరీ కోసం చూస్తున్నానని, త్వరలోనే కొత్త సినిమా గురించి వివరాలను తెలియచేస్తానని చెప్పారు.
ట్రోల్స్ పై మంజిమా మోహన్ స్పందించిన నేపథ్యంలో ఇప్పటి నుండి అయిన ఆమె పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగుతాయో చూడాలి మరి. మంజిమా మోహన్ కు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటి. నాగచైతన్య తో నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కంగనా రనౌత్ ‘చంద్రముఖి 2’లో రాజుగారి ఆస్థానంలో ఉండే ప్రసిద్ద నర్తకి పాత్రలో కనిపించనుంది. కంగనా రనౌత్ కు జంటగా తమిళ నటుడు రాఘవ లారెన్స్ నటించనున్నారు. ఇక ఈ సినిమాకి జాతీయ అవార్డు గ్రహీత కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా పని చేయనున్నారు. కంగనా ఈ పాత్రను చేయనుండడంతో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో మొదలవుతుందని సమాచారం.
కంగనా రనౌత్ ఈ షెడ్యూల్ లో పాల్గొననుందని తెలుస్తోంది. కంగనా దర్శకత్వం వహిస్తున్న రెండవ సినిమా ‘ఎమర్జెన్సీ’ తరువాత షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటుంది. అది ముగిసిన తర్వాత ‘చంద్రముఖి 2’ సెకండ్ షెడ్యూల్ జనవరిలో మొదలవుతుంది. ఈ సినిమాను అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన లైకా నిర్మిస్తోంది. ఇక కంగనా రనౌత్ ‘తేజస్’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇందులో ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రను పోషిస్తుంది. ఆమె చేతిలో మరో ప్రాజెక్ట్ ‘నోటి బినోదిని’ కూడా ఉంది.
