2023 ప్రపంచ కప్ ముగిసిపోయింది. ఆస్ట్రేలియాతో జరగనున్న టి20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఇండియా కి రానుంది. తెలుగు రాష్ట్రాల్లోని వైజాగ్ స్టేడియంలో ఒక మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ కి కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. సీనియర్ ప్లేయర్ లు అందరికీ విశ్రాంతి ఇవ్వడంతో జూనియర్ క్రికెటర్లకు ఈ సిరీస్ లో అవకాశం దొరికింది.
అయితే ఈ సెలక్షన్ పైన సర్వత్ర తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన ప్లేయర్ ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ప్రతిసారి అతనికి మొండి చేయి చూపిస్తున్నారని మండిపడుతున్నారు.

ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే సంజు శాంసన్. అతనిని ఎంపిక చేయకపోవడం పైన అభిమానులు బీసీసీఐ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజు పైన ఎందుకంత కక్ష అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా చేరారు. ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ కు సంజు శాంసన్ ను ఎంపిక చేయకపోవడం పైన బీసీసీఐ క్రికెట్ ఫ్యాన్స్ కు సమాధానం చెప్పాలని ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.సీనియర్ ప్లేయర్స్ లేనప్పుడు సంజుని కెప్టెన్ గా చేయాల్సింది.కేరళ స్టేట్ జట్టుతో పాటు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా చేసిన అనుభవం ఉంది. సూర్య కుమార్ యాదవ్ కంటే ఎక్కువ కెప్టెన్సీ అనుభవం సంజుకి ఉంది.

అలాంటి ఆటగాడిని జట్టులోకి ఎందుకు తీసుకోలేదు, చాహాల్ ని కూడా ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటూ ట్విట్ చేశారు.వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా ఇషాన్ కిషన్, జితేష్ శర్మను ఈ సిరీస్ కి ఎంపిక చేశారు. దాంతో సంజుకి చోటు దక్కకుండా పోయింది. ఈ నిర్ణయం పైన సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. టీంలో అవకాశం వచ్చిన ప్రతిసారి సంజూ రాణిస్తున్నాడని 80% సక్సెస్ అయ్యాడని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ లో ఏం జరిగిందో, ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ లో కూడా అదే చేసి సెలక్టర్లు సంజుకి అన్యాయం చేశారని మండిపడుతున్నారు.
Also Read:పేరుకి ఏమో నంబర్ 1 బ్యాట్స్మెన్… కానీ నీకంటే గల్లీ క్రికెటర్లు బాగా ఆడతారు ఏమో..!

 బౌలింగ్ ఆప్షన్గా దీపక్ హుడాను తీసుకున్నారని అయితే అనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. దీపక్ హుడాను 6వ బౌలింగ్ ఆప్షన్ గా తీసుకున్నారని అ నుకుంటున్నా, అతను అయితే గొప్ప ఆల్రౌండర్ కాదు. అతనికంటే కూడా దీపక్ చహర్ బాగా బౌలింగ్ చేయగలడు. కానీ, తొలిమ్యాచ్లో దీపక్ చహర్ను కాకుండా శార్దూల్ ఠాకూర్ ను తీసుకున్నారు. నెక్స్ట్ మ్యాచ్కే ఠాకూర్ను పక్కన పెట్టారు. ఇది సరి అయిన పద్దతి కాదు అని నెహ్రా తెలిపారు
బౌలింగ్ ఆప్షన్గా దీపక్ హుడాను తీసుకున్నారని అయితే అనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. దీపక్ హుడాను 6వ బౌలింగ్ ఆప్షన్ గా తీసుకున్నారని అ నుకుంటున్నా, అతను అయితే గొప్ప ఆల్రౌండర్ కాదు. అతనికంటే కూడా దీపక్ చహర్ బాగా బౌలింగ్ చేయగలడు. కానీ, తొలిమ్యాచ్లో దీపక్ చహర్ను కాకుండా శార్దూల్ ఠాకూర్ ను తీసుకున్నారు. నెక్స్ట్ మ్యాచ్కే ఠాకూర్ను పక్కన పెట్టారు. ఇది సరి అయిన పద్దతి కాదు అని నెహ్రా తెలిపారు నెహ్రా ఆ తరువాత సంజూ శాంసన్ పై గురించి నేను ఒకవేళ సెలక్టర్ ను అయి ఉంటే మాత్రం సంజూ శాంసన్ ను పక్కన పెట్టి, హుడానే తీసుకునేవాడినని చెప్పారు. అయితే ఇదే చర్చలో పాల్గొన్న మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ వాస్తవానికి సంజూ శాంసన్ గురించి చెప్తూ,అతను కొద్ది కాలంగా బాగా అడుతున్నప్పటికి ఎందుకో అతనికి ఎక్కువ అవకాశాలు రావట్లేదు. తాజాగా ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత పక్కన పెట్టారు అని సంజూకు అండగా నిలబడ్డాడు. మరోవైపు సోషల్ మీడియాలో సంజూశాంసన్ ను వివక్షపూరితంగానే రెండో వన్డేలో తీసుకోలేదంటూ ఫ్యాన్స్ బీసీసీఐని ట్రోల్ చేస్తున్నారు.
నెహ్రా ఆ తరువాత సంజూ శాంసన్ పై గురించి నేను ఒకవేళ సెలక్టర్ ను అయి ఉంటే మాత్రం సంజూ శాంసన్ ను పక్కన పెట్టి, హుడానే తీసుకునేవాడినని చెప్పారు. అయితే ఇదే చర్చలో పాల్గొన్న మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ వాస్తవానికి సంజూ శాంసన్ గురించి చెప్తూ,అతను కొద్ది కాలంగా బాగా అడుతున్నప్పటికి ఎందుకో అతనికి ఎక్కువ అవకాశాలు రావట్లేదు. తాజాగా ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత పక్కన పెట్టారు అని సంజూకు అండగా నిలబడ్డాడు. మరోవైపు సోషల్ మీడియాలో సంజూశాంసన్ ను వివక్షపూరితంగానే రెండో వన్డేలో తీసుకోలేదంటూ ఫ్యాన్స్ బీసీసీఐని ట్రోల్ చేస్తున్నారు.